India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

INDvBAN 2వ టెస్టులో బంగ్లా అభిమాని ఒకరు కుప్పకూలిన సంగతి తెలిసిందే. కేవలం అనారోగ్యంతోనే పడిపోయినా, సంచలనం సృష్టించి వార్తల్లోకి వచ్చేందుకే భారత అభిమానులు దాడి చేసినట్లు అతడు ఆరోపించాడని రెవ్స్పోర్ట్జ్ అనే వెబ్ సైట్ తెలిపింది. బీసీసీఐ అధికారి ఒకరు తమతో అతడి గురించి చెప్పినట్లు స్పష్టం చేసింది. కాగా.. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో సైతం స్థానికులు తనను తిట్టినట్లు అతడు ఆరోపించాడు.

భారతీయులు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదేమో! గ్లోబల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం.. అత్యధికంగా అమెరికాలో 44 లక్షలమంది పైచిలుకు ప్రవాసీయులు నివసిస్తున్నారు. ఆ తర్వాత UAEలో 34.25 లక్షలమంది, మలేషియాలో 29.87 లక్షలు, సౌదీలో 25.94 లక్షలు, మయన్మార్లో 20.09 లక్షలు, UKలో 17.64 లక్షలు, కెనడాలో 16.89 లక్షలు, సౌతాఫ్రికాలో 15.60 లక్షలు, మారిషస్లో 8.94 లక్షలు, సింగపూర్లో 6.50లక్షలమంది నివసిస్తున్నారు.

TG: హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెప్పారు. కూల్చివేతల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.లక్షలు పెట్టి ఇళ్లు కొన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామనడం సరికాదన్నారు. ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన విషయం మరువొద్దన్నారు. కూల్చివేతలపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు.

ఆన్లైన్ షాపింగ్ సైట్స్ flipkart & amazonలో భారీ డిస్కౌంట్స్ సేల్ నడుస్తోంది. టీవీ, మొబైల్స్ వంటివి యూజర్లు బుక్ చేస్తున్నారు. అయితే ఫ్లిప్కార్ట్లో నిన్న ఓ వ్యక్తి గూగుల్ పిక్సల్ మొబైల్ ఆర్డర్ చేయగా ఈరోజు డెలివరీ అయింది. కానీ, బాక్స్కు సీల్ లేకపోవడం, మొబైల్పై స్క్రాచెస్ ఉండటం చూసి అతను OTP షేర్ చేయలేదు. దీంతో పార్సిల్ రిటర్న్ వెళ్లింది. మీరు కూడా ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయడం బెటర్.

AP: తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి అనేక మంది ఇతర మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘చట్టాన్ని గౌరవించాల్సిన మొదటి వ్యక్తి సీఎం. ఆ హోదాలోనే జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు. గతంలో డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పడానికి ఆయనకు సిగ్గుండాలి. జగన్కు విశ్వసనీయత లేదు. దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందే. మత సామరస్యాన్ని పాటిద్దాం’ అని స్పష్టం చేశారు.

AP: బైబిల్ చదువుతానని చెప్పిన YS జగన్కు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘అన్య మతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎన్నో ఏళ్లుగా డిక్లరేషన్ అనేది ఉంది. CMగా ఉన్నప్పుడు ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు. అప్పుడు చేసినట్లుగా ఇప్పుడూ చేస్తానంటే ఎలా? చట్టాలు, సంప్రదాయాలను గౌరవించడంలో సీఎం మొదటి వ్యక్తిగా ఉండాలి’ అని సీఎం సూచించారు.

కనీసం 15% టెక్నికల్ ఖాళీలను అగ్నివీర్లకు రిజర్వ్ చేస్తున్నట్టు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది. అలాగే, ఔట్సోర్సింగ్ కార్యకలాపాలు, అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ విభాగాల్లో 50% ఖాళీలను వీరి ద్వారా భర్తీ చేయనుంది. సాయుధ దళాలలో 4 ఏళ్ల సేవ తర్వాత అగ్నివీర్లు తమ తమ రంగాలలో నైపుణ్యంతో పాటు లోతైన క్రమశిక్షణ, జాతీయవాదాన్ని పెంపొందించుకుంటారని సంస్థ డిప్యూటీ CEO Dr. సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.

AP: తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని జగన్ అబద్ధాలు చెబుతున్నారని CM చంద్రబాబు విమర్శించారు. ‘ఏఆర్ డెయిరీ 8 ట్యాంకర్ల నెయ్యిని పంపింది. 4 ట్యాంకర్లను సిబ్బంది వాడారు. 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. ఆ కంపెనీపై ఆరోపణలు రావడంతో NDDBకి పంపారు. వాళ్లు ఇచ్చిన రిపోర్టును జగన్ తప్పుపడుతున్నారు. తెలిసీ తెలియక పొరపాట్లు చేస్తే సంప్రోక్షణ చేస్తారు. అందుకే ఈ నెల 23న అర్చకులు శాంతి యాగం చేశారు’ అని పేర్కొన్నారు.

APలో వరద బాధితుల కోసం రిలయన్స్ సంస్థ భారీ విరాళం అందించింది. రిలయన్స్ ఫౌండేషన్ తరఫున రూ.20 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు మెంబర్ ప్రసాద్, సంస్థ మెంటార్ మాధవరావు ఇచ్చారు. అటు ITC గ్రూప్ రూ.2 కోట్లు, LG పాలిమర్స్ సంస్థ రూ.2 కోట్లు, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల ద్వారా మోహన్ బాబు రూ.25 లక్షల విరాళం సీఎంకు అందించారు.

AP: భక్తులు పవిత్రంగా భావించే తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇతర మతస్థులు అక్కడికెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ‘దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందే. జగన్కు తిరుమలకు వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు. ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పాం. తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.