India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2019 హరియాణా ఎన్నికల్లో కింగ్ మేకర్గా నిలిచిన JJP ఈ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపలేకపోయింది. దుశ్యంత్ చౌతాలా సారథ్యంలోని ఈ స్థానిక పార్టీ జాట్ వర్గాల అండతో గత ఎన్నికల్లో 14.80% ఓట్లతో 10 సీట్లు గెల్చుకొని BJP ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. దుశ్యంత్ను DyCM పదవి వరించింది. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు. ఉచన కలన్లో దుశ్యంత్ 5వ స్థానానికి పరిమితమయ్యారు.

ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటనకు వెళ్తారు. అక్కడ ఆయన రెండు రోజులపాటు పర్యటిస్తారని విదేశాంగశాఖ తెలిపింది. 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ ఈస్ట్ ఆసియా సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. ఈ సమ్మిట్లో వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావోస్తోనూ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

TG: వెహికల్ స్క్రాపింగ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి, అదే కేటగిరీలో కొత్త వాహనం కొంటే రాయితీ కల్పించనుంది. టూ వీలర్స్ ధర ₹లక్షలోపు ఉంటే ₹1000, ₹1-2లక్షలు అయితే ₹2,000, ₹2-3లక్షలకు ₹3,000, 4 వీలర్స్కు ధర ₹0-5లక్షలు ఉంటే ₹10,000, ₹5-10Lకు ₹20,000, ₹10-15Lకు ₹30,000, ధర ₹20లక్షలకు పైన ఉంటే ₹50,000 రాయితీ ఇవ్వనుంది.

AP: ఈనెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు Dy.CM పవన్ తెలిపారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ₹4500 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని సూచించారు. 3000kms మేర సీసీ రోడ్లు, 500 kms మేర తారు రోడ్లు వేయాలన్నారు.

జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డకౌట్ అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులు కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. దీంతో హరియాణాలో కాంగ్రెస్తో చేతులు కలపకపోవడమే పెద్ద తప్పిదమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొత్తు పెట్టుకొని ఉంటే అధికార బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హరియాణా ఎన్నికల్లో BJP అనూహ్యంగా పుంజుకోవడం వెనుక RSS కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత 4 నెలల్లో క్షేత్రస్థాయిలో 16 వేలకుపైగా సమావేశాలు నిర్వహించింది. సంఘ్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం ద్వారా జాట్యేతర ఓట్లను BJPకి చేరువ చేసినట్టు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. పైగా అభ్యర్థుల ఎంపికలో BJP-RSS ఈసారి కలిసి పనిచేశాయి. హిందూ సమాజం సంఘటితంపై మోహన్ భాగవత్ పిలుపు ఫలితాన్నిచ్చింది.

మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా డ్రగ్స్ వ్యవహారం సైతం తెరపైకొచ్చింది. ఇటీవల గ్యాంగ్స్టర్ ఓం ప్రకాశ్ నిర్వహించిన డీజే పార్టీలో పలువురు నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. పిశాచి చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన నటి ప్రయాగ మార్టిన్, మంజుమ్మల్ బాయ్స్ నటుడు శ్రీనాథ్ భాసి పార్టీలో ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్-2025కు దరఖాస్తు గడువు తేదీని అధికారులు మరోసారి పొడిగించారు. గతంలో ప్రకటించినదాని ప్రకారం అక్టోబర్ 3నే గడువు ముగియాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. డెడ్లైన్ పొడిగించడం ఇది రెండోసారి. తొలుత సెప్టెంబర్ 26నే గడువు తేదీగా ప్రకటించారు. gate2025.iitr.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

AP: అవినీతి సొమ్ము ఎలా సంపాదించాలనే విషయంలో జగన్ దేశానికే ఓ రోల్ మోడల్ అని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఆరోపించారు. ‘APని జగన్ నాశనం చేసిన తీరుపై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి. తిరుమలలో కమీషన్లు తీసుకున్న ఘనత గత ప్రభుత్వానిది. TTDకి చెందిన కొన్ని రిజర్వేషన్లలో YV సుబ్బారెడ్డి మార్పులు తెచ్చింది వాస్తవం కాదా? తిరుమలలో ఫొటోషూట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఈనేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ తదుపరి సీఎం అని ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.