India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ YS షర్మిల బహిరంగ లేఖ రాశారు. ‘సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మీకు శుభాకాంక్షలు. ఐదేళ్ల విధ్వంస పాలనను గాడిలో పెట్టేందుకు ప్రజలు అధికారమిచ్చారు. వారం రోజులుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ విగ్రహాలపై జరుగుతున్న దాడులు నన్ను కలచివేశాయి. మీ అనుభవంతో పరిస్థితులను చక్కదిద్ది ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు.
AP: ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. కేబినెట్లో చోటు కల్పించినందుకు CBNకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. మరి కాసేపట్లో మంత్రులకు శాఖలు ఖరారు కానున్నాయి. అటు పవన్ కళ్యాణ్కు ఏ శాఖ వస్తుంది? ఏపీ ఐటీ మంత్రి ఎవరనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడింది. తన దళానికి చెందిన టాప్ కమాండర్ హజ్ అబూ తలేబ్ను ఇజ్రాయెల్ చంపడంతో ప్రతీకార దాడికి దిగింది. నార్త్ ఇజ్రాయెల్పై భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ప్రాణనష్టంపై సమాచారం అందలేదు. కాగా ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్లకు హెజ్బొల్లా మద్దతు ప్రకటించింది. ఈ గ్రూప్కు ఇరాన్ సాయమందిస్తోంది.
AP: జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని YCP నేత YV సుబ్బారెడ్డి విమర్శించారు. ‘2014 నుంచి 19 వరకు CBN ఇలాంటి పాలనే చేశారు. ప్లాన్ ప్రకారం YCP కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారు. కొన్నిచోట్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పోలీసులు పట్టించుకోవడంలేదు. ఈ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఆ తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని YVS వెల్లడించారు.
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కన్నౌజ్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ఆయన ఎంపీగా కొనసాగుతానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఫైజాబాద్ ఎంపీగా గెలుపొందిన పార్టీ సీనియర్ నేత అవధేశ్ ప్రసాద్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను శాసనసభ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి పంపారు. ఇటీవల యూపీలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో SP 37 స్థానాలు గెలుచుకుంది.
స్టార్ హీరోయిన్ సమంత మాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన ఆమె నటిస్తారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పటివరకు మలయాళంలో సినిమా చేయలేదు.
తన భర్త సీఎం అయ్యేవరకూ తనకు తెలియదని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ భార్య ప్రియాంక మాఝీ తెలిపారు. టీవీలో చూసే తాను ఈ విషయం తెలుసుకున్నానని ఆమె చెప్పారు. ‘నా భర్త సీఎం అవుతారని ఊహించలేదు. మంత్రి పదవి దక్కుతుందని భావించాం. కానీ ఏకంగా ఆయన సీఎం అయ్యారు’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఒడిశా మూడో గిరిజన ముఖ్యమంత్రిగా మాఝీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ సహాయమంత్రి <<13416466>>శ్రీనివాస వర్మ<<>> కీలక వ్యాఖ్యలు చేశారు. ‘స్టీల్ ప్లాంట్ AP ప్రజలకు సెంటిమెంట్తో కూడుకున్నది. ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతా. ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తా. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం. ఏపీకి కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇచ్చింది. రాబోయే ఐదేళ్లు కూటమితో కలిసి ముందుకెళ్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.
AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా.. ఆశిస్తున్నా’ అంటూ చిరంజీవి Xలో పోస్ట్ పెట్టారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
వందేభారత్ ట్రైన్లో టికెట్ లేని ప్రయాణికులతో రద్దీగా ఉన్నట్లు వైరల్ అయిన <<13419254>>వీడియో<<>> పాతదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కొందరు రైతులు బలవంతంగా రైలులోకి ఎక్కినప్పుడు జరిగిన సంఘటన అని Xలో పేర్కోంది. పాత వీడియోను ప్రచారం చేస్తున్నారని.. దయచేసి ఇలాంటివి చేయొద్దని కోరింది. ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.