India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ‘గ్రూప్1 అభ్యర్థులను రెచ్చగొట్టి పరీక్షలను అడ్డుకోవాలని BRS యత్నించింది. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. పారిశ్రామికీకరణకు విద్యను అనుసంధానిస్తాం. 33 కోర్సులను సమూలంగా మారుస్తాం. BA, బీకాం చదివే వారికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కోర్సుల్లో శిక్షణ అందిస్తాం’ అని తెలిపారు.

AP: స్వర్ణకారులకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇటీవల దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంక్షేమ, అభివృద్ధి సంస్థను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2001 కింద ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్నికల సమయంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు 4 తుపాకులు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. వాటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డ్రోన్ సాయంతో తుపాకులను సరిహద్దులు దాటించినట్లు తెలిపారు. కాగా అక్టోబర్ 12న ముంబైలో సిద్ధిఖీని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసులో 14 మంది అరెస్ట్ కాగా ముగ్గురు పరారీలో ఉన్నారు.

భారత టెస్టు జట్టులో రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగా వాషింగ్టన్ సుందర్ను అప్పుడే భావించకూడదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘న్యూజిలాండ్ టెస్టులో సుందర్ 10 వికెట్లు తీశారు. కానీ ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే. అశ్విన్కు తనే వారసుడినని నిరూపించుకోవడానికి అతడు మరెన్నో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది. అశ్విన్ను భర్తీ చేయడం అంత సులువు కాదు’ అని స్పష్టం చేశారు.

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఫొటోను ట్విటర్లో అప్లోడ్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. సెక్టార్-9కి చెందిన రిహాన్ అనే వ్యక్తి ఇబ్రహీం ఫొటోను ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నాడని ఫేజ్-1 పోలీసులు తెలిపారు. అతడిపై 196(1)(B) సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. భారత్లో బాంబు దాడుల ద్వారా ఎంతోమంది అమాయకులు చనిపోవడం వెనుక దావూద్ సూత్రధారి.

AP: హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. దేవాలయాలు జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడలో గోశాలను కూల్చివేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం అని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామనే వారు దీనికి సమాధానం చెప్పాలన్నారు. గతంలో పుష్కరాల సమయంలోనూ చంద్రబాబు అనేక దేవాలయాలను కూల్చివేయించారని దుయ్యబట్టారు.

TG: నవంబర్ చివరి నాటికి క్రీడా వర్సిటీ బిల్లును రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పది రోజుల్లో గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు క్యాలెండర్ ఉండాలని చెప్పారు. వివిధ దేశాల క్రీడా విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

వెయ్యి అని చెప్పడానికి బదులు K అన్న అక్షరం వాడటం నేడు సర్వ సాధారణంగా మారింది. ఉదాహరణకు 5వేలకు 5K అని అంటుంటాం. ఇది గ్రీకు పదం ‘Chilioi’ నుంచి వచ్చింది. చదివేందుకు ‘చిలివోయ్’లా కనిపిస్తున్నా దాన్ని కిలివోయ్గా పిలుస్తారు. ఆ కిలివోయ్ నుంచే కిలో అన్న పదం పుట్టింది. కిలోగ్రామ్ అంటే వెయ్యి గ్రాములు, కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు అన్నట్లుగా వెయ్యి అంకెకు ‘K’ని షార్ట్కట్లా వ్యవహరించడం మొదలైంది.

Oxford Universityలో ఇంగ్లిష్లో PhD చేస్తున్న TNకు చెందిన లక్ష్మీ బాలకృష్ణన్కు నిరాశే మిగిలిందే. PhD కోసం ₹కోటి వరకు ఫీజు చెల్లించిన యువతి నాలుగో ఏడాదిలో షేక్స్పియర్పై చేసిన రీసెర్చ్ PhDకి తగ్గ స్థాయిలో లేదని చెప్పి వర్సటీ ఆమెను బలవంతంగా మాస్టర్స్కు బదిలీ చేసింది. రీసెర్చ్ ఆశించిన స్థాయిలో ఉండాలని, అందరూ దాన్ని సాధించలేరని వర్సిటీ పేర్కొంది. మోసపోయానని లక్ష్మీ ఆవేదన చెందింది.

1965: సింగర్ నాగుర్ బాబు(మనో) జననం
1974: నటి రవీనా టాండన్ జననం
1985: హీరోయిన్ ఆసిన్ జననం
1991: హీరోయిన్ అమలాపాల్ జననం
1986: డైరెక్టర్ శైలేష్ కొలను జననం
1955: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి.పలుస్కర్ మరణం
✱గృహ హింస చట్టం అమల్లోకి వచ్చిన రోజు
Sorry, no posts matched your criteria.