News October 17, 2024

వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి

image

AP: వైసీపీ నేతలు అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో చేరుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ముదునూరి మురళీకృష్ణం రాజు ఆ పార్టీని వీడారు. ప్రస్తుతం ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు ఉన్నారు. ఇవాళ మాజీ సీఎం జగన్ సమక్షంలో మురళీకృష్ణంరాజు వైసీపీలో చేరారు.

News October 17, 2024

46 పరుగులకే భారత్ ఆలౌట్

image

NZతో తొలి టెస్టులో టీమ్ ఇండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 46 పరుగులకే భారత్ ఆలౌటైంది. పంత్ (20), జైస్వాల్ (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. విరాట్, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డకౌట్ అయ్యారు. హెన్రీ 5, విలియం 4, సౌథీ ఒక వికెట్ తీశారు.

News October 17, 2024

సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్ అరెస్ట్

image

యాక్టర్ సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో ముందడుగు పడింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ షూటర్లలో ఒకరైన సుఖ్ఖాను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారని IANS తెలిపింది. హరియాణా పోలీసుల సహకారంతో పానిపట్ సెక్టార్ 29లో అతడిని అధీనంలోకి తీసుకున్నారు. గురువారమే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సుఖ్ఖాది రైల్ కలాన్ విలేజ్. ఏప్రిల్‌లో బాంద్రాలోని సల్మాన్ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరపడం తెలిసిందే.

News October 17, 2024

జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి: జగన్

image

AP: వైసీపీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, ముఖ్య నాయకులతో పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరుపై మానిటరింగ్ ఉంటుందని, కష్టపడిన వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండాలని సూచించారు. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తయారుచేయాలన్నారు.

News October 17, 2024

మిస్ ఇండియా-2024.. నిఖిత పోర్వాల్

image

ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని మధ్యప్రదేశ్‌ ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్ సొంతం చేసుకున్నారు. ముంబై వేదికగా 60వ ఎడిషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. త్వరలో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. రన్నరప్‌లుగా రేఖా పాండే(దాద్రా నగర్ హవేలీ), ఆయుశీ దోలకియా(గుజరాత్) నిలిచారు.

News October 17, 2024

రేపు యూజీసీ నెట్ ఫలితాల విడుదల

image

UGC NET జూన్-2024 ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు NTA వెల్లడించింది. ugcnet.nta.ac.inలో అప్లికేషన్ నంబర్, DOB ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి ఈ పరీక్షను ఏటా జూన్, డిసెంబర్‌లో నిర్వహిస్తారు. జూన్ 18న జరిగిన పరీక్ష లీకేజీ కారణంగా రద్దవడంతో AUG 21-SEP4 వరకు మళ్లీ నిర్వహించారు.

News October 17, 2024

సిటిజన్‌షిప్ యాక్ట్: సెక్షన్ 6Aపై 4-1తో సుప్రీం చారిత్రక తీర్పు

image

సిటిజన్‌షిప్ యాక్ట్ సెక్షన్ 6Aకు చట్టబద్ధత ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4-1 తేడాతో తీర్పునిచ్చింది. దీనిని మార్చే అధికారం పార్లమెంటుకే ఉందని స్పష్టం చేసింది. బంగ్లా నుంచి అస్సాం వచ్చిన వలసదారుల సమస్యకు రాజకీయ పరిష్కారమే సెక్షన్ 6A అని CJI చంద్రచూడ్ అన్నారు. 1985లో ప్రవేశపెట్టిన ఈ చట్టంతో 1971, MAR 24 ముందునాటి వలసదారులకు భారత పౌరసత్వం ఇస్తారు. తర్వాత వచ్చినవాళ్లు వెళ్లిపోవాల్సి ఉంటుంది.

News October 17, 2024

మ.2 గంటల తర్వాత విచారణకు సజ్జల

image

AP: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి రూరల్ పోలీసులు నిన్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉ.10.30 గంటల నుంచి సా.4 గంటల మధ్యలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మ.2 గం.కు విచారణకు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మంగళగిరి గ్రామీణ PSలో పోలీసులు సజ్జలను విచారించనున్నారు.

News October 17, 2024

యాంటీ BJP ఓట్లు చీలొద్దు: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో AAP వ్యూహమిదేనా?

image

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేయడం లేదని తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీలో బలపడటం పైనే ఫోకస్ పెట్టిందని సమాచారం. ఆ 2 రాష్ట్రాల్లో యాంటీ BJP ఓట్లు చీలకూడదని, ఇండియా కూటమిని బలోపేతం చేయాలని భావిస్తోందట. మహారాష్ట్ర AAP యూనిట్ పోటీకి ఇష్టపడుతున్నా అధిష్ఠానం అనుమతి ఇవ్వకపోవచ్చని తెలిసింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, MP సందీప్ పాఠక్ ఈ మేరకు సంకేతాలు పంపించారు.

News October 17, 2024

కెనడాతో వివాదం: మోదీని నిందిస్తూ TMC MP ట్వీట్లు!

image

కెనడాతో వివాదంపై TMC MP, రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య సాగరికా ఘోష్ ట్వీట్లు చర్చనీయంగా మారాయి. ‘మోదీ ప్రభుత్వ క్రిమినల్ యాక్టివిటీపై కెనడా PM ట్రూడో పబ్లిక్‌గా అభియోగాలు ఎందుకు మోపుతున్నారో నాన్ బయలాజికల్ PM మోదీ పార్లమెంటుకు చెప్పాలి’ అని ఆమె మొదట ట్వీట్ చేశారు. అప్పట్నుంచి ప్రధాని టార్గెట్‌గా ట్వీట్లు చేస్తుండటంతో ‘మీ నుంచి ఇంతకు మించి ఆశించడం వేస్ట్’ అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.>comment