India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకారదాడి ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఈసారి సైబర్ వార్ఫేర్కు దిగొచ్చని విశ్లేషకుల అంచనా. ది బెస్ట్ సైబర్ టీమ్ UNIT 8200 వారి సొంతం. కోవర్ట్ ఆపరేషన్స్ చేపట్టిన అనుభవం దీనికుంది. పేజర్ పేలుళ్ల మాదిరిగా ఇరాన్ మిలిటరీ, న్యూక్లియర్, ఆయిల్ ఫెసిలిటీస్పై సైబర్ అటాక్స్ చేయొచ్చని తెలిసింది. గతంలో నటాంజ్ న్యూక్లియర్ సైట్లో Stuxnet కంప్యూటర్ వైరస్ దాడితో ఇరాన్ విలవిల్లాడింది.
APలోని రైతులందరికీ యూనిక్ ఐడీ కార్డులు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ-పంట కోసం రైతుల ఆధార్ను వెబ్ల్యాండ్తో అనుసంధానించారు. ఈ నేపథ్యంలో ID కార్డుల జారీ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 50 లక్షల మంది రైతులుండగా, 1.90 లక్షల మంది అటవీ భూముల రైతులనూ ఇందులోకి తెస్తున్నారు.
అమెరికా అభివృద్ధిలో దూసుకెళ్తున్నప్పటికీ అక్కడున్న వారు ఆలోచనల్లో కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. ‘టాకర్ రీసెర్చ్’ సర్వే ప్రకారం చాలా మంది అమెరికన్లు 27 ఏళ్లు వచ్చాకే లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారని తేలింది. ఇందులో 11% మంది ఇంకా పెద్దవాళ్లం కాలేదన్నారు. అడల్ట్హుడ్ అంటే బిల్లులు చెల్లించడమేనని 56% మంది చెప్పారు. 45% మంది ఆర్థిక స్వాతంత్ర్యం, బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడమన్నారు.
ప్రకృతి జీవావరణాన్ని సమతుల్యంగా ఉంచడానికి పర్యావరణ వ్యవస్థలోని అన్ని జాతులు సహజీవనం చేస్తాయి. జంతు హక్కులు, సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జంతు సంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం దీని ఉద్దేశం. 1925, మార్చి 24న జర్మనీలోని బెర్లిన్లో తొలిసారి జంతువుల దినోత్సవాన్ని నిర్వహించారు.
డబ్బు కోసం తెలివిమీరిన మోసగాడు చేసిన పనికి ఓ మహిళ గుండె ఆగింది. ఆగ్రాకు చెందిన ప్రభుత్వ టీచర్ మాల్తీ వర్మకు ఆగంతకుడి నుంచి వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చింది. పోలీస్ ఫోటో డీపీగా పెట్టిన దుండగుడు ‘నీ కూతురు సెక్స్ రాకెట్లో దొరికింది’ అని మాల్తీకి చెప్పాడు. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తానన్నాడు. కూతురి గురించి అలాంటి వార్త వినడంతో తీవ్ర ఆందోళనకు గురై ఆమె గుండెపోటుతో మరణించింది. దీనిపై కేసు నమోదైంది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్నిచ్చింది. తాజాగా ఆమెకు రేవంత్ లాఠీని బహూకరించారు. ‘పేదరికాన్ని జయించి, సమానత్వాన్ని సాధించి, విశ్వక్రీడా వేదికపై తెలంగాణ కీర్తి పతాకను ఎగరేసి, నేడు ప్రజా ప్రభుత్వంలో డీఎస్పీగా నియమితులైన సోదరి నిఖత్ జరీన్కు హార్దిక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
AP: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు, టీచర్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. <
SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. పలు విభాగాల్లో 1,497 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీటెక్, BE, ఎంటెక్, Mscతో పాటు పని అనుభవం కలిగిన వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750(SC, ST, దివ్యాంగులకు మినహాయింపు). ఇతర వివరాలు, అప్లై చేసుకోవడానికి <
ఇరాన్ మిసైళ్ల దాడికి ఇజ్రాయెల్ ఎందుకు ప్రతీకారదాడి చేయలేదు? అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇది. యుద్ధ నిపుణులు భారత్నూ ఓ కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం INS శార్దూల్, INS టిర్, ICGS వీరా గల్ఫ్ తీరంలో ఇరాన్తో కలిసి ఓ ట్రైనింగ్లో పాల్గొంటున్నాయి. ఇప్పుడు ఎయిర్స్ట్రైక్స్ జరిగితే కలిగే నష్టం అపారం. అందుకే ఇజ్రాయెల్తో భారత్ ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. నౌకలు తిరిగొచ్చాక ఏమవుతుందో చూడాలి.
బ్రెంట్ క్రూడాయిల్ రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వ్యాఖ్యలే ఇందుకు కారణం. మొన్నటి వరకు బ్యారెల్ సగటున $70 పలికింది. ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించడంతో పరిస్థితి మారింది. ఇరాన్ ఆయువుపట్టయిన ఆయిల్ ఫీల్డ్స్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల గురించి డిస్కస్ చేస్తామని జోబైడెన్ గురువారం చెప్పారు. దీంతో క్రూడ్ వెంటనే $75 డాలర్లకు చేరింది. ఇవాళ ఇంకా పెరిగే ఛాన్సుంది.
Sorry, no posts matched your criteria.