India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: విద్యుత్ రంగం గురించి మాజీ CM జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఆయన ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు మద్దతివ్వకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్న 65.1% పోలింగ్ నమోదైంది. 1995లో రికార్డు స్థాయిలో 71.5% ఓటింగ్ నమోదవగా, ఆ తర్వాత ఇదే అత్యధికం. ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవడం తమకే అనుకూలమని మహాయుతి, MVA ధీమాగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ BJP కూటమివైపే మొగ్గు చూపగా, ఈ నెల 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా 1999లో 61%, 2004లో 63.4%, 2009లో 59.7%, 2014లో 63.4%, 2019లో 61.4% పోలింగ్ రికార్డయ్యింది.

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఐపీఎల్ మెగా వేలంలో రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు పలుకుతారని రైనా, ఉతప్ప, చోప్రా వంటి మాజీలు జోస్యం చెబుతున్నారు. కాగా ఒకే ఒక ప్రయోజనం కోసమే పంత్కు భారీ డిమాండ్ ఉందని తెలుస్తోంది. పంత్ ఓ గన్ ప్లేయర్, వికెట్ కీపర్ కూడా. ప్రస్తుతం ఆయన వయసు 27 ఏళ్లే. దీంతో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అతడిని దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

స్టైల్ కోసం జుట్టుకు పింక్, గ్రీన్, బ్లూ లాంటి వైబ్రంట్ కలర్లను వేసుకోవడం ఇటీవల పెరిగింది. వీటివల్ల తొందరగా గ్రే హెయిర్ వస్తుందని, జుట్టు నెరిసిపోతుందనే వాదన చాలా కాలంగా ఉంది. అయితే దీనికి సైంటిఫిక్ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ‘జన్యుపరం, సూర్యరశ్మి, ఒత్తిడి వల్లే జుట్టు నెరుస్తుంది. రంగులు వేసుకోవడం కారణం కాదు. ఆ కలర్లు జుట్టు పైపొరను మాత్రమే ప్రభావితం చేస్తాయి’ అని స్పష్టం చేస్తున్నారు.

TG: ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(ఇంగ్లిష్, మ్యాథ్స్) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను TGPSC విడుదల చేసింది. <

TG: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను కేంద్ర మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా స్వీకరించింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఆదేశించింది. కాగా ఫార్మా సిటీకి భూములు ఇవ్వనందుకు పోలీసులు తమను హింసించారని, అక్రమంగా నిర్బంధించారని కొందరు గ్రామస్థులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

AP: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తామని YCP MPలు తెలిపారు. వైసీపీ చీఫ్ జగన్తో భేటీ అనంతరం మాట్లాడుతూ ‘పోలవరం ఎత్తును తగ్గించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిలదీస్తాం. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. ప్రత్యేక హోదా కోసం నినదిస్తాం. YCP కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులను పార్లమెంటులో చర్చిస్తాం’ అని పేర్కొన్నారు.

సినీ నటి రేణూ దేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన తల్లి ఫొటో షేర్ చేసి ఓం శాంతి అంటూ పోస్ట్ చేశారు. దీంతో రేణును నెటిజన్లు ఓదారుస్తున్నారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచిస్తున్నారు.

TG: ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కరీంనగర్లో జరిగే దీక్షా దివస్లో తాను పాల్గొంటానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు కావడంతో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

భారత షట్లర్లు పీవీ సింధు, అనుపమ ఉపాధ్యాయ చైనా మాస్టర్స్ టోర్నీలో రెండో రౌండ్లో వెనుదిరిగారు. సింగపూర్కు చెందిన యెవో జియా మిన్ చేతిలో సింధు 16-21, 21-17, 21-23 తేడాతో ఓడిపోగా అనుపమ జపాన్ క్రీడాకారిణి నత్సుకీ నిడైరాతో 21-7, 21-14 తేడాతో ఓటమిపాలయ్యారు. సింధు ఈ ఏడాది వరుసగా 7 టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ కూడా దాటకపోవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.