India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వరుస సెలవుల ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఎస్ఎస్డీ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 84,014 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 35,131 మంది తలనీలాలు సమర్పించారు. ఆలయ హుండీ ఆదాయం రూ.3.69 కోట్లుగా నమోదైంది. భక్తులు దర్శనానికి ముందుగా సరైన ప్రణాళికతో రావాలని, భద్రతా సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

భారత స్వాతంత్య్ర సమరంలో ఎందరో వీరవనితలు పాలుపంచుకున్నారు. 1857కు ముందే రాణి అబ్బక్క చౌతా, రాణి వేలు నాచియార్, కిట్టూరు చెన్నమ్మ సమరశంఖం పూరించగా, సిపాయిల ఉద్యమ కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్ మహల్, 1885లో కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, మేడం కామా, అనీబిసెంట్, ముత్తు లక్ష్మిరెడ్డి, లక్ష్మీ సెహగల్, సుచేత కృపాలాని, మాతంగిని హజ్రా, కమలాదేవి చటోపాధ్యాయ, అరుణా అసఫ్ అలీ కీలకపాత్ర పోషించారు.

AP: అమరావతిలోని రాయపూడిలో జరుగుతున్న రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. పతాకావిష్కరణ తర్వాత పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. కాగా తొలిసారిగా అమరావతిలో గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. అమరావతి రైతులు, విద్యార్థులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

MPలోని ఇండోర్లో కలుషిత నీరు తాగి మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. భగీరథ్పురలో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోవ్లో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అటు ప్రభుత్వం 21 మంది మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. కాగా బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ తెలిపారు.

RRB ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి 3 రోజులే ( JAN 29) సమయం ఉంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

<

నెలలు నిండే కొద్దీ గర్భిణుల్లో నిద్రలేమి పెరుగుతుంది. దీనికోసం కొన్ని చిట్కాలు చెబుతున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో డాక్టర్లు చెబితే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోకూడదు. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండాలి. నిద్రకు ముందు లైట్గా కాళ్లు, చేతులు, తల మసాజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

వెనిజులా అధ్యక్షుడు మదురోను పట్టుకునే ఆపరేషన్లో ‘డిస్కాంబోబులేటర్’ అనే సీక్రెట్ వెపన్ ఉపయోగించినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రత్యర్థి సైనిక పరికరాలు పూర్తిగా పనిచేయకుండా చేశామని, వారి వద్ద రష్యా, చైనా రాకెట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్కటి కూడా తమపై ప్రయోగించలేకపోయారని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసే వారిపై దాడులు మరింత విస్తరిస్తామని, అవసరమైతే మెక్సికో వరకూ చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.

ఎండిపోయిన తులసి మొక్క పట్ల నిర్లక్ష్యం తగదు. దాన్ని ఎలా పడితే అలా పారవేయకూడదు. పవిత్రంగా స్నానం చేసి, విష్ణువును ధ్యానిస్తూ తొలగించాలి. పవిత్రమైన చోట పాతిపెట్టాలి. పారే నదిలో నిమజ్జనం చేసినా మంచిదే. ఈ ప్రక్రియను గురువారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చేయడం మంచిది. రోడ్ల పక్కన, చెత్తలో వేస్తే ప్రతికూలత పెరుగుతుంది. నియమబద్ధంగా తొలగిస్తే తెలియక చేసిన దోషాలు తొలగి, భగవంతుని కృప లభిస్తుంది.

స్కూల్ కేవలం చదువు కోసం మాత్రమే కాదు పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం కూడా అంటున్నారు నిపుణులు. స్కూల్ దూరం, ఖర్చు, విద్యా ప్రమాణాలు, సెక్యూరిటీ వంటి విషయాలను ప్రధానంగా తెలుసుకోవాలి. పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకుని వారికి తగ్గ స్కూల్లో వేయడం అనేది చాలా ముఖ్యం. చదువుతో పాటు క్రీడలు, కళలను ప్రోత్సహించే పాఠశాలల్లో చేర్చడం మంచిది. గత ఫలితాలు, టీచింగ్, టీచర్లకు ఉన్న అర్హతలు వంటివి తెలుసుకోవడం ముఖ్యం.
Sorry, no posts matched your criteria.