India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రెగ్నెన్సీలో మహిళలు అన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుకతో ఎలాంటి లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణుల్లో విటమిన్ డి లోపం ఉండడం వల్ల శిశువులు అధిక బరువు, గుండె జబ్బులు, మల్టిపుల్ స్లెరోసిస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి విటమిన్ D లోపం లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

గుజరాత్లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్ పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు. 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్లో 230 ఆవులు, గేదెలున్నాయి. రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తూ 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలు అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయమే లక్ష్యమంటున్నారు. ఈమె సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

ఇరాన్లో అమెరికా జోక్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా తెలిపింది. ‘2025 జూన్లో ఇరాన్పై చేసిన దాడిని రిపీట్ చేయాలనుకునేవారు, బయటి శక్తుల ప్రేరేపిత అశాంతిని వాడుకోవాలనుకునేవారు.. అటువంటి చర్యల వల్ల మిడిల్ఈస్ట్లో పరిస్థితులపై, అంతర్జాతీయ భద్రతపై ఉండే వినాశకరమైన పరిణామాల పట్ల అలర్ట్గా ఉండాలి’ అంటూ పరోక్షంగా హెచ్చరించింది. అంతకుముందు ఇరాన్ నిరసనకారులకు సాయం అందబోతోందని ట్రంప్ ప్రకటించారు.

సికింద్రాబాద్, RKపురంలోని <

డైరెక్టర్ తేజ కుమారుడు అమితోవ్ తేజ భారీ మోసానికి గురయ్యారు. ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్కు చెందిన దంపతులు రూ.63 లక్షలు కాజేశారనే ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షేర్మార్కెట్ నిపుణులమంటూ పరిచయం పెంచుకున్న అనూష, ప్రణీత్ దంపతులు ఫేక్ ప్రాఫిట్స్ చూపించి నమ్మించారు. లాభాలు రాకపోగా పెట్టిన డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో అమితోవ్ పోలీసులను ఆశ్రయించారు.

పాడి పశువుల పోషణలో మణిబెన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి మేలైన పచ్చగడ్డి, దాణా అందిస్తున్నారు. ఒక పశువు నుంచి మెషిన్ సాయంతో 9-14 లీటర్ల పాలను తీస్తున్నారు. 16 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర 140 పెద్ద గేదెలు, 90 ఆవులు, 70 దూడలున్నాయి. మరో 100 గేదెలను కొనుగోలు చేశారు. డెయిరీ ఫామ్ను విస్తరించి ఈ ఏడాది 3 కోట్ల వ్యాపారం చేయాలని మణిబెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

మకర సంక్రాంతిలో ‘మకరం’ అంటే మొసలి. సుఖాలకు అలవాటుపడి మార్పును నిరోధించే మనిషి మొసలి పట్టులో చిక్కుకున్న వాడితో సమానం. జీవితంలో కదలిక లేకపోతే ఆందోళనలు, అనారోగ్యాలు తప్పవని, మార్పును ఆహ్వానించడమే ఉత్సవమని ఈ పండుగ బోధిస్తుంది. అందుకే సంక్రాంతి వేళ స్నానాదులు, శివాభిషేకంతో మనసును శుద్ధి చేసుకోవాలి. మనసులో నిరంతరం సానుకూల కదలిక ఉండాలని, శత్రుత్వాలు వీడి కలిసి మెలిసి ఉండాలనేదే ఈ పండుగ ఇచ్చే సందేశం.

TG: భూ భారతి చలాన్ల దుర్వినియోగం కేసులో అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. RR, యాదాద్రి జిల్లాల్లోనే భారీగా అవినీతి జరగగా అక్రమార్కులతో తహశీల్దార్లు కుమ్మక్కయ్యారనే అనుమానాలున్నాయి. రూ.కోట్ల విలువైన భూములకు రూ.లక్షల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండగా 40-50 రూపాయలే చలాన్ కట్టి మిగతా సొమ్మును కాజేశారు. కాగా ఈ భాగోతం బయటపడటంతో ప్రభుత్వం పోర్టల్లో ఇంటర్ఫేజ్ వ్యవస్థను బలోపేతం చేసింది.

2011లో కేవలం 10, 12 పశువులతో మణిబెన్ జేసుంగ్ చౌదరి పాల ఉత్పత్తి ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు బన్నీ, మెహ్సాని, ముర్రా గేదెలు, హెచ్ఎఫ్ ఆవులు, స్వదేశీ కంక్రేజ్ జాతులు ఆమె డెయిరీలో ఉన్నాయి. మణిబెన్ ముగ్గురు కుమారులు గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ.. వారు పూర్తిగా ఈ పాడి పరిశ్రమలోనే పనిచేస్తున్నారు. ఆధునిక మిల్కింగ్ యంత్రాల సహాయంతో ఆవులు, గేదెలకు పాలు పితుకుతూ తల్లికి తోడుగా నిలుస్తున్నారు.

మెనోపాజ్దశలో ఆడవాళ్లలో ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సంతాన సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్ మరింత ఎక్కువని ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ జర్నల్లోని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో సంతాన లేమి, గర్భస్రావం, మృత శిశువు జన్మించటం వంటివి జరిగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్ ముప్పు 16శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.