India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తేది: అక్టోబర్ 12, శనివారం
నవమి: ఉదయం.10.58 గంటలకు
శ్రవణం: తెల్లవారుజామున 4.27 గంటలకు
వర్జ్యం: ఉదయం 9.15-10.47 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 6.00-6.47 గంటల వరకు

* AP: 1.21 కోట్ల కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’
* AP: ముగిసిన వైన్ షాపుల దరఖాస్తు గడువు
* TG: కేసీఆర్ 5 వేల స్కూళ్లు మూసేశారు: సీఎం రేవంత్
* TG: తెలంగాణలో సమగ్ర కులగణన.. ఇంటింటి సర్వే
* పనిచేయని ఉద్యోగులపై వేటు: మోదీ
* టాటా ట్రస్టు ఛైర్మన్గా నోయల్ టాటా
* రాజకీయాల్లో చేరిన నటుడు షాయాజీ షిండే
* టీమ్ ఇండియా క్రికెటర్ సిరాజ్కు డీఎస్పీ పోస్ట్
* భారత జట్టు వైస్ కెప్టెన్గా బుమ్రా

ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో ఘోర ఓటమి పాక్ కెప్టెన్ షాన్ మూసూద్ కెరీర్పై నెగటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సారథ్యంలో ఆడిన ఆరు మ్యాచుల్లోనూ పాక్ ఓటమి పాలైంది. దీంతో మూసూద్ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హోం పిచ్లో 2022 నుంచి పాక్ ఒక్క మ్యాచ్లోనూ నెగ్గలేదు.

హిమాలయాల్లో వందేళ్ల తర్వాత ఓ పర్వతారోహకుడి కాలు బయటపడింది. 1924లో ఇంగ్లండ్కు చెందిన ఆండ్రూ కామ్న్ శాండీ ఇర్విన్ (22) మరో వ్యక్తితో కలిసి ఎవరెస్ట్ ఎక్కుతూ గల్లంతయ్యారు. ఎన్ని రోజులు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. గత నెలలో సెంట్రల్ రోంగ్ బుక్ గ్లేసియర్ వద్ద కొందరు ఓ కాలును గుర్తించారు. సాక్సులపై ‘ఏసీ ఇర్విన్’ అని రాసి ఉంది. ఇర్విన్ మునిమనవరాలు డీఎన్ఏతో పోల్చి చూడగా అతడి కాలేనని తేలింది.

కోల్కతాకు చెందిన ముగ్గురు మోడల్స్ కురచ దుస్తులతో దుర్గామాతను దర్శించుకున్నారు. దీనిపై భక్తులు వారిని తిట్టి పోస్తున్నారు. మాజీ మిస్ కోల్కతా హేమో శ్రీ భద్ర, మరో ఇద్దరు మోడళ్లతో కలిసి అసభ్యకర దుస్తుల్లో దుర్గామాతను దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని చూసిన భక్తులు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలని తిడుతున్నారు.

హైదరాబాద్ వేదికగా శనివారం బంగ్లాదేశ్తో జరగనున్న చివరి టీ20 మ్యాచ్లో ముగ్గురు భారత ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు మ్యాచ్లలో చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయని సంజూ శాంసన్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి రావచ్చని తెలుస్తోంది. అలాగే, వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్ స్థానంలో హర్షిత్ రాణాకు చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

TG: స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో శిక్షణ అందించనున్నారు. అభ్యర్థులు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ(YISU) వెబ్సైట్ ద్వారా ఈ నెల 29వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. NOV 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా రాయదుర్గంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో తరగతులు నిర్వహిస్తారు.

న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్గా నియమించింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫ్రాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా. ట్రావెలింగ్ రిజర్వ్: నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ.

లెబనాన్లోని UN శాంతి పరిరక్షణ బలగాల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల సరిహద్దుల్లోని బ్లూ లైన్ వెంబడి 600 మంది భారత సైనికులు UN శాంతిపరిక్షణ మిషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ స్థావరాలను ఇజ్రాయెల్ క్షిపణులు ఢీకొట్టాయి. అయితే, అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. UN స్థావరాల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని భారత్ సూచించింది.

ఆడపిల్ల పుట్టిందని తనను తల్లిదండ్రులు భారంగా భావించారని బాలీవుడ్ బ్యూటీ మల్లిక షెరావత్ తెలిపారు. ‘నా సోదరుడిని ఆప్యాయంగా చూసేవారు. అతణ్ని ఉన్నతంగా చదివించాలి, విదేశాలకు పంపించాలనుకునేవారు. ఆస్తులు కూడా తమ్ముడికే చెందాలనుకునేవారు. అమ్మాయిలు ఏం పాపం చేశారు? నన్ను చదివించారు కానీ స్వేచ్ఛనివ్వలేదు. నన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. నేను పుట్టినప్పుడు మా అమ్మ డిప్రెషన్లోకి వెళ్లుంటుంది’ అని నిట్టూర్చారు.
Sorry, no posts matched your criteria.