India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: 3 శాఖల్లో 21 ఉద్యోగాలకు APPSC <
ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్లు తీసుకునే పెద్ద హీరోలతో ₹వందల కోట్లు వెచ్చించి సినిమా తీసి, టికెట్ ధరలు పెంచుకున్నా ₹200 కోట్లు రాబట్టడం గగనమైపోతోంది. అలాంటిది ఏ హడావిడి లేకుండా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని ₹15కోట్లతో రూపొందించగా ఇప్పటికే ₹225 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. క్వాలిటీ ప్రజెంటేషన్ సినిమాను బాక్సాఫీస్ వద్ద నిలబెడుతుందని ఇది నిరూపించింది.
హురున్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెస్ జాబితాలో ముకేశ్ అంబానీ కుటుంబం మరోసారి టాప్లో నిలిచింది. రూ.28.2 లక్షల కోట్లతో ఈ ఫ్యామిలీ అగ్రస్థానం సాధించింది. రూ.6.5 లక్షల కోట్లతో కుమార్ మంగళం బిర్లా కుటుంబం రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో రూ.5.7 లక్షల కోట్లతో జిందాల్ ఫ్యామిలీ, 4వ స్థానంలో రూ.5.6 లక్షల కోట్లతో బజాజ్ ఫ్యామిలీ, ఐదో స్థానంలో రూ.5.4 లక్షల కోట్లతో మహీంద్రా కుటుంబం నిలిచింది.
ఉన్నత చదువుల కోసం US వెళ్లిన HYD అమ్మాయి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీజ(23) చికాగోలో ఉంటూ ఇటీవలే MS పూర్తి చేశారు. నిన్న ఓ రెస్టారెంట్ నుంచి తాను ఉండే అపార్ట్మెంట్కు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మరణించారు. శ్రీజ చెల్లెలు శ్రేయ కూడా MS చేసేందుకు ఇటీవల US వెళ్లారు. కూతురి మరణంతో ఆమె పేరెంట్స్ బోరున విలపిస్తున్నారు.
AP: తీవ్ర ఉద్రిక్తతల మధ్య పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. పులివెందులలో సా.4 గంటల వరకు 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా ఒంటిమిట్టలో 70శాతం పోలింగ్ రికార్డయింది. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా సాగిన ఈ బై ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి.
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో రాణించిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచారు. జులైలో అద్భుత ప్రదర్శనకు గానూ ఆయనకు ఈ అవార్డు ప్రకటించినట్లు ఐసీసీ తెలిపింది. ఈ అవార్డుకు దక్షిణాఫ్రికా ప్లేయర్ వియాన్ ముల్డర్, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా పోటీపడ్డారు. ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఇంగ్లండ్ ప్లేయర్ సోఫియా డంక్లీ నిలిచారు.
AP: రాజధాని అమరావతిలో మొత్తం రూ.81,317 కోట్ల విలువైన పనులు చేపట్టాలని CRDA ప్రతిపాదించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఇందులో భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్ట్లు, ట్రంక్ ఇన్ఫ్రా, వరద నియంత్రణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రికార్డు టైంలో ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని CRDAపై సమీక్షలో సీఎం ఆదేశించారు.
ఈనెల 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఫాస్టాగ్ ఏడాది పాస్ను మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ‘Rajmarg Yatra’ యాప్ లేదా NHAI అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించాలి. వాహన నంబర్/ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ప్రస్తుత FASTag యాక్టివ్గా ఉండేలా, విండ్షీల్డ్పై అతికించి ఉండాలి. తర్వాత రూ.3,000 ఛార్జ్ ఆన్లైన్ ద్వారా చెల్లించండి. ఆ తర్వాత మీ ఏడాది పాస్ను ప్రస్తుత FASTagకి లింక్ చేయండి.
హైదరాబాద్ మెట్రోకు కేంద్ర క్యాబినెట్ మరోసారి మొండిచేయి చూపింది. ఇవాళ్టి సమావేశంలో బెంగళూరు, థాణె, పుణే, ఢిల్లీ, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు రూ.1.09 లక్షల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అనుమతించింది. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-3పై ప్రకటనేమీ లేకపోవడంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYD రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగిందని, మెట్రో నిర్మాణానికి అనుమతివ్వాలని కోరుతున్నారు.
డైట్ ప్లాన్ కోసం ChatGPTని వాడిన 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. టేబుల్ సాల్ట్కు బదులు సోడియం బ్రోమైడ్ తీసుకోవాలని సూచించడంతో అతను 3 నెలలుగా దీనిని వాడుతున్నాడు. ఇది విషంగా మారడంతో అతను మతిస్థిమితం కోల్పోయాడని, తీవ్రదాహం, పట్టుకోల్పోవడం వంటి సమస్యలు ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత అతను కోలుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.