India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకునేందుకు విధివిధానాలు రూపొందిస్తోంది. ఈమేరకు ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి లోకేశ్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై ఫోకస్ పెట్టనుంది.

విక్టరీ వెంకటేశ్-మీనా నటించిన ‘దృశ్యం’ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందులో వారి పెద్దకూతురిగా కృతిక, చిన్నకూతురిగా ఎస్తేర్ అనిల్ అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. తాజాగా ఎస్తేర్ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా ‘ఆ అమ్మాయి ఇప్పుడు ఇలా అయిందా?’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ ఎస్తేరే నటించారు.

Swiggy IPO పబ్లిక్ సబ్స్క్రిప్షన్ నవంబర్ 6-8 తేదీల మధ్య జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. $11.3 బిలియన్ల (₹93,790 కోట్లు) IPO వాల్యుయేషన్ను సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. IPO ప్రైమరీ కాంపోనెంట్ను సుమారు ₹4,500 కోట్లకు పెంచారు. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా OFS కాంపోనెంట్నూ సవరించినట్లు తెలిసింది. మొత్తం IPO పరిమాణం ₹11,700 కోట్ల నుంచి ₹11,800 కోట్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నాయి.

ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్ను సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ(85) ఆరోగ్య పరిస్థితి కలవరపెడుతోంది. ఖమేనీ తీవ్ర అనారోగ్యం బారిన పడినట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు ఇజ్రహీం రైసీ మృతితో దేశంలో అస్థిరత ఏర్పడడంతో తాజాగా ఖమేనీ అనారోగ్యం ఇరాన్ను దిగులు పెడుతోంది. ఖమేనీ వారసుడిగా రెండో పెద్దకుమారుడు మొజ్తాబా పగ్గాలు చేపడతారని తెలుస్తోంది.

నాన్ టెక్నికల్ కేటగిరీ(NTPC)లో 3,693 పోస్టులకు RRB దరఖాస్తులు స్వీకరిస్తోంది. అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో 18 నుంచి 33 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఈ నెల 27 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500. మహిళలు, ఎస్టీ, ఎస్సీ, ఈబీసీలకు రూ.250. వెబ్సైట్: https://www.rrbapply.gov.in/

AP: రాష్ట్ర ప్రజలను ఉదయం పూట చలి వణికిస్తుంటే మధ్యాహ్నం ఎండ బాదుతోంది. శీతాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అటు పగటిపూట ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. వాయవ్య భారతం నుంచి వీస్తున్న గాలులతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు AI పరిష్కారాల కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. IndiaAI ఇనిషియేటివ్లో భాగంగా నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ (NCRP)లో పౌరులు సులభంగా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసే విధంగా, నేర విధానాల ఆధారంగా వాటి విభజనకు అవసరమైన Natural Language Processing వృద్ధికి ఔత్సాహికులను ఆహ్వానించింది. రోజూ నమోదయ్యే 6K కేసుల నిర్వహణ, నేరాల నియంత్రణకే ఈ ప్రయత్నాలని ఓ అధికారి తెలిపారు.

ఫిట్నెస్ ట్రాకర్లు వచ్చాక రోజుకు ‘10000 STEPS’ టార్గెట్గా పెట్టుకోవడం అలవాటైంది. ఈ ట్రెండుపై కాస్త ఆలోచించాలని పరిశోధకులు అంటున్నారు. ఆయు ప్రమాణం పెరగాలంటే ‘10000’ అవసరమేమీ లేదంటున్నారు. శ్రద్ధగా రోజుకు 2300 అడుగులు వేసినా గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని అంటున్నారు. 3300 అడుగులేస్తే డెత్ రిస్క్ 15% తగ్గుతుందని, అదనంగా వేసే ప్రతి 500 స్టెప్స్కు 7% కార్డియో డెత్ రిస్క్ తగ్గుతుందని వెల్లడించారు.

AP: రాష్ట్రంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకినట్లు తేలింది. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు ఇదే కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 17 మంది ఆసుపత్రిలో చేరారు. తాగునీరు కలుషితం కావడంతో ఇక్కడ ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి.

TG: నవంబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కార్తీక మాస ఉత్సవాలను నిర్వహించాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించాలని తెలిపింది. దీపోత్సవంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్ని ఆలయాల ఈవోలు, సహాయక కమిషనర్లు ఇవి అమలయ్యేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Sorry, no posts matched your criteria.