India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: లాసెట్ ప్రవేశాల షెడ్యూల్ను నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య గంగాధర్ విడుదల చేశారు. లాసెట్లో అర్హత సాధించిన విద్యార్థులంతా ఈ నెల 16 నుంచి 20 లోపు రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ చేయించుకోవాలన్నారు. 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 26న మార్పులు, 28న సీట్లు కేటాయిస్తామని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు 29, 30 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలన్నారు.

TG: సీఎం రేవంత్ రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) మీటింగ్లో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో సమావేశమై క్యాబినెట్ విస్తరణపై చర్చిస్తారని సమాచారం.

రాజకీయ లబ్ధి కోసం కెనడా PM జస్టిన్ ట్రూడో నీచ స్థాయికి దిగజారారని విశ్లేషకులు అంటున్నారు. ఖలిస్థానీలు సహా తమ పౌరుల్ని హతమార్చేందుకు భారత దౌత్యవేత్తలు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారన్న ఆయన ఆరోపణల్ని కొట్టిపారేశారు. హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకేసు ఆధారాలను భారత్కు ఇంకా ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడూ ఎవిడెన్స్లు ఇవ్వకుండా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. >>comment

AP: అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో నేటి నుంచి 17 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చిత్తూరులో ఇవాళ, రేపు, అనంతపురంలో బుధ, గురువారాలు సెలవులు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.

AP: గతంలో అమలైన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని కోసం తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఇలాంటి పథకాలను అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కిట్లో దుప్పటి, దోమతెర, స్లీపింగ్ బెడ్, పౌడర్, లోషన్, న్యాప్కిన్, డైపర్స్ వంటివి ఉంచి బాలింతలకు అందించేవారు.

TG: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతోందంటూ KTR విమర్శించారు. ‘కరెంటు ఛార్జీల మోతకు సర్కార్ రెడీ. 300 యూనిట్లు దాటితే కిలో వాట్కు ఫిక్స్డ్ ఛార్జీ ₹50’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘పవర్లోకి వచ్చి ఏడాది కాకముందే ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. వినియోగదారులు జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే మీరు కొత్త బాదుడు షురూ చేస్తారా?’ అని ప్రశ్నించారు.

AP: మద్యం దుకాణాదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. MRP కంటే ఎక్కువ అమ్మినా, ట్యాక్స్ చెల్లించని మద్యం, నాటుసారా విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని, లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుందన్నారు. 15 రోజుల్లో కల్లుగీత కార్మికులకు 340 షాపులు కేటాయిస్తామని తెలిపారు. సిండికేట్ లేకుండా చూస్తామన్నారు.

AP: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సన్నపురెడ్డి సుజల 10కిపైగా మద్యం దుకాణాలను లాటరీలో దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురంలో 4, కర్నూలులో 1, పీలేరు నియోజకవర్గంలో కూడా ఆమె పలు షాపులు కైవసం చేసుకున్నారు. కాగా కర్నూలు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి అనుచరులు సిండికేట్గా ఏర్పడి 246 దరఖాస్తులు వేయగా ఒక్కటంటే ఒక్క దుకాణం కూడా దక్కలేదు. దీంతో వారు లబోదిబోమంటున్నారు.

TG: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలనే డిమాండ్తో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నేటి నుంచి బంద్ పాటిస్తున్నాయి. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు నడపలేకపోతున్నామని డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలిపింది. ఉద్యోగుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నట్లు పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపింది.

డిజిటల్ మార్కెటింగ్లో క్యాచీ హెడ్లైన్స్, ట్యాగ్స్ భలే అనిపిస్తాయి. పదాల అర్థం, పద్ధతులపై అవగాహన లేకుంటే మిస్ఫైర్ అవుతాయి. వర్క్ ప్లేస్లో సెక్సువల్ హరాస్మెంట్పై పోరాడే బెంగళూరు లాయర్కు ‘ఐ పిల్ గర్భనిరోధక మాత్ర అంటోంది, ఐ మిస్ యూ పల్లవి’ అంటూ జెప్టో పంపిన మెసేజ్ పెద్ద వివాదానికే దారితీసింది. అంటే నన్నిప్పుడు దీన్ని తీసుకోమంటారా అని LinkedInలో ఆమె లాంగ్ పోస్ట్ పెట్టడంతో జెప్టో సారీ చెప్పింది.
Sorry, no posts matched your criteria.