India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1911: సినీ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు జననం
1957: మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను ప్రయోగించిన సోవియట్ యూనియన్
1977: నటి సంఘవి జననం
1997: క్రికెటర్ రిషబ్ పంత్ జననం
2015: సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మరణం
* అంతర్జాతీయ జంతు దినోత్సవం
మంత్రి కొండా సురేఖ <<14254371>>వ్యాఖ్యలపై<<>> ప్రభాస్, రామ్ చరణ్ స్పందించారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవి, నిరాధారమైనవి. ప్రజలచే ఎన్నుకోబడిన నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దిగ్భ్రాంతికరం. ఇలాంటి ప్రవర్తనను మేము సహించం’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం కరెక్ట్ కాదు. రాజకీయాల కంటే గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి’ అని ప్రభాస్ పోస్ట్ చేశారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: అక్టోబర్ 4, శుక్రవారం
విదియ: తె.5.30 గంటలకు
చిత్త : సా.6.37 గంటలకు
వర్జ్యం: రా.12.54 నుంచి రా.2.42 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.21 నుంచి ఉ.9.09 గంటల వరకు
(2) మ.12.19 నుంచి మ.1.07 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
* సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న మంత్రి సురేఖ
* సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున
* సురేఖ వ్యాఖ్యలను ఖండించిన చిరు, ఎన్టీఆర్, మహేశ్, నాని
* కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ హడావుడి: రేవంత్
* జగన్ లడ్డూ అపవిత్రం చేశారని మేం చెప్పలేదు: పవన్
* కేసులకు YCP శ్రేణులు భయపడొద్దు: జగన్
* PM-RKVY స్కీమ్కు కేంద్రం రూ.లక్ష కోట్ల మంజూరు
పాలస్తీనా, లెబనాన్, ఇరాన్తో యుద్ధాల వల్ల ఇజ్రాయెల్లో ఏర్పడిన కార్మికుల కొరత భారతీయులకు కాసుల పంట కురిపిస్తోంది. ఇజ్రాయెల్లో పనిచేయడానికి భారత ప్రభుత్వం ద్వారా ఎంపికైన స్కిల్డ్ వర్కర్స్కు నెలకు ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్, వైద్య బీమా, వసతి లభిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా సరే భారతీయులు అక్కడ పనిచేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా 11 వేల మందిని ఎంపిక చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లోనే ₹25,000 కోట్ల అతిపెద్ద హ్యుందాయ్ IPO అక్టోబర్ 14న ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. సెబీకి దాఖలు చేసిన కంపెనీ DRHP ప్రకారం సంస్థ భారతీయ విభాగం కంపెనీ, ప్రమోటర్ల ద్వారా 142,194,700 ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ని ప్రతిపాదించింది. ఈ IPOతో మారుతీ సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా గత 20 ఏళ్లలో ప్రజలకు షేర్లు ఆఫర్ చేస్తున్న మొదటి కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది.
TG: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైబరాబాద్లో పీఎస్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో కేటీఆర్, హరీశ్తో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ గొడ్డు మాంసం తినేవారని చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి దినేష్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సావర్కర్ గొడ్డు మాంసం తినడం మాత్రమే కాకుండా, ఆ ఆచారాన్ని బహిరంగంగా ప్రచారం చేశారని చెప్పడంతో వివాదం చెలరేగింది. దీంతో ‘నిజం మాట్లాడినందుకు క్షమించండి’ అని దినేష్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సావర్కర్ బ్రిటిష్ వారికి చెప్పారంటూ పోస్ట్ చేశారు.
AP: జగన్ నివాసంలోని <<14263408>>ఫర్నీచర్పై<<>> ప్రభుత్వానికి YCP లేఖ రాయడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘CM పదవి నుంచి జగన్ని జనం దించేసినా సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయారు. అడ్డంగా దొరికిపోయిన దొంగ జగన్, తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఆనాడు కోడెల శివప్రసాద్ ఇదే లేఖ రాస్తే ఎంత అమానవీయంగా ప్రవర్తించావో గుర్తుతెచ్చుకో జగన్’ అంటూ Xలో చురకలంటించారు.
Sorry, no posts matched your criteria.