India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 28 ఏళ్ల వయసులో కాంగ్రెస్ తరఫున MLAగా గెలిచి మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. తదనంతరం TDPలో చేరి 1984, 94 సంక్షోభ సమయంలో కీలకంగా వ్యవహరించారు. 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టి 2004 వరకు కొనసాగారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో 4వసారి CMగా బాధ్యతలు చేపట్టనున్నారు.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతల వారసులు ఓటమిపాలయ్యారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వీరు కూటమి సునామీలో కొట్టుకుపోయారు. తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్రెడ్డి, బందర్లో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పరాజయం చవిచూశారు. ఎక్కువ మంది మంత్రులు కూడా ఓటమి అంచున ఉన్నారు.
AP: కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ దాదాపు 25 ఏళ్ల తర్వాత గెలిచింది. చివరిసారిగా 1999లో ఖలీల్ బాషా విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 09లో అహ్మదుల్లా(కాంగ్రెస్), 2014, 2019లో అంజాద్ బాషా(వైసీపీ) గెలిచారు. అలాగే ఒక ముస్లిమేతర వ్యక్తి అక్కడ గెలవడం 35 ఏళ్లలో ఇదే తొలిసారి. 1989లో శివానందరెడ్డి(INC) గెలవగా, ఇప్పుడు మాధవీరెడ్డి(టీడీపీ) సంచలన విజయం సాధించారు.
AP: ఎన్డీయే కూటమి గాలిలో వైసీపీ మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం గెలుపొందారు. పుంగనూరు నుంచి ఆయన మరోసారి విజయం సాధించారు. కాగా పుంగనూరులో పెద్దిరెడ్డి బలమైన కేడర్ ఉండటం వల్ల ఇంత గాలిలోనూ ఆయన గెలిచి నిలిచారు. తన సహచర మంత్రులందరూ ఓటమి ఎదుర్కొన్నా తాను మాత్రం విజయం సాధించారు.
లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడిపోయారు. అమేథీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ చేతిలో ఆమె లక్ష ఓట్ల పైచిలుకు తేడాతో పరాజయం పాలయ్యారు.
హస్తినలో రాజకీయం పీక్స్కు చేరింది. ఒకవైపు జేపీ నడ్డా నివాసంలో కేంద్రమంత్రులు భేటీ కాగా.. మరోవైపు ఖర్గే ఇంట్లో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఫలితాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండటంతో అధికారం చేపట్టేందుకు ఇరు వర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయి. కాసేపట్లో రెండు కూటములు గెలిచే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్పై 84,824 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మల్లు రవి గతంలో 1991, 1998లో ఎంపీగా గెలుపొందారు.
గుడివాడలో టీడీపీ జెండా ఎగిరింది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొడాలి నాని ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వెనిగండ్ల రాము 51 వేల ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగరేశారు.
కేంద్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సునాయాసంగా అధికారం చేపడుతుందనుకున్న BJP చెమటోడుస్తోంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ తారుమారు చేస్తోంది. దీంతో NDA, INDIA కూటమిలోని ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్లుగా మారనున్నాయి. TDP చీఫ్ చంద్రబాబు, SP చీఫ్ అఖిలేశ్, TMC అధ్యక్షురాలు మమతా బెనర్జీ, JDU అధినేత నితీశ్ కుమార్, DMK చీఫ్ స్టాలిన్ తదితరుల నిర్ణయంపై NDA, INDIA భవితవ్యం ఆధారపడి ఉంది.
AP: విపక్షాలపై ఐదేళ్లుగా మాటల దాడి చేసి, డాన్సులతో సంబరాల రాంబాబు అని పేరు తెచ్చుకున్న మంత్రి అంబటి రాంబాబు ఓటమి చవిచూశారు. సత్తెనపల్లిలో ఆయన ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి కన్నా 27,196 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Sorry, no posts matched your criteria.