News September 22, 2024

‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటున్నారా?

image

‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాయ్‌లో బిస్కెట్లు తింటే అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరుతుంది. బిస్కెట్లను షుగర్, మైదాపిండితో తయారు చేయడంతో చక్కెర స్థాయులు పెరుగుతాయి. శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలూ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. హెర్బల్ టీ తాగడం ఉత్తమం.

News September 22, 2024

చిరంజీవికి సీఎం అభినందనలు

image

మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కడం గర్వించదగ్గ విషయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. మరో వైపు చిరంజీవికి కంగ్రాట్స్ చెబుతూ మెగా అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఏ రికార్డు అయినా మెగాస్టార్‌కు దాసోహం అనాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.

News September 22, 2024

సచిన్‌ను అధిగమించిన రోహిత్ శర్మ

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించారు. అత్యధిక విజయాల్లో పాలు పంచుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 484 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 308 గెలుపుల్లో భాగమయ్యారు. ఈ క్రమంలో ఆయన సచిన్ టెండూల్కర్(307 విజయాలు)ను అధిగమించారు. అగ్ర స్థానంలో రికీ పాంటింగ్(377 విజయాలు)ఉన్నారు. ఆ తర్వాత మహేల జయవర్ధనే(336), విరాట్ కోహ్లీ(322) నిలిచారు.

News September 22, 2024

మూవీలో అనుమతి లేకుండా సీన్స్.. స్టార్ డైరెక్టర్ వార్నింగ్

image

తాను హక్కులు పొందిన ‘నవ యుగ నాయగన్ వేల్ పారి’ నవల నుంచి కొన్ని సీన్లను వాడుకోవడం తనను ఇబ్బంది పెట్టినట్లు దర్శకుడు శంకర్ ట్వీట్ చేశారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా ట్రైలర్‌లో ముఖ్యమైన సీన్‌ను గమనించానని తెలిపారు. దయచేసి నవలలోని సన్నివేశాలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో వాడొద్దని కోరారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆయన ఏ సినిమాను ఉద్దేశించి అన్నారో అని చర్చ మొదలైంది.

News September 22, 2024

జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థులు

image

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. తొలుత ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు. ఏలూరులోని ఓ మెడికల్ కాలేజీ నుంచి 14 మందికిపైగా వైద్య విద్యార్థులు ఇవాళ టూర్‌కు వచ్చారు.

News September 22, 2024

నన్ను ధోనీతో పోల్చకండి: పంత్

image

బంగ్లాతో జరిగిన టెస్టులో భారత మాజీ కెప్టెన్ ధోనీ సెంచరీల సంఖ్యను రిషభ్ పంత్ సమం చేశారు. తనను ఆయనతో పోల్చవద్దని మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో విజ్ఞప్తి చేశారు. ‘ధోనీ భాయ్‌ జట్టైన సీఎస్కే హోం గ్రౌండ్‌లో సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. నా ఆలోచనా శైలి వేరుగా ఉంటుంది. దాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటుంటాను. చుట్టూ ఏం జరుగుతుందన్నది పట్టించుకోకుండా నా ఆటపైనే దృష్టి పెట్టడం నాకు అలవాటు’ అని తెలిపారు.

News September 22, 2024

ఈ రోజు అరుదైనది.. భార‌త‌దేశానికి కూడా

image

భారతదేశంతో సహా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ రోజు(ఆదివారం) ప‌గ‌లు, రాత్రి వేళ‌లు దాదాపు స‌మానంగా ఉండ‌నున్నాయి. ఈ రోజు సాయంత్రం 6:13 గంట‌ల‌కు సెప్టెంబ‌ర్ ఈక్వినాక్స్ చోటుచేసుకోనుంది. అంటే, సూర్యుడు ఉత్తరార్ధ గోళం నుంచి భూమ‌ధ్య రేఖ‌ను దాటుతూ దక్షిణార్ధ గోళం వైపు కదులుతాడు. ఫలితంగా భారత్ సహా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పగలు-రాత్రి వేళ‌లు దాదాపు సమానంగా ఉంటాయి. ఏటా Mar, Sep నెలల్లో ఇలా జరుగుతుంది.

News September 22, 2024

‘దేవర’కు అనిరుధ్ రవిచందర్ రివ్యూ!

image

‘దేవర’ ఈ నెల 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని మూవీ టీమ్ మరింతగా పెంచుతోంది. తాజాగా ఆ సినిమా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ దేవర గురించి ట్వీట్ చేశారు. మూవీ బ్లాక్‌బస్టర్ అన్న అర్థం వచ్చేలా మూడు కప్పులు, చప్పట్ల ఎమోజీలు పెట్టి దేవర అని హాష్ ట్యాగ్ ఇచ్చారు. దీంతో తమ హీరో హిట్ కొట్టేసినట్లే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News September 22, 2024

కేటీఆర్‌వి నిరాధార ఆరోపణలు: మంత్రి కోమటిరెడ్డి

image

TG: రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉందా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో లేదో తెలియడం లేదన్నారు. అమృత్ టెండర్లపై <<14158364>>కేటీఆర్<<>> నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.8,888 కోట్ల అక్రమాలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, అందుకే KTR ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

News September 22, 2024

BIG ALERT.. 4 రోజులు భారీ వర్షాలు

image

తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.