News October 4, 2024

తిరుమల లడ్డూ వ్యవహారం.. సుప్రీం కీలక ఆదేశాలు

image

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఐదుగురు సభ్యులతో SIT ఏర్పాటు చేసి అందులో CBI నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒక నిపుణుడిని ఉంచాలని సూచించింది. CBI డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించింది. ఈ లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది.

News October 4, 2024

పర్యావరణ పరిరక్షణలోనూ చైనా దూకుడు!

image

చైనా పర్యావరణ పరిరక్షణలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. దశాబ్దాల క్రితం కాలుష్యంతో నిండిపోయిన నదులు, సరస్సులను పరిశుభ్రంగా మార్చేసింది. ప్రజల కోసం స్వచ్ఛమైన గాలి, నీరును అందిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. 1998లో చైనాలోని లియాంగ్మా నది అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు చుట్టూ పచ్చదనం, పరిశుభ్రత, నీటితో నిండిపోయింది. హాంగ్‌జౌలోని వెస్ట్ లేక్‌ని కూడా బ్యూటిఫుల్‌గా మార్చేశారు.

News October 4, 2024

విచారణపై కేంద్రం పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది: తుషార్

image

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం ఉందని కేంద్రం తరఫున వాదిస్తున్న తుషార్ మెహతా అన్నారు. అయితే విచారణపై కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సిట్ సభ్యులపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. సుప్రీం ఏం చెబుతుందో వేచి చూడాలి.

News October 4, 2024

హర్షసాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు

image

AP: తనను యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. హర్షసాయి తనపై సోషల్ మీడియాలో కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇప్పటికే హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News October 4, 2024

శ్రీవిష్ణు ‘స్వాగ్’ మూవీ రివ్యూ& రేటింగ్

image

పురుషాధిక్యం, లింగ సమానత్వానికి సంబంధించిన కథాంశంతో శ్రీవిష్ణు హీరోగా ‘స్వాగ్’ మూవీ రూపొందింది. రాజరాజ చోర ఫేమ్ హసిత్ గోలీ తెరకెక్కించిన ఈ సినిమాలో కామెడీ సీక్వెన్స్ బాగున్నాయి. 4 విభిన్న పాత్రల్లో హీరో యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. రీతూవర్మ, మీరాజాస్మిన్, సునీల్ తమ పరిధి మేరకు బాగా నటించారు. గందరగోళంగా ఉన్న ఫస్టాఫ్, క్లైమాక్స్, స్క్రీన్‌ప్లే మైనస్.
*రేటింగ్: 2.25/5

News October 4, 2024

4 నెలలుగా పాక్ క్రికెటర్లకు జీతాల్లేవ్

image

పాకిస్థాన్ క్రికెట్ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. బంగ్లా చేతిలో ఓటమి, కెప్టెన్సీ నుంచి బాబర్ వైదొలగడం, బోర్డులో మార్పులతో గందరగోళం కొనసాగుతోంది. 4 నెలలుగా ఉమెన్స్, మెన్స్ ప్లేయర్లకూ జీతాలు అందడం లేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 25 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ 2026 వరకు ఉండగా, త్వరలోనే సమీక్షించనున్నట్లు సమాచారం. జెర్సీలపై లోగో స్పాన్సర్‌షిప్ పేమెంట్లూ రావట్లేదని తెలుస్తోంది.

News October 4, 2024

నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే గ్రూప్-1 ఫలితాలు: TGPSC

image

TG: 563 గ్రూప్-1 ఉద్యోగాలకు జూన్‌‌లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని TGPSC హైకోర్టుకు తెలిపింది. 7వేలకు పైగా అభ్యంతరాలను నిపుణుల కమిటీకి పంపామని, వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తామని నివేదించింది. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా కొత్తది విడుదల చేయడం చెల్లదని, కీపై అభ్యంతరాలను పట్టించుకోవట్లేదని పలువురు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News October 4, 2024

గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

image

AP: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై రెండవ రోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దుర్గమ్మ దర్శనార్థం భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి రోజు బాలాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.

News October 4, 2024

రుణమాఫీపై సీఎం చెప్పినవన్నీ డొల్లమాటలే: KTR

image

వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని కేటీఆర్ విమర్శించారు. ‘20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది. ఓవైపు DEC 9న ఏకకాలంలో చేస్తామని దగా. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం. అనధికారికంగా ఇంకా రుణమాఫీ కాని రైతులెందరో? సీజన్ ముగిసినా రైతుబంధు ఇవ్వలేదు. రాబందుల ప్రభుత్వంతో రైతులకేం లాభం’అని ట్వీట్ చేశారు.

News October 4, 2024

నస్రల్లా భావి వారసుడే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు

image

బీరుట్‌లోని హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఓ వైపు గ్రౌండ్ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే లెబనాన్ వ్యాప్తంగా ఎయిర్‌స్ట్రైక్స్ చేపట్టామని వెల్లడించింది. మరణించిన హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హషీమ్ సఫియుద్దీన్ టార్గెట్‌గా ఈ భీకర దాడులు జరిగినట్టు తెలిసింది. అతడు బతికున్నాడో లేదో రెండు వర్గాలూ అధికారికంగా ప్రకటించలేదు.