India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీకి ఓట్లేసి మద్దతు పలికిన వారు ఆలోచించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు కోరారు. ‘దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న జగన్ లాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వారు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? అని విచక్షణతో ఆలోచించాలి’ అని సూచించారు. జగన్ విధ్వంసం భరించలేమని ఇతర రాష్ట్రాల్లో పనులు చేసే వారు సైతం వచ్చి ఓటు వేశారని అన్నారు.
TG: గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు దిగారు. గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3వేల పోస్టులు పెంచాలని కోరారు. గ్రూప్-2, 3 పరీక్షలను DEC వరకు వాయిదా వేయాలని, GO 46ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెగా DSC విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
UGC NETపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. అందుబాటులో ఉన్న సమాచారంతో పొరపాట్లను గుర్తించి పరీక్షను <<13472127>>రద్దు <<>>చేసినట్లు తెలిపింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా జూన్ 18న NTA నిర్వహించిన ఈ పరీక్ష 9 లక్షల మంది విద్యార్థులు రాశారు. తదుపరి నిర్వహణ తేదీని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
AP: అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన MLA, MLC క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు. భవనాలు బూజు పట్టిపోయాయి. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది’ అని అన్నారు.
‘కల్కి’ ప్రీరిలీజ్ ఈవెంట్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్మాత అశ్వినీ దత్ కాళ్లకు నమస్కరించారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘అమితాబ్ బచ్చన్ ఇలా చేయడం అశ్వినీదత్ సాధించిన విజయాల్లో అత్యున్నతం. NTR నుంచి తాజా యువ హీరోల వరకు ఎవరూ ఇలా చేసి ఉండరు. బిగ్ బీ తన కెరీర్ మొత్తంలో మరే ఇతర నిర్మాతకు ఇలా చేయడం నేను చూడలేదు’ అని ట్వీట్ చేశారు.
AP: అమరావతి ఏపీ ప్రజలందరి చిరునామా అని సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు. ‘జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. అమరావతిపై నిత్యం విష ప్రచారం చేశారు. అర్హత లేని వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుందో ఐదేళ్లు చూశాం. అందుకే జగన్ లాంటి సీఎం అవసరం లేదని ప్రజలు విసిరికొట్టారు’ అని అన్నారు.
శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత్ తన జోరును కొనసాగిస్తుందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అయితే ఆర్థిక అసమానతలను ఈ వృద్ధి తగ్గించలేదని అభిప్రాయపడ్డారు. రాయిటర్స్ సంస్థ నిర్వహించిన పోల్లో నిపుణులు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఆర్థిక అసమానతలను ప్రధాన సమస్యగా పరిగణించట్లేదని పేర్కొన్నారు. కాగా వీరిలో పలువురు ఈ ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 484 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి పాసై 18-26 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. జీతం రూ.19,500- రూ.37,815 వరకు అందుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 27లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్:https://ibpsonline.ibps.in/cbiskssnov23/
రామాయణం ఆధారంగా ఐఐటీ బాంబేలో కొంతమంది విద్యార్థులు వేసిన నాటకం విమర్శలకు దారి తీసింది. మార్చి 31న రాహోవన్ పేరిట చేసిన ఆ నాటకం హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో నాటకం వేసిన వారిలో కొంతమందికి యాజమాన్యం తలా రూ.1.2లక్షల జరిమానా విధించింది. మరికొంతమందికి రూ.40వేలు, జూనియర్ స్టూడెంట్స్కు హస్టల్ నిషేధం వంటి శిక్షల్ని విధించింది.
భారత్ సంపద మరో 50ఏళ్లలో 10రెట్లు (1000%) పెరుగుతుందని NSE ఎండీ ఆశీష్ కుమార్ అంచనా వేశారు. యువత ద్వారా భారత్ గణనీయ వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వీస్ సెక్టార్ భారత్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అయితే పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, పౌష్టికాహార లోపం, పారిశుద్ధ్యం, రవాణాకు సంబంధించి దేశం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.