News October 26, 2024

GOOD NEWS: ఇంటికే RTC పార్శిళ్లు

image

పార్శిళ్ల డెలివరీని మెరుగుపరిచేందుకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు డెలివరీ ఛార్జీలను వెల్లడించారు. పైన ఫొటోలో వివరాలు చూడొచ్చు.

News October 26, 2024

స్కిల్ వర్సిటీకి MEIL రూ.200 కోట్లు

image

TG: యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(MEIL) ముందుకొచ్చింది. మొత్తం క్యాంపస్ నిర్మాణానికి CSR కింద రూ.200 కోట్లు కేటాయించింది. ప్రపంచ స్థాయి నమూనాలతో నిర్మాణాలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ప్రతినిధుల బృందం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే వర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

News October 26, 2024

‘జియోహాట్‌స్టార్’ కొత్త ఓనర్స్ ఇద్దరు పిల్లలు!

image

జియో హాట్‌స్టార్ డొమెయిన్‌ను ఢిల్లీకి చెందిన ఓ టెకీ కొనుగోలు చేసి, తనకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్‌ను కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ డొమెయిన్‌ను అతడు దుబాయ్‌కి చెందిన భారత సంతతి కుటుంబానికి విక్రయించినట్లు సమాచారం. తాము దుబాయ్‌కి చెందిన జైనమ్, జీవిక అనే ఇద్దరు అక్కాతమ్ముళ్లమని వెబ్‌సైట్‌లో సమాచారం కనిపిస్తోంది. వివిధ నేపథ్యాలకు చెందిన పిల్లలతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామని అందులో పేర్కొన్నారు.

News October 26, 2024

రోహిత్ చెత్త రికార్డు

image

టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. స్వదేశంలో అత్యధిక టెస్టుల్లో ఓటమి పాలైన భారత సారథిగా నిలిచారు. ఇవాళ మ్యాచులో పరాజయంతో కెప్టెన్‌గా రోహిత్ 4 ఓటములు ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో గంగూలీ(3), ధోనీ(3), సచిన్(2), ద్రవిడ్(2), కోహ్లీ(2), కుంబ్లే(1) ఉన్నారు.

News October 26, 2024

తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపులు

image

AP: తిరుపతిలోని ఏడు హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ హోటళ్లను తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో విస్తృత సోదాలు నిర్వహించారు. మెయిల్స్ ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాగా నిన్న కూడా తిరుమలలోని రెండు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

News October 26, 2024

ఆ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకోండి.. Meta, Xకు కేంద్రం ఆదేశాలు

image

విమానాల‌కు న‌కిలీ బాంబు బెదిరింపుల క‌ట్ట‌డికి Meta, X సంస్థ‌లకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజ‌రీ జారీ చేసింది. ఈ వేదికల ద్వారా బెదిరింపు కాల్స్, సందేశాలకు ఆస్కారం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని IT శాఖ ఆదేశించింది. దేశ ప్ర‌జ‌ల సంక్షేమం, ఆర్థిక అంశాల‌తో ముడిప‌డిన కార‌ణంగా బెదిరింపు సందేశాల షేరింగ్, రీట్వీట్‌లకు అడ్డుకట్టవేయాలని, ఇలాంటి సందేశాలకు ప్రాధాన్యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

News October 26, 2024

సరికొత్త రికార్డు సృష్టించనున్న ‘పుష్ప-2’

image

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా పుష్ప-2 రికార్డు సృష్టించనుంది. ఇందులో 6,500 స్క్రీన్లు ఇండియాలో కాగా, మిగతావి ఓవర్సీస్. అటు రిలీజ్‌కు ముందే ఈ సినిమా రూ.1000 కోట్ల వరకూ బిజినెస్ చేసింది.

News October 26, 2024

దూకుడే కొంపముంచిందా?

image

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అనుసరించిన వ్యూహాలను న్యూజిలాండ్‌తో రిపీట్ చేయడం భారత జట్టు ఘోర పరాజయానికి కారణమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న జట్లపై దూకుడు మంత్రం ఫలించినా న్యూజిలాండ్ వంటి జట్టుపై ఆచితూచి ఆడాల్సిందని చెబుతున్నారు. ముఖ్యంగా భాగస్వామ్యాలు నెలకొల్పడంపై ఆటగాళ్లు దృష్టి సారిస్తే చారిత్రక పరాజయం ఖాతాలో చేరేది కాదని అంటున్నారు. మరి మీరేమంటారు?

News October 26, 2024

నవంబర్ 4 వరకు ఆ సేవలు నిలిపివేత

image

AP: భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్‌లైన్‌లో పర్మిషన్లు ఇచ్చే పోర్టల్‌లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 4 వరకు ఆన్‌లైన్ అనుమతుల సేవలు నిలిపివేసినట్లు DPMS డైరెక్టర్ తెలిపారు. సర్వర్ మైగ్రేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News October 26, 2024

టీమ్ ఇండియాకు బ్యాడ్ డేస్

image

గత రెండు వారాల్లోనే భారత పురుషుల జట్టు, మహిళల, యువకుల జట్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్నాయి. కివీస్‌పై మెన్స్ టీమ్ 36 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆసియా కప్‌లో ఉమెన్స్ టీమ్ సెమీ ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. దుబాయ్‌లో జరిగిన ఎమర్జింగ్ టోర్నీ సెమీ ఫైనల్‌లో పసికూన అఫ్గానిస్థాన్‌పై భారత యువ జట్టు ఓడి ఫైనల్‌కు చేరలేకపోయింది. దీంతో భారత జట్టుకు ఇవి మంచి రోజులు కావంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.