News October 4, 2024

కొండా సురేఖను వదిలేది లేదు: అఖిల్

image

మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం. సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది. అమాయకులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేసింది. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సమాజంలో అలాంటి వాళ్లకు స్థానం లేదు’ అని అఖిల్ ట్వీట్ చేశారు.

News October 4, 2024

Stock Marketలో యుద్ధ కల్లోలం.. నేడెలా మొదలయ్యాయంటే?

image

స్టాక్ మార్కెట్లు రేంజుబౌండ్లో ట్రేడవుతున్నాయి. నిన్నటి క్రాష్‌తో పోలిస్తే నేడు మోస్తరు నష్టాల్లోనే సూచీలు ఆరంభమయ్యాయి. విలువైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. BSE సెన్సెక్స్ 82,479 (-17), NSE నిఫ్టీ 25,237 (-12) వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో 24 కంపెనీలు లాభాల్లో, 25 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, ONGC, టైటాన్, SBI లైఫ్, BEL టాప్ గెయినర్స్.

News October 4, 2024

13న అలయ్ బలయ్.. చంద్రబాబు, రేవంత్‌కు ఆహ్వానం: విజయలక్ష్మి

image

TG: ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘అలయ్ బలయ్’ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. CMలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.

News October 4, 2024

ప్రతీకార దాడికి DEADLY WEAPONS సిద్ధం చేస్తున్న ఇజ్రాయెల్!

image

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారదాడి ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఈసారి సైబర్ వార్‌ఫేర్‌కు దిగొచ్చని విశ్లేషకుల అంచనా. ది బెస్ట్ సైబర్ టీమ్ UNIT 8200 వారి సొంతం. కోవర్ట్ ఆపరేషన్స్ చేపట్టిన అనుభవం దీనికుంది. పేజర్ పేలుళ్ల మాదిరిగా ఇరాన్ మిలిటరీ, న్యూక్లియర్, ఆయిల్ ఫెసిలిటీస్‌పై సైబర్ అటాక్స్ చేయొచ్చని తెలిసింది. గతంలో నటాంజ్ న్యూక్లియర్ సైట్‌లో Stuxnet కంప్యూటర్ వైరస్‌ దాడితో ఇరాన్ విలవిల్లాడింది.

News October 4, 2024

ప్రతి రైతుకి యూనిక్ ఐడీ కార్డు.. వ్యవసాయ శాఖ కసరత్తు

image

APలోని రైతులందరికీ యూనిక్ ఐడీ కార్డులు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ-పంట కోసం రైతుల ఆధార్‌ను వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానించారు. ఈ నేపథ్యంలో ID కార్డుల జారీ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 50 లక్షల మంది రైతులుండగా, 1.90 లక్షల మంది అటవీ భూముల రైతులనూ ఇందులోకి తెస్తున్నారు.

News October 4, 2024

USలో 27 ఏళ్లు వచ్చినా కొందరు చిన్నపిల్లలే: సర్వే

image

అమెరికా అభివృద్ధిలో దూసుకెళ్తున్నప్పటికీ అక్కడున్న వారు ఆలోచనల్లో కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. ‘టాకర్ రీసెర్చ్’ సర్వే ప్రకారం చాలా మంది అమెరికన్లు 27 ఏళ్లు వచ్చాకే లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారని తేలింది. ఇందులో 11% మంది ఇంకా పెద్దవాళ్లం కాలేదన్నారు. అడల్ట్‌హుడ్ అంటే బిల్లులు చెల్లించడమేనని 56% మంది చెప్పారు. 45% మంది ఆర్థిక స్వాతంత్ర్యం, బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడమన్నారు.

News October 4, 2024

జంతువులకూ ఓ రోజు ఉంది!

image

ప్రకృతి జీవావరణాన్ని సమతుల్యంగా ఉంచడానికి పర్యావరణ వ్యవస్థలోని అన్ని జాతులు సహజీవనం చేస్తాయి. జంతు హక్కులు, సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జంతు సంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం దీని ఉద్దేశం. 1925, మార్చి 24న జర్మనీలోని బెర్లిన్‌లో తొలిసారి జంతువుల దినోత్సవాన్ని నిర్వహించారు.

News October 4, 2024

ఒక్క ఫోన్ కాల్.. ఆగిన మహిళ గుండె!

image

డబ్బు కోసం తెలివిమీరిన మోసగాడు చేసిన పనికి ఓ మహిళ గుండె ఆగింది. ఆగ్రాకు చెందిన ప్రభుత్వ టీచర్ మాల్తీ వర్మకు ఆగంతకుడి నుంచి వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చింది. పోలీస్ ఫోటో డీపీగా పెట్టిన దుండగుడు ‘నీ కూతురు సెక్స్ రాకెట్‌లో దొరికింది’ అని మాల్తీకి చెప్పాడు. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తానన్నాడు. కూతురి గురించి అలాంటి వార్త వినడంతో తీవ్ర ఆందోళనకు గురై ఆమె గుండెపోటుతో మరణించింది. దీనిపై కేసు నమోదైంది.

News October 4, 2024

సోదరి నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు: CM రేవంత్

image

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్నిచ్చింది. తాజాగా ఆమెకు రేవంత్ లాఠీని బహూకరించారు. ‘పేదరికాన్ని జయించి, సమానత్వాన్ని సాధించి, విశ్వక్రీడా వేదికపై తెలంగాణ కీర్తి పతాకను ఎగరేసి, నేడు ప్రజా ప్రభుత్వంలో డీఎస్పీగా నియమితులైన సోదరి నిఖత్ జరీన్‌కు హార్దిక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

News October 4, 2024

గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ALERT

image

AP: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు, టీచర్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. <>www.ceoandhra.nic.in<<>> ద్వారా ఫామ్-18, 19 సమర్పించాలని సూచించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్లు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల టీచర్ల నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించామన్నారు.