India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తిరుపతి లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని TTD మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని చెప్పారు. సిట్ దర్యాప్తుతో నిర్దోషులను దోషులుగా చూపించే అవకాశం ఉందనే అనుమానాలతో దానిని వ్యతిరేకించామన్నారు. తాను ఛైర్మన్గా ఉన్నప్పుడు AR కంపెనీ నెయ్యి సప్లై చేయలేదని వైవీ స్పష్టం చేశారు.
బెంచ్మార్క్ సూచీలు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అప్పటికప్పుడు పెరుగుతూ తగ్గుతూ వణుకు పుట్టిస్తున్నాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడైన సూచీలు మధ్యాహ్నం భారీగా పుంజుకున్నాయి. 12.30PM తర్వాత మళ్లీ తగ్గాయి. 160 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ ప్రస్తుతం 26 పాయింట్ల నష్టంలో ఉంది. 800 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ -160కి వెళ్లింది. ఇంట్రాడే గరిష్ఠాల నమోదుకు ఇన్ఫీ, యాక్సిస్ బ్యాంకు షేర్లు తోడ్పడ్డాయి.
AP: రాష్ట్రంలో టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బయటి రాష్ట్రాల్లో పంట దిగుబడి తగ్గడంతో మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు పెరిగాయి. ఇవాళ ఉదయం ఒకటో రకం టమాటా 10 కిలోల కనిష్ఠ ధర రూ.820, గరిష్ఠ ధర రూ.880, మోడల్ కాయల ధర రూ.860 పలికింది. ఇక్కడ నిన్న కిలో ధర గరిష్ఠంగా రూ.90 పలికింది. ఇటు బహిరంగ మార్కెట్లో ఏ గ్రేడ్ టమాటా రూ.90-100, కాస్త తక్కువ రకం రూ.60-70 వరకు పలుకుతోంది. మీ ఏరియాలో ధరలెలా ఉన్నాయి?
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘కల్తీ జరిగిందో లేదో దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు సీబీఐ, ఏపీ పోలీసులు, FSSAI అధికారులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసింది. సత్యమేవ జయతే. ఓం నమో వేంకటేశాయ’ అని ట్వీట్ చేశారు.
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ను ఏర్పాటుచేసిన అంశంపై మాట్లాడే అవకాశం ఉంది. కాగా ధర్మాసనం తీర్పుపై ఆయన YCP ముఖ్య నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు.
AP: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై <<14268817>>సుప్రీంకోర్టు<<>> ఆగ్రహం వ్యక్తం చేసిందని టీడీపీ Xలో వెల్లడించింది. ఇది సీరియస్ వ్యవహారమని చెప్పిందని పేర్కొంది. రాష్ట్ర అధికారులతోపాటు సీబీఐ, FSSAI సభ్యులతో సిట్ కొనసాగింపునకు ఓకే చెప్పిందని తెలిపింది. దీంతో జగన్& కో పాపం పండిందని రాసుకొచ్చింది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కొవ్వు నేతలు విచారణకు సిద్ధంగా ఉండాలంది.
మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సురేఖ తమ కుటుంబ పరువుకు భంగం కలిగించారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో వాయిదా పడింది. ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే ఆసక్తి నెలకొంది.
టెస్లా కార్ల కంపెనీ చవకైన సైబర్ ట్రక్లను తయారుచేస్తోందని ఇన్వెస్టర్ సావ్యర్ మెర్రిట్ తెలిపారు. తక్కువ ఖరీదైన నాన్-ఫౌండేషన్ సిరీస్ సైబర్ట్రక్లను ఆర్డర్ చేసుకోవచ్చని టెస్లా అధికారికంగా ఆహ్వానించడం మొదలుపెట్టింది. దీని విలువ $79,990 వద్ద ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520KMS వెళ్తుంది. కాగా, టి-మోటార్ సైబర్ బీస్ట్ కూడా $99,990కు ఆర్డర్ చేయవచ్చు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన మూవీ ‘కిక్’. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీ రీమేక్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. దర్శక నిర్మాత సాజిద్ నడియాద్వాలా ‘కిక్-2’ మూవీని ప్రకటించారు. బ్లాక్ బనియన్లో సల్మాన్ స్టిల్ను Xలో పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాతో సల్మాన్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మహాయుతి ప్రభుత్వం తీసుకొచ్చిన లడ్కీ బెహన్ స్కీమ్తో మహిళలకు లబ్ధి కలుగుతున్నా మరోవైపు వారిపై అఘాయిత్యాలు పెరిగాయని NCP SCP నేత శరద్ పవార్ అన్నారు. సోషల్ మీడియాలో పలు అంశాలపై స్పందించారు. గణేశ్ పూజకోసం CJI ఇంటికి PM వెళ్లడంపై మాట్లాడేందుకు నిరాకరించారు. వారివి అత్యున్నత పోస్టులని, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని పేర్కొన్నారు. MVA సీట్ల పంపకాల చర్చల్లో తాను పాల్గొనడం లేదన్నారు.
Sorry, no posts matched your criteria.