India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సంక్రాంతి సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్లు, వార్డు మెంబర్లకు భట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

<<18842137>>షాక్స్గామ్ వ్యాలీ<<>> భారత్కు భౌగోళికంగా, రక్షణ పరంగా చాలా కీలకం. ఇది ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. భారత్ మాత్రం దీన్ని తన భూభాగంగానే పరిగణిస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ శత్రువులకు పట్టు చిక్కితే లద్దాక్లోని సైనిక కదలికలను ఈజీగా గమనించొచ్చు. ఈ ప్రాంతం ద్వారా చైనా, పాక్ మధ్య రాకపోకలు పెరిగి ఒకేసారి భారత్పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది.

1963లో INDను వ్యూహాత్మకంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పాక్ షాక్స్గామ్ లోయను చైనాకు అప్పగించింది. USపై నమ్మకం తగ్గడం, 1962 యుద్ధానంతరం చైనాతో స్నేహం ద్వారా రాజకీయ పట్టు సాధించాలని భావించింది. చిన్నపాటి సరిహద్దు వివాదాలనూ ముగించాలనుకుంది. ఈ ఒప్పందంతో POKపై పాక్ నియంత్రణను చైనా గుర్తించింది. బదులుగా కారకోరం పాస్పై చైనాకు ఆధిపత్యం దక్కి భారత్లోని సియాచిన్, లద్దాక్ ప్రాంతాలకు భద్రతా ముప్పు ఏర్పడింది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ‘ఆయన ఎప్పుడూ సెలవుల మూడ్ లోనే ఉంటారు. కీలకమైన జాతీయ సమస్యల సమయంలోనూ విదేశాల్లోనే గడుపుతారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పర్యాటక నాయకుడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. రాహుల్ అపరిపక్వ నాయకుడని విమర్శించారు. కాగా వియత్నాం పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ, INC ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇస్రో చేపట్టిన PSLV-C62 ప్రయోగం <<18833915>>విఫలమైన<<>> విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా అందులో నుంచి ఓ ఉపగ్రహం వేరుపడి, పని చేసింది. తమ కెస్ట్రెల్ ఇనీషియల్ డెమోన్స్ట్రేటర్ (KID) క్యాప్సుల్ 3 నిమిషాల కీలక డేటాను పంపిందని స్పానిష్ స్టార్టప్ ‘ఆర్బిటల్ పారాడిజం’ ప్రకటించింది. ఫుట్బాల్ సైజులో ఉన్న 25 కిలోల క్యాప్సుల్ PSLV స్టేజ్-4లో విజయవంతంగా సపరేట్ అయింది. నిజానికి మూడో దశలోనే రాకెట్ <<18834317>>విఫలమవ్వడం<<>> గమనార్హం.

HCLTech ఫ్రెషర్ల వేతనాల్లో భారీ పెంపును ప్రకటించింది. AI, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలున్న ఇంజినీర్లను ‘ఎలైట్ క్యాడర్’గా పరిగణిస్తూ వారికి ఏడాదికి ₹18-22 లక్షల వరకు ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. సాధారణ ఫ్రెషర్ల వేతనం కంటే ఇది 3-4 రెట్లు ఎక్కువ. HCLTech మాత్రమే కాకుండా ఇన్ఫోసిస్ కూడా నైపుణ్యం కలిగిన ఫ్రెషర్లకు ₹21 లక్షల వరకు అందిస్తోంది. ఈ ఏడాది HCLTech ఇప్పటికే 10,032 మంది ఫ్రెషర్లను తీసుకుంది.

TG: పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికే రేవంత్ ప్రభుత్వం విచారణల పేరిట కమిషన్లు, సిట్ ఏర్పాటు చేస్తోందని KTR విమర్శించారు. ‘మంత్రి PA, రేవంత్ సహచరుడు బెదిరింపులపై సిట్ ఉండదు. ములుగులో మంత్రి PA ఇసుకదందా, బెడ్స్ కొనుగోలులో కుంభకోణం, భూముల అక్రమ అమ్మకాలు వంటివాటిపై సిట్ ఉండదు’ అని ఆయన ఫైరయ్యారు. మంత్రిని ఉటంకిస్తూ కథనం వేస్తే ఛానళ్లపై కేసులు పెట్టి, సిట్ అంటూ డ్రామాలు చేస్తారని దుయ్యబట్టారు.

AP: నిస్సిగ్గుగా తనపై నమోదైన కేసులను CBN ఒక్కొక్కటిగా మూసి వేయించుకుంటున్నారని YCP దుయ్యబట్టింది. ‘స్కామ్తో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది. ₹370 CR డొల్ల కంపెనీలకు వెళ్లాయని విచారణలో తేలింది. ఆధారాలు ఉండడంతో CBN జైలుకూ వెళ్లారు. ఇపుడు అధికార దుర్వినియోగంతో కోర్టుకు తప్పుడు నివేదిక ఇప్పించి కేసు మూసి వేయించడం సిగ్గుచేటు’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

శునకాల నియంత్రణలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఎవరికైనా కుక్క కరిచి మరణిస్తే భారీ పరిహారం అందించేలా ఆదేశిస్తామని స్పష్టం చేసింది. కాగా ఏకపక్షంగా కాకుండా, సమగ్ర పరిష్కారం చూపాలని డాగ్ లవర్స్ SCని కోరారు. ప్రజలు వాటిని దత్తత తీసుకునేలా ఇన్సెంటివ్స్ ప్రకటించాలని సూచించారు. దీంతో అనాథలు, రోడ్లపై అభాగ్యులకు ఇది చేయొచ్చుగా? అని ధర్మాసనం ధ్వజమెత్తింది.

సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు ముగ్గులూ వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు కనువిందు చేస్తుంటాయి. హేమంతరుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం, గొబ్బెమ్మలను పెట్టడం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది.
Sorry, no posts matched your criteria.