India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టాక్ మార్కెట్లు ఆరంభంలోనే అదుర్స్ అనిపించాయి. లాభాలతో మొదలైన సూచీలు సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి. BSE సెన్సెక్స్ 84,843, NSE నిఫ్టీ 25,910 లెవల్స్ను టచ్ చేశాయి. ఇదే జోరు ప్రదర్శిస్తే సెన్సెక్స్ 85K, నిఫ్టీ 26Kను బ్రేక్ చేయడం ఖాయమే. M&M, శ్రీరామ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్ టాప్ గెయినర్స్. ICICI బ్యాంకు, హిందాల్కో, HCL టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, JSW స్టీల్ నష్టపోయాయి.

TG: డెబ్బై ఏళ్లు పైబడిన వారిని సైతం ఆయుష్మాన్ భారత్ కింద చేర్చాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 70 ఏళ్లు పైబడిన వారు 5లక్షల మంది ఉన్నట్లు వైద్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. వీరందరికీ ఆయుష్మాన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని కింద దేశవ్యాప్తంగా ఏ ఆస్పత్రిలోనైనా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందొచ్చు.

TG: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వేతన సవరణ సిఫార్సులకై ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈ కమిటీ ఇంకా ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఆపై ఫిట్మెంట్, ఇతర అంశాలపై ప్రభుత్వంతో చర్చించి పూర్తి నివేదిక సిద్ధం చేస్తుంది. దీని కోసం కమిటీ గడువును మరో 3 నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

AP: కాకినాడ(R) MLA పంతం <<14168792>>నానాజీ <<>>పట్ల వైద్యులు ఇంకా గుర్రుగానే ఉన్నారు. కాకినాడ RMC వైద్యుడిపై దాడి చేసిన ఆయన్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. MLA, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. ఇవాళ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేయనుండగా, రేపు ఇతర సంఘాల మద్దతుతో కాకినాడ SPకి ఫిర్యాదు చేయనుంది. ఈ ఘటనపై MLA ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.

ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె ఫిర్యాదుతో అరెస్టైన నిందితుడు కుక్కల విద్యాసాగర్కు ఏసీఎంఎం కోర్టు రిమాండ్ విధించింది. అక్టోబర్ 4 వరకు విద్యాసాగర్ రిమాండ్లో ఉండనున్నారు. అతడిని డెహ్రాడూన్ నుంచి నిన్న విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేయించి తెల్లవారుజామున 4వ ఏసీఎంఎం జడ్జి ఇంటి వద్ద హాజరుపర్చారు.

గూగుల్, Nవిడియా, అడోబి సహా 15 టెక్ కంపెనీల CEOలను PM మోదీ MITలో కలిశారు. AI, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, బయో టెక్నాలజీ రంగాలపై చర్చించారు. హ్యూమన్ డెవలప్మెంట్, గ్లోబల్ ఎకానమీని టెక్నాలజీ విప్లవాత్మకంగా మార్చిందన్నారు. మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతున్న భారత్లో ఇన్నోవేషన్కు అనువైన వాతావరణం ఉందన్నారు. దీనిని క్యాపిటలైజ్ చేసుకోవాలన్న తన సూచనకు CEOలు సానుకూలంగా స్పందించారని ట్వీట్ చేశారు.

ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన రికార్డు నెలకొల్పారు. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో జడ్డూ 86 పరుగులతో పాటు 5 వికెట్లు తీశారు. ఇలా ఒక టెస్టులో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు 5 వికెట్లు తీయడం జడేజాకు ఇది 12వ సారి. భారత క్రికెటర్లలో ఈ లిస్టులో జడ్డూనే టాప్లో ఉన్నారు. ఆ తర్వాత అశ్విన్(11), కపిల్ దేవ్(7), హర్భజన్(3) ఉన్నారు.

మిస్ యూనివర్స్ ఇండియా-2024గా రియా సింఘా నిలిచారు. జైపూర్లో దీనికి సంబంధించిన పోటీలు జరిగాయి. ఇందులో విజేతగా నిలిచిన రియా మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ఈవెంట్కు నటి, మిస్ యూనివర్స్ ఇండియా- 2015 ఊర్వశీ రౌతేలా జడ్జిగా వ్యవహరించారు. ఈసారి తప్పకుండా ఇండియా గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

AP: మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి రూ.5-10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. అటు అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి కేకలు లేకుండా పేదలకు మూడు పూటలా ఆహారం అందుతుందన్నారు.

పండుగల సమయాల్లో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై రైల్వేశాఖ ఫోకస్ పెట్టింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా పోలీసులే ఉన్నట్లు గుర్తించిన రైల్వే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అలాంటి వారిపై రైల్వే యాక్ట్ 1989 ప్రకారం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం వచ్చే నెల 1 నుంచి 15 వరకు, 25 నుంచి నవంబర్ 10 వరకు తనిఖీలు నిర్వహించనుంది.
Sorry, no posts matched your criteria.