News March 23, 2024

‘జిల్’ కాంబో రిపీట్?

image

రాధాకృష్ణ డైరెక్షన్‌లో గోపీచంద్ మరో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. అతను వినిపించిన స్టోరీ లైన్‌కు హీరో ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందట. వీరిద్దరి కాంబోలో 2015లో వచ్చిన ‘జిల్’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత డైరెక్టర్.. ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

News March 23, 2024

56 ఏళ్లు కడుపులో పిండాన్ని మోశారు..

image

బ్రెజిల్‌లో అరుదైన ఘటన జరిగింది. డానియెలా వెరా(81) అనే మహిళ తన కడుపులో 56 ఏళ్లుగా చనిపోయిన పిండాన్ని మోశారు. ఈ పరిస్థితిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఆమె ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ కడుపులోని పిండాన్ని డాక్టర్లు కూడా గుర్తించలేకపోయారు. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, 3D స్కాన్‌లో పిండం గురించి తెలిసింది. ఆపరేషన్ చేసి దాన్ని తీసేయగా, మరుసటి రోజే ఆమె మరణించారు.

News March 23, 2024

సినీ నటులకు మించిన క్రేజ్ సీఎం జగన్ సొంతం: మంత్రి రోజా

image

AP: టీడీపీ నేతలకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోసిన వాళ్లకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని దుయ్యబట్టారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక హామీలు ఇచ్చి ఆయన ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సినీ నటులకు లేని క్రేజ్ జగన్‌కు ఉందని చెప్పారు.

News March 23, 2024

ఒకే ఫ్రేమ్‌లో రవీంద్ర స్క్వేర్

image

రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడుతున్న ఇరువురూ ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం ఫొటోకు పోజులిచ్చారు. నిన్నటి మ్యాచ్‌లో ఈ ఇద్దరు ప్లేయర్లు సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించారు. 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన రచిన్ చెన్నై టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 25* రన్స్‌తో జడేజా జట్టును విజయతీరాలకు చేర్చారు.

News March 23, 2024

ప్రచారానికి సిద్ధమవుతున్న రథాలు

image

ఎన్నికల పర్వంలో ప్రచార రథాలదే కీలక పాత్ర. ప్రతి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఇవి లేకుంటే ప్రచారం ముందుకు సాగదు. పోలింగ్ తేదీకి మరో 50 రోజులే ఉండటంతో ఆయా పార్టీల నేతలు ప్రచార రథాలను ఆధునిక హంగులతో తయారు చేయించుకుంటున్నారు. ముఖ్య నేతల చిత్రాలతో పాటు అభ్యర్థి కూడా కనిపించే విధంగా సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే నెల మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఆయా పార్టీల ప్రచారాలు హోరెత్తనున్నాయి.

News March 23, 2024

టెట్ ఫీజు భారీగా పెంపు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం టెట్ ఫీజును భారీగా పెంచింది. ఒక్కో పేపర్ ఫీజును రూ.1,000గా ప్రకటించింది. రెండు పేపర్లు రాసేవారు రూ.2,000 చెల్లించాలి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మే 15 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

News March 23, 2024

ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: సత్యకుమార్ యాదవ్

image

AP: అధికారులు మోసం చేశారంటూ కుటుంబం <<12908035>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై BJP జాతీయ నేత సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సొంత జిల్లాలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నా CMకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఈ ఆత్మహత్యలన్నీ YCP ప్రభుత్వ హత్యలే. ప్రజల నుంచి దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే భూ యాజమాన్య చట్టం తెచ్చారు. అధికారంలోకి రాగానే ప్రతి పైసా కక్కిస్తాం’ అని ట్వీట్ చేశారు.

News March 23, 2024

ఐసిస్-K: రష్యాను ఎందుకు టార్గెట్ చేసింది?

image

రష్యా రాజధాని మాస్కోలో <<12908235>>కాల్పుల<<>> ఘటనకు కారణం తామేనని ఐసిస్-K ప్రకటించుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఆయన విధానాలను ఈ గ్రూప్ ఎప్పటి నుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముస్లింలను అణిచివేసే కార్యకలాపాల్లో రష్యా భాగస్వామిగా ఉందని విశ్వసిస్తోంది. అందుకే రష్యాను టార్గెట్ చేసి ఎటాక్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ గ్రూప్ గతంలో అఫ్గానిస్థాన్, ఇరాన్, కాబుల్ ఎయిర్‌పోర్టులలో భయంకర దాడులు జరిపింది.

News March 23, 2024

34 ఏళ్లకు పిల్లలను కనాలనుకున్నా.. కుదర్లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్

image

తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక విషయాలు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా తొలి చిత్రం పోడాపోడీ షూటింగ్ సమయానికి నా ఏజ్ 22ఏళ్లు. 28ఏళ్లలోపు స్టార్‌గా ఎదిగి, 32ఏళ్లకు పెళ్లి చేసుకుని, 34ఏళ్లకు పిల్లల్ని కనాలనుకున్నా. ఇప్పుడు నా వయసు 38 ఏళ్లు. నేను వేసుకున్న ప్రణాళికలేవీ వర్కవుట్ కాలేదు’ అని చెప్పారు. ఇటీవల సచ్‌దేవ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే.

News March 23, 2024

మంచి ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టాం: గడ్కరీ

image

దేశంలో సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ‘ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేదు. కొన్ని దేశాల్లో పార్టీలకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. అలాంటి వ్యవస్థ మన దగ్గర లేనందున మంచి ఉద్దేశంతోనే ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చాం. అధికారంలో ఉన్న పార్టీ మారితే సమస్యలు తలెత్తకూడదనే దాతల పేర్లు బయటపెట్టలేదు’ అని తెలిపారు.

error: Content is protected !!