News September 27, 2024

ఆ వెబ్‌సైట్లను బ్యాన్ చేసిన కేంద్రం

image

పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించే కొన్ని వెబ్‌సైట్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్, పాన్ కార్డ్ వంటి వివరాలను అవి బహిర్గతం చేస్తున్నాయని పేర్కొంది. ‘భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పలు వెబ్‌సైట్లలో భద్రతాలోపాలు ఉన్నట్లు గుర్తించింది. జాగ్రత్తలెలా తీసుకోవాలి, లోపాలను ఎలా సరిచేసుకోవాలనేదానిపై ఆయా సైట్స్ యజమానులకు అధికారులు సూచనలు చేశారు’ అని వివరించింది.

News September 27, 2024

రాజమౌళి సెంటిమెంట్‌కు ‘దేవర’ బ్రేక్ వేస్తాడా?

image

దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవడం ఓ ఆనవాయితీగా వస్తోంది. Jr.NTR, నితిన్, ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్, సునీల్, నాని వంటి హీరోలకు రాజమౌళి సూపర్ హిట్స్ ఇచ్చారు. కానీ ఆ హీరోల నెక్స్ట్ సినిమాలు హిట్ కాలేకపోయాయి. దీంతో NTR సినిమాతో(స్టూడెంట్ నం.1) మొదలైన ఈ ట్రెండ్ మళ్లీ NTR మూవీతోనే(దేవర) ముగుస్తుందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు?

News September 27, 2024

సిట్ ఏర్పాటుపై జీవో విడుదల

image

AP: తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో సిట్ ఏర్పాటుపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సభ్యులుగా గోపీనాథ్ శెట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివ నారాయణస్వామి, సత్యనారాయణ, సూర్య నారాయణ, ఉమామహేశ్వర్‌ను నియమించింది. సిట్‌కు సహకరించాలని హోం శాఖ, దేవదాయ శాఖ, టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది.

News September 27, 2024

గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వండి: హరీశ్ రావు

image

TG: గ్రామ పంచాయతీలకు నిధులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 8 నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు రిలీజ్ చేయకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన లేఖ రాశారు. కేంద్రం రూ.1,200 కోట్లు కేటాయించినా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు. పంచాయతీ కార్మికులకు దసరా, దీపావళికైనా జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు.

News September 26, 2024

హిందూధర్మం అంటే ఎందుకు చులకన: ఖుష్బూ

image

తిరుపతి లడ్డూ వ్యవహారంలో నటి ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూధర్మమంటే ఎందుకంత లోకువని ప్రశ్నించారు. ‘హిందూమతంపై దాడిని అందరూ లైట్ తీసుకుంటారు. హిందువుల్ని తిట్టేవారిని అడుగుతున్నా. వేరే మతాల్ని ఇలాగే తిట్టగలరా? ఆ ఊహకు కూడా మీ వెన్ను వణుకుతుంది. నేను ముస్లింని. నా భర్త హిందువు. నాకు అన్ని మతాలూ సమానం. తప్పు చేసిన వాళ్లు గుర్తుంచుకోండి. ఆ శ్రీనివాసుడు చూస్తున్నాడు’ అని మండిపడ్డారు.

News September 26, 2024

GOOD NEWS: అక్టోబర్ 1 నుంచి వేతనాలు పెంపు

image

అసంఘటిత రంగం (అన్‌‌ఆర్గనైజ్డ్)లో పని చేసే వర్కర్లకు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA) రివైజ్ చేసి కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. OCT 1 నుంచి ఈ కొత్త వేతన రేట్లు అమల్లోకి వస్తాయంది. నిర్మాణ, పారిశుద్ధ్య కార్మికులు, హమాలీలు, మైనింగ్ వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. హైస్కిల్డ్ వర్కర్లకు-రోజుకు రూ.1,035, సెమీస్కిల్డ్ రోజుకు రూ.868, అన్‌స్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ.783 చెల్లించాలంది.

News September 26, 2024

‘పుష్ప-2’ సెట్‌లో రాజమౌళి సందడి

image

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప-2’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా మూవీ సెట్‌కు దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యారు. భారతీయ సినిమాకు గర్వకారణమైన డైరెక్టర్ రాజమౌళి దేశంలోనే అతిపెద్ద మాస్ సినిమా సెట్స్‌ను సందర్శించారని పుష్ప టీమ్ ఎక్స్‌లో ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో సినిమాలో రాజమౌళి గెస్ట్ అప్పియరెన్స్ ఏమైనా ఉందా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

News September 26, 2024

అంబులెన్స్‌లో 138 కేజీల గంజాయి స్మగ్లింగ్

image

గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. ఏకంగా అంబులెన్స్‌లో 138 కేజీల గంజాయిని ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు రవాణా చేస్తోన్న ఇద్దరిని భేరుఘాట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతోనే వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 138 కేజీల గంజాయిని అంబులెన్స్ వెనక భాగంలో చిన్న, పెద్ద ప్యాకెట్లలో దాచినట్లు గుర్తించారు. దీని విలువ మార్కెట్‌లో రూ.40 లక్షలు ఉంటుందని తెలిపారు.

News September 26, 2024

రేపు ఏం జరగబోతోంది..

image

AP: జగన్ రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్నారు. రేపు సా.4 గం.కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. రాత్రి 7 గం.కు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. శనివారం ఉ.10.30 గం.కు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఏం జరగబోతోందనే టెన్షన్ నెలకొంది.

News September 26, 2024

‘దేవర’ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్క టికెట్ రూ.2వేలు!

image

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల రాత్రి ఒంటి గంటకే షోలు ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో టికెట్ ధర రూ.2వేలు పలుకుతున్నట్లు పలువురు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ షోలకు ఎక్కువగా అభిమానులే వెళ్లే అవకాశం ఉండటంతో క్యాష్ చేసుకుంటున్నారని చర్చ జరుగుతోంది.