India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై నియంత్రణ లేకపోతే కొన్నేళ్లలోనే మానవాళికి ముప్పు తప్పదని ప్రముఖ చరిత్రకారుడు, ఇజ్రాయెల్ రచయిత యువల్ నోహ్ హరారీ హెచ్చరించారు. ఏఐ మనుషులను బానిసలుగా మార్చుతుందని, లేదంటే ఏకంగా నిర్మూలిస్తుందని చెప్పారు. పదేళ్ల కిందట ఏఐ కేవలం ఓ సైన్స్ ఫిక్షన్ వ్యవహారంగా ఉండేదని, ఇప్పుడు మన ఆర్థిక, రాజకీయ, సంస్కృతిలో ప్రవేశించిందని పేర్కొన్నారు.
CSKతో మ్యాచులో SRH జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. ఆల్రౌండర్గా పేరొందిన అతడు.. 2017-18లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 1,237 రన్స్ చేయడంతో వెలుగులోకి వచ్చారు. అదే ట్రోఫీలో నాగాలాండ్పై 414 రన్స్తో చెలరేగారు. 2022-23లో రంజీ ట్రోఫీ సీజన్లో రాణించిన అతడు.. 34 వికెట్లు పడగొట్టారు. కాగా నితీశ్కు ఇది రెండో ఐపీఎల్ మ్యాచ్.
లోక్సభ ఎన్నికల వేళ బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు షాక్ తగిలింది. 30 ఏళ్ల నాటి అక్రమ ఆయుధాల కొనుగోలు కేసులో ఆయనకు గ్వాలియర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాణా కుంభకోణం కేసులో బెయిల్పై ఉన్న ఆయనకు ఇప్పుడు అరెస్టు గండం పొంచి ఉంది. కాగా 1995-97 మధ్య నిబంధనలకు విరుద్ధంగా 23 మంది ఆయుధాలను కొనుగోలు చేశారు. ఈ కేసులో లాలూకు ఉన్న సంబంధంపై ఆధారాలున్నట్లు పోలీసులు తెలిపారు.
TG: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ స్పందించారు. ‘రెండు రోజుల్లో నిజానిజాలు బయటపెడతా. పదేళ్ల పాటు సీఎంగా ఉన్నా. కచ్చితంగా స్పందిస్తా’ అని మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులను పోలీసులు అరెస్టు చేశారు. BRS నేతల సూచనలతోనే ట్యాపింగ్ చేశామని వారు వెల్లడించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి వెళ్లారు. సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ను సీఎం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. హీరో వెంకటేశ్ సీఎం పక్కన కూర్చొని సందడి చేస్తున్నారు. సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు మ్యాచ్ను వీక్షిస్తున్నారు.
తనపై విమర్శలు చేసిన మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. ‘నా పేరు వాడి అసత్యాలు మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ ఆస్తుల చిట్టా బయటపెడతాం. ఆయనకు నిజాం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. దోచుకున్న ఆస్తులను ప్రజలకు పంచుతాం. నాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపిస్తా. రేపు ప్రెస్మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని కోమటిరెడ్డి తెలిపారు.
సామూహిక అత్యాచారానికి గురైన 12వ తరగతి బాలికను పరీక్షలు రాయనివ్వకుండా ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగింది. దీంతో ఆమె CWCకి ఫిర్యాదు చేశారు. తాను పరీక్షకు వస్తే వాతావరణం చెడిపోతుందని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 4నెలలు స్కూల్కు రానందుకే అడ్మిట్ కార్డు ఇవ్వలేదని యాజమాన్యం చెప్పగా, వారి సూచన మేరకే తాను ఇంటి వద్ద ప్రిపేర్ అయ్యానని బాలిక తెలిపారు.
TG: తాము కేవలం 1.8% ఓట్ల తేడాతోనే ఓడిపోయామని కేసీఆర్ అన్నారు. ‘మాకు 38%, మీకు 39.8% ఓట్లు పోలయ్యాయి. మేం ఔట్ కాలేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి. ప్రతి పంటకు రూ.500 బోనస్ ప్రకటించాలి. ఇవ్వకపోతే మిమ్మల్ని గద్దలెక్క వెంటాడుతా. వదిలిపెట్టను. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు’ అని కేసీఆర్ హెచ్చరించారు.
పుష్ప-2 మాస్ జాతర మరో రెండు రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ కౌంట్ డౌన్ పోస్టర్ను విడుదల చేశారు. త్రిశూలంతో ఉన్న ఆ ఫొటో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఇక ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ బన్నీ ఫ్యాన్స్ పూనకాలెత్తేలా ఉండనుందని మేకర్స్ హింట్స్ ఇస్తున్నారు.
APలో రాజమండ్రి అర్బన్ సెగ్మెంట్కు ప్రత్యేక స్థానం ఉంది. 8 కులాల వ్యక్తులు గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇదే. కమ్మ- ప్రభాకర్ చౌదరి(1952, 67), బుచ్చయ్య చౌదరి(1983, 85, 94, 99), కాపు-వీరభద్రరావు(1962), సత్యనారాయణ(2014), రెడ్డి- ACY రెడ్డి(1989), కొప్పుల వెలమ- ఆదిరెడ్డి భవాని(2019), బ్రాహ్మణ-నాగేశ్వరరావు(1955), వైశ్య-సత్యవతి(1978), తూర్పు కాపు-రౌతు సూర్యప్రకాశ్(2004,09), పద్మశాలి-మల్లికార్జునరావు(1972).
<<-se>>#ELECTIONS2024<<>>
Sorry, no posts matched your criteria.