India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కోచ్ జాన్ జెలెజ్నీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. సానుకూల వాతావరణంలోనే వేర్వేరు దారులు ఎంచుకున్నట్లు తెలిపారు. టెక్నిక్, రిథమ్ వంటి వాటిలో కోచ్ ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఇతని ట్రైనింగ్లోనే నీరజ్ తన కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మార్క్ను దాటారు. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ జోడీ ఏడాది పాటు కలిసి పని చేసింది.

ఆదివార వ్రతాన్ని ఏడాదంతా ఆచరిస్తే శుభ ఫలితాలుంటాయి. అది వీలుకాకపోతే మాసానికొకటి చొప్పున 12 వారాలు చేయవచ్చు. ఆ రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఎర్ర చందనం, దర్భ కలిపిన జలాన్ని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆదిత్య హృదయం, సూర్య మంత్రాలు పఠించాలి. ఉపవాసముంటే ఉత్తమం. పూజ ముగిశాక దంపతులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఈ వ్రతం చేస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

TG: ‘భూ భారతి’ ఛార్జీల చెల్లింపులో <<18815490>>అక్రమాలపై<<>> CM రేవంత్ సీరియస్ అయినట్లు సమాచారం. ‘ధరణి’ ఉన్నప్పటి నుంచే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించామని మంత్రి పొంగులేటి తెలిపారు. దీనిపై విచారణ జరపాలని, మోసానికి పాల్పడిన ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకుల నుంచి డబ్బు రికవరీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గత 4ఏళ్లలో థర్డ్ పార్టీ ఆడిట్ జరగకపోవడం, సాఫ్ట్వేర్లో లోపాలు ఈ <<18804858>>స్కామ్కు<<>> కారణంగా భావిస్తున్నారు.

AP: పోలవరం తొలిదశను 2027 ఉగాది నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు గతంలో అనుకున్న జూన్ లక్ష్యాన్ని మార్చి నాటికి కుదించాలని అధికారులకు ఆదేశించారు. దీనికి నిర్మాణ సంస్థ మేఘా సైతం అంగీకరించింది. ఇదే సమయంలో పోలవరం స్పిల్వేను ద్రవిడియన్ శైలిలో ఉన్న తోరణాలతో అలంకరించేందుకు డిజైన్లను సదరు సంస్థ CMకు చూపించింది. వీటిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం బీటా-కెరోటిన్ అనే సహజ వర్ణద్రవ్యం. ఇది ఆవులు గడ్డి, ఆకుకూరలు తిన్నప్పుడు ఈ బీటా-కెరోటిన్ పాల కొవ్వులో కలిసిపోయి, పాలకి లేత పసుపు రంగునిస్తుంది. ఇది ‘విటమిన్-ఎ’గా మారుతుంది. గేదె పాలలో బీటా-కెరోటిన్ లేకపోవడం వల్ల తెల్లగా ఉంటాయి. కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి తయారీకి గేదె పాలే మంచివి. ఒకవేళ స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలను ఎంచుకుంటే మంచిదట.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మెన్, సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ(BSW/BA/BCOM), టెన్త్, 7వ తరగతి అర్హత కలిగిన వారు జనవరి 23వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://centralbank.bank.in/

TG: CBI మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్లో అధిక లాభాల పేరుతో వాట్సాప్ ద్వారా వల వేసిన ముఠా ఆమె నుంచి రూ.2.58కోట్లు కొట్టేసింది. నకిలీ ట్రేడింగ్ టిప్స్, తప్పుడు స్క్రీన్ షాట్లతో నమ్మించి పెట్టుబడులు పెట్టించింది. లాభాలు కనిపించినా డబ్బు విత్డ్రా అవకాశం లేకపోవడంతో మోసం బయటపడింది. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోళ్ల ఫారంలో చనిపోయిన కోళ్లను ఎప్పుడూ దాణా బస్తాలపై ఉంచకూడదు. ఇలా చేస్తే మరణించిన కోడిలో ఉండే బాక్టీరియా, వైరస్లు దాని శరీరం నుంచి దాణాలోకి చేరతాయి. ఈ దాణాను మనం షెడ్డు మొత్తం కోళ్లకు వేస్తాము. దీంతో ఆ బాక్టీరియా షెడ్డులో కోళ్లకు వ్యాపించి అవి కూడా మరణిస్తాయి. అందుకే వ్యాధితో ఏదైనా కోడి మరణిస్తే షెడ్డు నుంచి దూరంగా వాటిని పూడ్చిపెట్టాలి. ఈ విషయంలో పెంపకందారులు జాగ్రత్త వహించాలి.

సొరకాయ జ్యూస్ తాగేటప్పుడు జాగ్రత్త అవసరమని ICMR హెచ్చరించింది. ఇటీవల చేదుగా ఉన్న జ్యూస్ తాగి ఢిల్లీలో ఒకరు, UPలో ఇద్దరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిపుణులు పరిశీలించి టెట్రాసైక్లిక్ ట్రైటెర్పినాయిడ్ అనే విష పదార్థాల వల్లే సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ విషానికి ప్రత్యేకంగా విరుగుడు లేదని తెలిపారు. దీంతో ఎక్కువ చేదుగా ఉన్న సొరకాయ జ్యూస్ తాగకూడదని అధికారులు సూచించారు.

పురుగు మందులను పంటపై పిచికారీ చేసే వ్యక్తి తప్పనిసరిగా ముక్కు, కండ్లకు మందు తాకకుండా హెల్మెట్ లాంటిది తప్పనిసరిగా ధరించాలి. మందును కలిపేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. పిచికారీ సమయంలో నీళ్లు తాగడం, బీడీ, సిగరెట్ కాల్చకూడదు. పురుగు మందుల పిచికారీ తర్వాత స్నానం చేశాకే తినాలి. మందును గాలి వీచే వ్యతిరేక దిశలో పిచికారీ చేయరాదు. సాధ్యమైనంత వరకు గాలి, ఎండ ఉన్న సమయంలోనే స్ప్రే చేయడం మంచిది.
Sorry, no posts matched your criteria.