India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సొంతిల్లు కట్టుకోవడానికి ఓ వ్యక్తి కష్టపడి సంపాదించిన ₹16 లక్షలను భార్య చేతికిచ్చాడు. ఆన్లైన్ గేమ్లకు బానిసైన ఆమె సొమ్మును పోగొట్టింది. భర్త నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఫ్రెండ్స్ మందలించబోగా.. అందరి పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటానని ఆమె బెదిరించడంతో అతను డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. భువనగిరిలో ఈ ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్లతో జీవితం నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
➥పిఠాపురం: 28,011(5% ఓట్లు, 3వ స్థానం.. 2009లో ప్రజారాజ్యం గెలుపు)
➥అనకాపల్లి: 12,988(7.53%, 3వ స్థానం.. 2009లో PRP గెలుపు)
➥కాకినాడ R: 40,001(22%, 3వ స్థానం.. 2009 PRP గెలుపు)
➥రాజానగరం: 20,847(11.79%, 2009 PRP 27% ఓట్లు)
➥తెనాలి: 29,905 ఓట్లు(14.53%, 2009లో PRPకి 22%)
➥నిడదవోలు: 23,079(13.73%, 2009 PRPకి 29.40%).
➣పెందుర్తి: 19,626(9.79%, 2009 PRP అభ్యర్థి గెలుపు)
➣ఎలమంచిలి: 19,774(11.72%, 2009 PRP 30% ఓట్లు)
➣పి.గన్నవరం: 36,259(23.91%, 2009 PRP 30.74%)
➣రాజోలు: 50,053(32.92% ఓట్లతో జనసేన గెలుపు)
➣తాడేపల్లిగూడెం: 36,197(21.58%, 3వ స్థానం, 2009 PRP గెలుపు)
➣భీమవరం: 62,285(32.88%,2వ స్థానం, 2009 PRP 26.42%)
AP: చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. నిన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలతో HYDలో భేటీ అయ్యారు. ఇప్పటికే నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే.
టీబీ నిరోధానికి తయారుచేసిన ‘ఎంటీబీవ్యాక్’ టీకా క్లినికల్ పరీక్షలను పెద్దలపై ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. మానవ మూల కణాల నుంచి అభివృద్ధి చేసిన తొలి టీబీ వ్యాక్సిన్ ఇదేనని తెలిపింది. ప్రస్తుతం శిశువులకు వేస్తోన్న BCG టీకా కంటే మెరుగ్గా పనిచేస్తుందని, పెద్దల్లో టీబీని నిరోధిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ప్రపంచంలో 28 శాతం టీబీ కేసులు మన దేశంలోనే నమోదవుతున్నాయి.
కేరళలోని కాసరగోడ్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ML అశ్విని(38) పోటీ చేయనున్నారు. టీచర్ ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరిన ఆమె దాదాపు 10 రాష్ట్రాల్లో మహిళా మోర్చా కార్యకలాపాల బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఆమె మలయాళంతో పాటు కన్నడ, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్ భాషలు మాట్లాడగలరు. ఓటర్లతో ఆమె మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రతిభ ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది.
➬నరసాపురం: 49,120 ఓట్లు (35.97% ఓటు షేర్, 2వ స్థానం, 2009లో ప్రజారాజ్యం 35.58%)
➬ఉంగుటూరు: 10,721(6.17%, 3వ స్థానం, 2009 PRP 28.73%)
➬పోలవరం: 13,378(6.27%, 3వ స్థానం, 2009 PRP 25.22%)
➬తిరుపతి: 12,315(8.3%, 3వ స్థానం, 2009 PRP గెలుపు)
➬రైల్వేకోడూరు: 9,964(7.29%, 3వ స్థానం, 2009 PRP 18.80%)
➤అవనిగడ్డ: 28,556 ఓట్లు(15.49% ఓటు షేర్, 3వ స్థానం, 2009 PRP 23.46%)
➤నెల్లిమర్ల: 7,633(4.3%, 3వ స్థానం.. 2009 PRP 30.62శాతం)
➤విశాఖ దక్షిణ: 18,119(14.41%, 3వ స్థానం, 2009 PRP 35.40%)
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ICMR అధ్యయనంలో వెల్లడైంది. వచ్చే ఏడాది దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని పరిశోధకులు తెలిపారు. పట్టణాల్లో ఉండే మహిళలతో పోలిస్తే గ్రామాల్లో ఉండేవారికి ఈ ముప్పు తక్కువని తెలిపారు. ఊబకాయం, లేటు వయసులో వివాహాలు, ఆలస్యంగా పిల్లల్ని కనడం, పిల్లలకి సరిపడా పాలు ఇవ్వకపోవడం వంటివి క్యాన్సర్ ఉద్ధృతికి కారణాలని పేర్కొన్నారు.
ఇన్సూరెన్స్ పాలసీల్లో సరెండర్ వాల్యూకు సంబంధించి IRDAI కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం మూడేళ్లలోపు పాలసీలను సరెండర్ చేస్తే వాటి విలువ యథాతథంగా లేదా తక్కువగా ఉంటుంది. 4-7 ఏళ్లలోపు సరెండర్ చేస్తే స్వల్పంగా పెరుగుతుంది. మెచ్యూరిటీ డేట్ కంటే ముందే పాలసీని ముగిస్తే కంపెనీలు పాలసీదారుడికి చెల్లించే మొత్తాన్ని సరెండర్ వాల్యూగా పరిగణిస్తారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Sorry, no posts matched your criteria.