India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్గా ఎంపికైన నోయల్ టాటా రతన్ టాటా సవతి తల్లి కొడుకు. రతన్ తండ్రి నావల్ హెచ్ టాటా తొలుత సూనూ కమిశారియట్ను పెళ్లాడారు. వీరికి రతన్, జిమ్మీ జన్మించారు. ఆ తర్వాత నావల్ సిమోన్ హెచ్ టాటాను వివాహమాడగా వారికి నోయల్ పుట్టారు. రతన్, జిమ్మీ ఇద్దరూ అవివాహితులే. నోయల్ భార్య ఆలూ మిస్త్రీ షాపూర్జీ పల్లోంజీ అధినేత పల్లోంజీ మిస్త్రీ కుమార్తెనే. సైరస్ మిస్త్రీకి స్వయానా సోదరి.

AP: కాకినాడ DFO డి.రవీంద్రనాథ్రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఇటీవల బదిలీపై కాకినాడకు వచ్చిన ఆయన పవన్తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్, విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు తన పేరుతో అవినీతికి పాల్పడితే చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.

దసరా సందర్భంగా పర్యాటకులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు అధికారులు అనుమతిచ్చారు. వరదల కారణంగా ఐదు నెలల పాటు పాపికొండలు టూరిజంను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగవ్వడంతో లాంచీ యజమానుల విజ్ఞప్తుల మేరకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.

TG: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు TGPSC కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో సెలక్ట్ చేశారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోనున్నారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరిగే చివరిదైన 3వ T20 మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది. శనివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉండదని భావిస్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్లో కుండపోత వర్షం కురవడంతో ఇవాళ వరుణుడు మ్యాచ్కు ఆటంకం కలిగిస్తాడేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అటు పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే ఛాన్సుంది.

జానీ మాస్టర్పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్తో కలిసి HYD, చెన్నైలలో షూటింగ్లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.

TG: రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోంది. ఈ ఏడాది 4.5 లక్షల సీట్లకు గాను 1.9 లక్షల సీట్లే భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా బీకామ్ లో 77 వేల మంది చేరినట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడమే సీట్లు నిండకపోవడానికి కారణమని చెబుతున్నారు. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల్లోనే అడ్మిషన్లు ఎక్కువ జరగడం గమనార్హం.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన ట్వీట్ సరికొత్త చర్చకు దారితీసింది. ‘ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధర పలకవచ్చు?’ అని పంత్ Xలో ప్రశ్నించారు. దీంతో పంత్ ఢిల్లీని వీడుతారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఆయనను సీఎస్కే తీసుకుంటుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంత్ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంది.

TG: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల రాకతో గురుకులాలు మూత పడతాయన్నది అబద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చిన్న చిన్న షెడ్లలో ఉన్న వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తయారు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అందుకు అనుగుణంగా సిలబస్ తయారు చేసి, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.