News October 9, 2024

గత ముఖ్యమంత్రి నిరుద్యోగులను పట్టించుకోలేదు: సీఎం రేవంత్

image

TG: తమ ప్రభుత్వం 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామకపత్రాలు అందజేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కానీ గత ముఖ్యమంత్రి వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. తాము 65 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామన్నారు.

News October 9, 2024

హరియాణా, ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకటే: జగన్

image

AP: హరియాణా ఎన్నికలు కూడా AP తరహాలోనే జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందిన US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోనే బ్యాలెట్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. మనం కూడా అదే విధానానికి వెళ్లడం మంచిది. ఓటర్లలో విశ్వాసం నింపేందుకు న్యాయనిపుణులు ముందుకు రావాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News October 9, 2024

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈనెల 14న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. అత్యాచారం కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

News October 9, 2024

‘అన్‌స్టాపబుల్’ షోలో బాలయ్యతో అల్లు అర్జున్!

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. వీరిద్దరి కాంబోలో ‘పుష్ప’ రిలీజ్ సమయంలో ఓ ఎపిసోడ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ‘పుష్ప-2’ రిలీజ్‌కు ముందు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.

News October 9, 2024

GOOD NEWS: ఫోర్టిఫైడ్ రైస్ సప్లై గడువు పెంపు

image

విటమిన్లు కలిపిన ఉచిత ఫోర్టిఫైడ్ రైస్‌ను 2028 వరకు ఇవ్వాలని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. PMGKAY, ఇతర వెల్ఫేర్ స్కీంల కింద వీటిని సరఫరా చేసేందుకు ఆమోదించింది. ఇందుకయ్యే పూర్తి ఖర్చు రూ.17,082 కోట్లకు కేంద్రమే భరించనుంది. 2019-21 మధ్య చేసిన హెల్త్ సర్వేలో దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలో రక్తహీనత, విటమిన్ల లోపం ఎక్కువగా ఉందని తేలింది. ఈ బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్న సంగతి తెలిసిందే.

News October 9, 2024

అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: CM

image

AP: పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో అగ్రదేశంగా నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.

News October 9, 2024

జో రూట్ సరికొత్త మైలురాయి

image

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సరికొత్త మైలురాయి అందుకున్నారు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ సెంచరీ బాదారు. ఇప్పటివరకు ఆయన 35 శతకాలు సాధించారు. ఈ క్రమంలో లారా, గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్ధనే (34)లను ఆయన అధిగమించారు. ఓవరాల్‌గా సచిన్ (51), కల్లిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38), రాహుల్ ద్రావిడ్ (35) టాప్‌లో ఉన్నారు.

News October 9, 2024

నిరుద్యోగులతో సర్కార్ చెలగాటం: షర్మిల

image

AP: నాలుగు నెలలుగాAPPSCకి ఛైర్మన్‌ను నియమించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని PCC చీఫ్ YS షర్మిల మండిపడ్డారు. ఏపీపీఎస్సీపై నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ‘శ్వేతపత్రాలపై పెట్టిన శ్రద్ధ, ఏపీపీఎస్సీపై కూడా పెట్టాలి. తక్షణమే దానికి ఛైర్మన్‌ను నియమించాలి. వాయిదా వేసిన పరీక్షలతో పాటు ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా షెడ్యూల్ ప్రకటించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.

News October 9, 2024

BJPలో చేరిన ఇద్దరు ఇండిపెండెంట్ MLAలు

image

హరియాణాలో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు BJPలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో ఎమ్మెల్యేలు దేవేందర్ కడ్యాన్, రాజేశ్ జూన్‌ కమలం గూటికి చేరుకున్నారు. వీరి చేరికతో బీజేపీ ఎమ్మెల్యేల బలం 50కి చేరుకుంది. మరోవైపు భారత సంపన్న మహిళ, హిసార్ ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ కూడా బీజేపీకి మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

News October 9, 2024

గ్రూప్-1 మెయిన్స్‌పై కీలక అప్‌డేట్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు TGPSC ప్రకటించింది. అదే రోజు నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.