India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వికారాబాద్(D) పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలోని 2,901 ఎకరాల భూమిని ఇండియన్ నేవీ తమ అధీనంలోకి తీసుకుంది. ఇక్కడ వెరీ లో ఫ్రీక్వెన్సీ(VLF) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఏర్పాటు చేయనుంది. తాజాగా ఈ ప్రాంతం చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభం కాగా 2027 నాటికి స్టేషన్ను నిర్మించనుంది. మరోవైపు అటవీప్రాంతంలో నిర్మిస్తుండటాన్ని పలువురు స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
– బేస్ పే & ఆఫీస్ అలవెన్స్ కలిపి నెలకు రూ.1.60 లక్షలు
– ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.1.5 లక్షలు
– ఏడాదికి 34 ఫ్రీ ఫ్లైట్ టికెట్స్
– అపరిమిత 1st AC ట్రైన్ టికెట్స్
– ఉచిత నివాస గృహం
– ఏడాదికి ఉచితంగా 50వేల యూనిట్ల విద్యుత్ వినియోగం
– పార్లమెంట్ సెషన్స్ సమయంలో DA రూ.2వేలు
– ఉచితంగా CGHS వైద్యం పొందొచ్చు
– మాజీ ఎంపీలకు నెలకు కనీసం రూ.25 వేల పెన్షన్
పుట్టిన రోజు సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన పెద్దల్లుడు, టీడీపీ నేత నారా లోకేశ్ కూడా బాలయ్యకు విషెస్ తెలిపారు. ‘నా ముద్దుల బాలా మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ బాలకృష్ణ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. అటు రాజకీయ, సినీ ప్రముఖులు బాలయ్యకు విషెస్ తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.
ఏపీ కేబినెట్లో జనసేన 5 మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సీఎంతో కలిపి 26 మందికి మించి మంత్రివర్గం ఉండకూడదనేది నిబంధన. ఈసారి టీడీపీ నుంచి ఊహించినదానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఆశావహులు కూడా ఎక్కువే ఉండనున్నారు. దీంతో CBN సహా 20 టీడీపీకి, జనసేనకు 5, బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. దీనిపై రేపు ఎమ్మెల్యేల భేటీలో క్లారిటీ రావొచ్చు.
మోదీ మళ్లీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని ఎన్నికల ఫలితాల ముందు సవాల్ చేసిన ఆప్ నేత సోమ్నాథ్ భారతి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. అన్న మాటను నిలబెట్టుకునేందుకు నిరాకరించారు. మోదీ కూటమి సాయంతో సర్కారు ఏర్పాటు చేయడమే అందుకు కారణమట. ఇప్పటికీ అన్న మాట మీదే నిలబడతానన్న సోమ్నాథ్.. మోదీ సొంతంగా గెలవనందున ఇది ఆయన విజయం కాదన్నారు. కాబట్టి తాను గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకునేందుకు ఎంపీలు ఆశ పడుతుంటారు. కానీ, కొందరికే అవకాశం దక్కుతుంది. అయితే, ఎంపీ సురేశ్ గోపి మాత్రం కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశాక.. తనకు ఈ పదవిపై ఇంట్రెస్ట్ లేదంటున్నారు. ‘కేంద్ర మంత్రి పదవిపై నాకు ఆసక్తి లేదు. ఎంపీగా నేను బాగా రాణిస్తా. సినిమాల్లో నటించడాన్ని కొనసాగిస్తా. ఇదే విషయాన్ని పార్టీకి తెలిపా.. త్వరలో నాకు ఉపశమనం లభించవచ్చు’ అని ఆయన చెప్పారు.
టీ20 WC తర్వాత 8 నెలలకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 2025 FEB 19-MAR9 మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం లాహోర్ వేదికగా INDvsPAK మ్యాచ్ జరగనున్నట్లు CRICBUZZ పేర్కొంది. అయితే దీనికి భారత ప్రభుత్వం, బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని తెలిపింది. ఒకవేళ పాక్లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
వర్చువల్ <<13412919>>అటాప్సీ<<>> విధానం 80-90% అసహజ మరణ కేసులకు అనుకూలమని డాక్టర్లు తెలిపారు. విషప్రయోగం లాంటి కొన్ని కేసుల్లో మృతికి గల కారణాలు తేల్చాలంటే మృతదేహాల పొట్టభాగంలో కత్తిగాట్లు తప్పనిసరి అని చెబుతున్నారు. మూత్రం, మలం, ఫ్లూయిడ్ టెస్టులు చేయాల్సిన కేసుల్లోనూ కత్తిగాట్లు తప్పవని అంటున్నారు. వర్చువల్ అటాప్సీకి 30min మాత్రమే పడుతుందని, ప్రస్తుతం చేస్తున్న పోస్టుమార్టం 3-4hrలో పూర్తవుతుందని వివరించారు.
కత్తిగాటు లేకుండా వర్చువల్ అటాప్సీ విధానంలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసే టెక్నాలజీ త్వరలో ఏపీలో రానుంది. ఈ విధానాన్ని అనుసరించాలని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చింది. సీటీ, ఎమ్మారై, 3D ఫొటోగ్రామ్మెట్రీ టెక్నాలజీ ఉన్న యంత్రంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. మృతదేహాన్ని బ్యాగుల్లో ఉంచి యంత్రంలోకి పంపిస్తే అన్ని కోణాల్లో ఇమేజెస్ జనరేట్ అవుతాయి. వాటిని బట్టి మృతికి గల కారణాలను నిర్ధారిస్తారు.
నిన్న తొలి ఇన్నింగ్స్లో INDను 119 రన్స్కే PAK కట్టడి చేయడంతో ఆ దేశ PM షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. ‘పాక్ టీమ్ గ్రేట్ బౌలింగ్. టోర్నీలో ఇది గొప్ప మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నా. ఛేజింగ్కు దిగే అబ్బాయిలకు ఆల్ ది బెస్ట్’ అని రాసుకొచ్చారు. అయితే పాక్ మ్యాచ్ ఓడిపోవడంతో ఆయన మళ్లీ ఎలాంటి ట్వీట్ చేయలేదు. దీంతో ‘గుర్తుపెట్టుకోండి.. ఎప్పుడూ ముందే సంబరాలు చేసుకోవద్దు’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.