News June 16, 2024

ఆ బాత్‌రూమ్ పెద్దగా ఉంది?.. ఎవరికి స్కెచ్ వేశావు జగన్?: TDP

image

AP: రుషికొండలో భవనాలు రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టినవైతే ఇన్నాళ్లూ ఎందుకు దాచి పెట్టారంటూ YCPకి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ‘ఇన్నాళ్లూ టూరిజం భవనాలని ఎందుకు చెప్పారు? దొరికిపోయాక ఇప్పుడెందుకు కథలు చెప్తున్నారు? బీచ్ వ్యూ పాలెస్ తనకు కావాలని భార్య అడిగిందే తడవుగా ప్రజాధనం తగలేశావు జగన్. అసలు ఆ బాత్ రూమ్ ఏంటి జగన్.. అంత పెద్దగా ఉంది? అసలు ఏం ప్లాన్ చేశావు? ఎవరికి స్కెచ్ వేశారు?’ అంటూ సెటైర్లు వేసింది.

News June 16, 2024

అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు: సదా

image

తాను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నానని, పెళ్లి చేసుకుని దానిని వదులుకోలేనని హీరోయిన్ సదా తెలిపారు. ‘ఇంతవరకూ నా హృదయానికి ఎవరూ దగ్గర కాలేదు. ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా. నేను అరేంజ్‌డ్ మ్యారేజ్‌కు వ్యతిరేకం. లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటా. భాగస్వామిని భరించడం కష్టం అనిపిస్తే విడాకులు తీసుకోవడంలో తప్పు లేదు. ఇబ్బందులు పడుతూ కాపురం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చారు.

News June 16, 2024

నీట్ వివాదంపై సుప్రీం కమిటీతో విచారణ జరిపించాలి: సిబల్

image

నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసి స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తాజాగా డిమాండ్ చేశారు. పరీక్షను సవ్యంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలతో కేంద్రం చర్చించాలని ఓ ఇంటర్వ్యూలో సూచించారు. ‘నీట్ అక్రమాలపై పీఎం మౌనంగా ఉండటం సరికాదు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.

News June 16, 2024

ఆర్బీఐకి అంతర్జాతీయ అవార్డు

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయ అవార్డు లభించింది. లండన్‌కు చెందిన పబ్లిషింగ్ హౌస్ ‘సెంట్రల్ బ్యాంకింగ్’ RBIకి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రిస్క్ కల్చర్, అవేర్‌నెస్‌ను పెంపొందించినందుకు గాను అవార్డు అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News June 16, 2024

‘షుగర్ ఫ్రీ’ స్వీట్లతో గుండెకు ముప్పు?

image

డయాబెటిస్ ఉన్నవారు షుగర్ ఫ్రీ స్వీట్లు తీసుకుంటుంటారు. కానీ వాటి వలన హృద్రోగాలు వస్తాయని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తీపి కోసం కలిపే ఎరిథ్రిటాల్, సుక్రలోజ్, జినిటాల్ వంటి రసాయనాలు ప్రమాదకరమని వివరిస్తున్నారు. 3300మందిపై మూడేళ్ల పాటు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని వారు స్పష్టం చేశారు. రక్తంలోకి చేరే జినిటాల్.. ప్లేట్‌లెట్లను గడ్డకట్టేలా చేసి హృద్రోగానికి కారణమవుతోందని పేర్కొన్నారు.

News June 16, 2024

రుషికొండ భవనాలపై విమర్శలు.. YCP ఫైర్

image

AP: విశాఖ రుషికొండలో భవనాలపై వస్తున్న <<13451877>>విమర్శలపై<<>> YCP స్పందించింది. ‘అవి ప్రభుత్వ భవనాలే. ప్రైవేట్ ఆస్తులు కావు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని కట్టింది. విశాఖ ఆర్థిక రాజధాని అని CBN 1995 నుంచి ఊదరగొడుతున్నాడు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, PM విశాఖ వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనం లేదు. వీటి ఫొటోలను వైరల్ చేస్తూ బురదచల్లడం వెనుక ఉద్దేశమేంటో ప్రజలకు తెలుసు’ అని ఫైర్ అయింది.

News June 16, 2024

బాత్‌రూమ్ గోడలపై కాల్ గర్ల్ అంటూ పిచ్చిరాతలు.. షాక్ ఇచ్చిన కోర్టు

image

బాత్‌రూమ్ గోడలపై మహిళ ఫోన్ నంబరును ‘కాల్ గర్ల్’ అంటూ రాసిన వ్యక్తిపై నమోదైన కేసును కొట్టేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులను కఠినంగా పరిగణిస్తామంది. పిటిషనర్ చర్యతో మహిళ మానసికంగా చిత్రహింసలకు గురైందని వ్యాఖ్యానించింది. మహిళల గోప్యతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలు సమర్థనీయం కాదని తెలిపింది. బాధితురాలి నంబరు నిందితుడికిచ్చిన మహిళను కూడా విచారించే హక్కు అధికారులకు ఉందని చెప్పింది.

News June 16, 2024

రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?

image

TG: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది.

News June 16, 2024

రూ.లక్ష కోట్లతో అమరావతి నిర్మాణం: నారాయణ

image

AP: అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను రాజధాని రైతులు సన్మానించారు. ‘అమరావతి పనులపై అధ్యయనం చేసి టైమ్‌బౌండ్ నిర్ణయిస్తాం. పాత ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మిస్తాం. 3 దశల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. తొలి దశ పనులకు రూ.48వేల కోట్లు ఖర్చవుతాయి. రాజధానిలో రోడ్లు ధ్వంసం, చోరీలపై కమిటీతో విచారణ జరిపిస్తాం’ అని తెలిపారు.

News June 16, 2024

CM రేవంత్‌కు తెలియకుండానే జగన్ ఇంటి నిర్మాణం కూల్చేశారా?: BJP MLA

image

TG: హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ ఇంటి ముందున్న నిర్మాణాన్ని GHMC అధికారులు కూల్చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌‌రెడ్డికి తెలియకుండానే ఆ నిర్మాణాలు కూల్చివేశారా? అని ప్రశ్నించారు. కూల్చివేసిన అధికారులను ఎందుకు <<13451537>>బదిలీ<<>> చేశారని ఆయన అడిగారు. కాగా అదే ప్రాంతంలో ఉన్న ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఫిర్యాదుతోనే కూల్చివేత చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.