India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బియ్యాన్ని నానబెట్టి వండితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
*జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
*బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.
**ఎక్కువ సేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని చెబుతున్నారు.

కెనడా ఓ సంచలన విషయం బయటపెట్టిందండోయ్! 39 ఏళ్ల క్రితం అంటే 1985లో AI విమానం 182ను అటాక్ చేసింది 31 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ అని తేల్చేసింది. ‘పుట్టడానికి ఎనిమిదేళ్ల ముందే మేజర్ టెర్రర్ అటాక్ చేశాడంటే ఎనిమిదేళ్ల వయసులో ఏం చేయగలడో ఊహించుకోవచ్చు’ అని ట్రూడో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారు. 9/11 సహా ప్రపంచంలో జరిగిన ప్రతి దాడికీ అతడి కనెక్షన్ ఉందేమోనని USకు చెప్తానని ట్రూడో అన్నారు.

దర్శకుడు వి.వి.వినాయక్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’కు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ విషయంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా చిరంజీవి, వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఠాగూర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

TG: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జడ్జి అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లో రేవంత్ను ఈడీ ఏ1 నిందితుడిగా పేర్కొంది. ఆయన రూ.50 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంది.

AP: హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తున్న విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలతో రేణిగుంట విమానాశ్రయం రన్వే పైకి నీళ్లు చేరాయి. ల్యాండింగ్కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఆ విమానాన్ని చెన్నైకి మళ్లించారు.

సినీ ప్రముఖులు సైతం న్యూమరాలజీని ఫాలో అవుతుంటారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడం, స్టార్గా గుర్తింపు రాకపోవడం తదితర కారణాలతో పేర్లలో మార్పులు, చేర్పులు చేసుకున్న నటీనటులున్నారు. ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరును సాయి దుర్గ తేజ్గా మార్చుకున్న విషయం తెలిసిందే. గతంలోనూ లక్ష్మీ రాయ్ – రాయ్ లక్ష్మీగా, కిచ్చా సుదీప్ – సుదీపగా, Sundeep Kishan – Sundeep Kishnగా పేరు మార్చుకున్నారు.

టీబీ, ఆస్తమా, గ్లాకోమా, తలసేమియా, మెంటల్ హెల్త్కు సంబంధించిన మెడిసిన్ ధరలను 50 శాతం పెంచేందుకు ఎన్పీపీఏ ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయనే ఫార్మాస్యూటికల్ కంపెనీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. బెంజిపెన్సిలిన్, ఆట్రోపైన్, స్ట్రెప్టోమైసిన్, సాల్బుటమాల్, పిలోకార్పైన్, సెఫడ్రాక్సిల్, డెస్ఫెర్రొగ్జామైన్, లిథియం మందులు ఈ జాబితాలో ఉన్నాయి.

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వాయువ్య దిశగా 12KM వేగంతో కదులుతున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. చెన్నైకి 360KM, పుదుచ్చేరికి 390KM, నెల్లూరుకు 450KM దూరంలో ఉన్నట్లు పేర్కొంది. ఇది రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

న్యూజిలాండ్, భారత్ మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం కారణంగా టాస్ వాయిదా పడింది. కాసేపటి క్రితమే వాన ఆగిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ వర్షం మొదలైతే తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. కాగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో బెంగళూరులో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.

పెళ్లిళ్ల సీజన్ వేళ వినియోగదారులకు పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్ రూ.78వేలకు చేరువైంది. నిన్న, మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.490 పెరిగి రూ.77,890కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.450 పెరిగి రూ.71,400గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ రూ.100 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,800గా ఉంది.
Sorry, no posts matched your criteria.