News April 24, 2025

ఉగ్రదాడి ఎఫెక్ట్.. 90శాతం బుకింగ్స్ క్యాన్సిల్

image

పహల్‌‌గామ్ ఉగ్రదాడి ఘటన జమ్మూకశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జమ్మూకశ్మీర్ పర్యటన కోసం చేసుకున్న బుకింగ్స్ 90 శాతం వరకూ రద్దు చేసుకున్నట్లు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడకు వెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపడం లేదని తెలిపాయి. కాగా ముష్కరుల దాడి నేపథ్యంలో అక్కడినుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తిరిగి వస్తున్నారు.

News April 24, 2025

పాక్ హై కమిషనర్‌కు కేంద్రం సమన్లు

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ హై కమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వారంలో భారత్‌ను విడిచి వెళ్లాలని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌ను ఆదేశించింది. మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్ గ్రేటా’ జారీ చేసింది.

News April 24, 2025

42 ఏళ్లు బహ్రెయిన్‌లో చిక్కుకున్నాడు.. ఎట్టకేలకు విముక్తి

image

కేరళకు చెందిన గోపాలన్ చంద్రన్ బతుకుదెరువు కోసం 1983లో బహ్రెయిన్ వెళ్లారు. అక్కడ ఆశ్రయం కల్పించిన యజమాని చనిపోవడంతో ఆయనకిచ్చిన పాస్‌పోర్టు కూడా మిస్ అయింది. అప్పటి నుంచి చంద్రన్ బహ్రెయిన్‌లోనే చిక్కుకున్నారు. ఎట్టకేలకు ‘ప్రవాసీ లీగల్’ సంస్థ సాయంతో ఇన్నేళ్లకు భారత్‌కు తిరిగొచ్చారు. 4 దశాబ్దాలుగా బిడ్డ రాక కోసం చూస్తున్న 95 ఏళ్ల తల్లి ఎదురుచూపులు ఫలించాయి.

News April 24, 2025

RESULTS: తండ్రీకూతుళ్లు ఒకేసారి టెన్త్ పాస్

image

AP: చిత్తూరు(D) రొంపిచెర్లకు చెందిన షబ్బీర్ 1996లో టెన్త్ ఫెయిలయ్యారు. ఇటీవల ఓపెన్ స్కూల్ పరీక్షలు రాశారు. నిన్న వెలువడిన ఫలితాల్లో షబ్బీర్ 319, ఆయన కూతురు 309 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అన్నమయ్య(D) ఆవుల శెట్టివారిపల్లెకు చెందిన మోడెం వెంకటేశ్ 9వ తరగతి వరకు చదివి ఆపేశారు. మళ్లీ ఇప్పుడు టెన్త్ చదివి పరీక్షలు రాయగా 268 మార్కులు వచ్చాయి. ఆయన కూతురు పూజిత 585 మార్కులు సాధించింది.

News April 24, 2025

పాక్ హీరోతో సినిమా.. భారత హీరోయిన్‌పై ఫైర్

image

పాక్ హీరో ఫవాద్ ఖాన్ మూవీని ప్రమోట్ చేశారంటూ విమర్శల నేపథ్యంలో బాలీవుడ్ నటి వాణీ కపూర్‌ ‘X’లో అందుకు సంబంధించిన పోస్టర్‌ను డిలీట్ చేశారు. ఫవాద్, వాణీ ‘అబీర్ గులాల్’లో జంటగా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ పోస్టర్‌ను నిన్న ‘X’లో షేర్ చేశారు. అయితే పహల్‌గామ్ ఉగ్రదాడి సందర్భంగా పాక్ నటుడి చిత్రాన్ని ప్రమోట్ చేస్తారా? అంటూ నెటిజన్స్ నటిపై ఫైర్ అయ్యారు. దీంతో ఆ పోస్టర్‌ను ఆమె తొలగించారు.

News April 24, 2025

చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్

image

నిన్న SRHతో మ్యాచ్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. ముంబై ఇండియన్స్(IPL&CLT) తరఫున అత్యధిక సిక్సర్లు(259) బాదిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కీరన్ పొలార్డ్(258), సూర్యకుమార్(127), హార్దిక్ పాండ్య(115), ఇషాన్ కిషన్(106) ఉన్నారు. 2009-14 మధ్య ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని ఎడిషన్లకు MIకి రోహిత్, పొలార్డ్ ప్రాతినిధ్యం వహించారు.

News April 24, 2025

మూడు రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రానున్న మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందంది. రెండురోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప పగటి వేళల్లో ప్రజలు బయటకు వెళ్లరాదని సూచించింది. కాగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో గడిచిన మూడురోజుల్లో 19మంది వడదెబ్బతో మృతిచెందారు.

News April 24, 2025

గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఐసిస్ కశ్మీర్ నుంచి తనకు బెదిరింపులు వచ్చినట్లు ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ తరహా బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ‘ఐ కిల్ యూ’ అని గంభీర్‌కు మెయిల్ వచ్చినట్లు సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 24, 2025

ఉగ్రదాడి: ఆ సినిమా విడుదలపై నిషేధం

image

పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాను భారత్‌లో విడుదల కానిచ్చేది లేదని పశ్చిమ భారత సినీ ఉద్యోగుల సంఘం(FWICE) స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ‘ఉగ్రదాడుల నేపథ్యంలో భారత సినిమాల్లో పాక్ నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులపై నిషేధం విధిస్తున్నాం. భారతీయ సినిమా నుంచి ఎవరూ వారితో కలిసి పనిచేయకూడదు. అబిర్ గులాల్ సినిమాను భారత్‌లో నిషేధిస్తున్నాం’ అని అందులో పేర్కొంది.

News April 24, 2025

ఉగ్ర దాడి.. మరో విషాదగాథ

image

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటనలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీ(33)కి రెండేళ్ల కిందటే పెళ్లైంది. UAEలో పనిచేస్తున్న అతను సిమ్లాలో ఓ పెళ్లి కోసం ఇటీవలే భార్యతో కలిసి INDకు వచ్చారు. అది పూర్తయ్యాక పహల్‌గామ్ వెళ్లి టెర్రరిస్టుల చేతిలో మరణించారు. ఇతని తండ్రి పదేళ్ల కిందటే చనిపోగా తల్లి జ్యోతి కష్టపడి చదివించారు. నీరజ్ చనిపోవడంతో తల్లి, భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు.