News August 13, 2025

భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

image

తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, చెట్లు, కరెంట్ స్తంభాల కింద నిల్చోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ‘నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనాలు నడపడం ప్రమాదకరం. సెల్లార్‌లోకి వరద చేరినప్పుడు షార్ట్ సర్క్యూట్ కాకుండా మెయిన్ ఆఫ్ చేయాలి. విష జ్వరాలు రాకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి’ అని చెబుతున్నారు.

News August 13, 2025

ఈ జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు

image

TG: అతిభారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో మరో 3 జిల్లాల్లోని స్కూళ్లకు <<17387525>>సెలవులు<<>> ప్రకటించారు. జగిత్యాల (D)లో నేడు, రేపు.. ఆసిఫాబాద్(D)లో ఇవాళ ఒక్కరోజు స్కూళ్లకు సెలవులిస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్‌ ఉట్నూర్ ITDA పరిధిలోనూ ఇవాళ ఒక్క రోజు హాలిడే ప్రకటించారు. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున పిల్లలు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

News August 13, 2025

ఒక దాత హృదయం ఎప్పటికీ ఆగిపోదు!

image

అన్ని దానాల కన్నా అవయవదానం ఎంతో గొప్పది. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని అవయవాలు మరికొంతమందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలవు. కానీ ఎవరూ ఇందుకు ముందుకు రాకపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అందుకే ఇకనైనా మీలో ఉన్న సందేహాలను వదిలేసి NOTTO, జీవన్‌దాన్ పోర్టల్ ద్వారా అవయవదానానికి ప్రతిజ్ఞ చేయండి. డొనేట్ చేసిన విషయాన్ని తప్పకుండా కుటుంబసభ్యులకు తెలియజేయండి. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం.

News August 13, 2025

APPLY: ఇండియన్ నేవీలో 1,266 జాబ్స్

image

ఇండియన్ నేవీ 1,266 సివిలియన్ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి పాసై ITI సర్టిఫికెట్/ సంబంధిత విభాగంలో శిక్షణ పొంది 18-25 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ల వారీగా వయసు సడలింపు ఉంటుంది. నేటి నుంచి సెప్టెంబర్ 2 వరకు <>indiannavy.gov.in<<>> సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.19,900-రూ.63,200 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. SHARE IT.

News August 13, 2025

మద్యం వినియోగంలో తెలంగాణ టాప్

image

TG: మద్యం వినియోగంలో రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున ఏడాదికి విదేశీ మద్యం, బీరు కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నట్లు NIPFP స్టడీలో తేలింది. జాతీయ సగటు రూ.486 ఉండటం గమనార్హం. అలాగే రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో సిగరెట్ల కోసం యావరేజ్‌గా ఏడాదికి రూ.624 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు వార్షిక వ్యక్తిగత వినియోగ ఖర్చులో సిక్కిం (రూ.1,45,261) అగ్రస్థానంలో ఉంది.

News August 13, 2025

రీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం: అవినాశ్

image

AP: 2 కేంద్రాల్లో రీ పోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్య తీసుకుందని YCP MP అవినాశ్ రెడ్డి విమర్శించారు. తాము 15 చోట్ల కోరితే 2 చోట్ల పోలింగ్ చేపట్టారని, దీన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ‘కోర్టుకు ఏదో కారణం చెప్పడానికే రీ పోలింగ్‌ చేపట్టింది. ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారు. ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరిగి ఉండదు. పులివెందులలో బాబు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు’ అని ఫైర్ అయ్యారు.

News August 13, 2025

వచ్చే నెల ట్రంప్‌‌తో మోదీ భేటీ?

image

PM మోదీ వచ్చే నెల USలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమ్మిట్‌‌‌లో భాగంగా SEP 23 నుంచి జరిగే హైలెవల్ మీటింగ్‌‌లో PM పాల్గొంటారని సమాచారం. ఆ సమయంలో US ప్రెసిడెంట్ ట్రంప్‌ని కలిసి ట్రేడ్ డీల్, టారిఫ్స్‌పై చర్చించే అవకాశముంది. అలాగే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని కూడా PM కలవొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.

News August 13, 2025

‘నవోదయ’లో ప్రవేశాలు.. నేడే చివరి తేదీ

image

దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఇటీవలే గడువు ముగియగా విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ పొడిగించారు. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ <>క్లిక్<<>> చేసి అప్లై చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న, J&K సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న ప్రవేశ పరీక్ష జరగనుంది.

News August 13, 2025

ఏపీలో అతి భారీ వర్షాలు.. సెలవులు ఇస్తారా?

image

AP: రాష్ట్రంలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా అతి భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులివ్వాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు 2 రోజులు సెలవులిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

News August 13, 2025

మహిళను చేయి పట్టి లాగడం నేరమేమీ కాదు: హైకోర్టు

image

ఎలాంటి దురుద్దేశం లేకుండా ఓ పురుషుడు మహిళను చేయి పట్టి లాగడం నేరమేమీ కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అది బాధ పెట్టే చర్య మాత్రమేనని పేర్కొంది. 2015లో చోళవందానైకి చెందిన మురుగేశన్ ఓ దివ్యాంగురాలిని చేయి పట్టి లాగినట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అతడు హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.