India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఈనెల 5వ తేదీలోపు అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఎంపికైన 11,062 మంది అభ్యర్థులకు దసరా పండుగలోపు ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
ఇటీవల షూటింగ్లో గాయపడిన రవితేజ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. దసరా తర్వాత ఈ నెల 14 సెట్స్లో అడుగుపెడతారని టాలీవుడ్ టాక్. భాను భోగవరపు డైరెక్షన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రీకరణలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరీ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్నారు.
TG: సినీ నటి సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారని, లేదంటే దీనిపై తీవ్రంగా స్పందించే వాళ్లమని రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. మంత్రి వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించామని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపింది. సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులిచ్చే అంశం పూర్తిగా వారి వ్యక్తిగతమని పేర్కొంది.
తిరుమల లడ్డూ వివాదంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. నిన్ననే విచారణ జరగాల్సి ఉండగా సొలిసిటర్ జనరల్ తుషార్ అభ్యర్థన మేరకు ఇవాళ ఉదయం 10.30 గంటలకు వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును కొనసాగించాలా? లేదా స్వతంత్ర సంస్థలకు అప్పగించాలా? అనేది నేడు న్యాయమూర్తులు తేల్చనున్నారు.
AP: కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే NH-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. వినుకొండ-గుంటూరు 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25KM పొడిగించారన్నారు. ఇది రాజధాని అమరావతిని తాకేలా రూపొందిందని, దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా NHAI నిర్మిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, విద్యుత్ పనులు చేపడుతుందని తెలిపారు.
దేశంలోని మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృత, అస్సామీ భాషలకు ఈ స్థాయిని కల్పించనుంది. దీంతో వీటితో కలిపి దేశంలోని సాంప్రదాయ భాషల సంఖ్య 11కు చేరనుంది. ఇప్పటివరకు తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు మాత్రమే ఈ స్టేటస్ను కలిగి ఉన్నాయి.
AP: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయరంటూ మరోసారి ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని(గతంలో ఆరోగ్య శ్రీ) తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారమని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో ఫేక్ అని తెలిపింది.
టీ20 మహిళల ప్రపంచకప్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం మ.3.30కి సౌతాఫ్రికాతో వెస్టిండీస్, రా.7.30కి న్యూజిలాండ్తో టీమ్ఇండియా తలపడనున్నాయి. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, డిస్నీ+హాట్ స్టార్ యాప్లో చూడవచ్చు. నిన్న జరిగిన మ్యాచుల్లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్, శ్రీలంకపై పాకిస్థాన్ గెలిచాయి.
AP: ప్రతి జిల్లాలో ఒక ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉప సంఘం నిన్న సచివాలయంలో సమావేశమైంది. ‘స్టేట్ టాస్క్ ఫోర్స్’ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచి యువత డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు చేపడతామని హోంమంత్రి తెలిపారు. ఫిర్యాదుల కోసం 1908 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
AP: Dy.CM పవన్ తిరుపతి సభపై YCP విమర్శలు చేసింది. ‘ప్రజా నాయకులు ఇలా బారికేడ్ల మధ్యలో అందరికీ దూరంగా ఉంటారా? వరదల టైమ్లో బయటకు రాని ఈయన కొత్తగా మత రాగం ఎత్తుకున్నాడు. అసెంబ్లీలో కులమతాలకు అతీతంగా ప్రమాణం చేసి ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం డిక్లరేషన్ ఏమిటి? ప్రచారం కోసం మొన్నటిదాకా తిరుపతి లడ్డూను అవమానించారు. ఇప్పుడు రాజకీయం కోసం మత ధర్మాన్ని బారికేడ్ల మధ్యలోకి తెచ్చారు’ అని ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.