News August 12, 2025

INDvsENG: చరిత్ర సృష్టించిన సిరీస్

image

ENG, IND మధ్య జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రికార్డులు తిరగరాసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌‌లో అత్యధిక మంది వీక్షించిన టెస్ట్ సిరీస్‌గా నిలిచింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌లో 17 కోట్ల మంది తిలకించారు. ఐదో టెస్టు చివరి రోజున ఏకకాలంలో రికార్డు స్థాయిలో 1.3 కోట్ల మంది వీక్షించారు. సిరీస్ మొత్తం 65 బిలియన్ మినట్స్ వాచ్ టైమ్‌ను నమోదు చేసింది. కాగా ఈ సిరీస్ 2-2తో సమమైన విషయం తెలిసిందే.

News August 12, 2025

ఆదాయ పరిమితిని బట్టి రిజర్వేషన్లు.. మీ కామెంట్

image

SC, ST, BC రిజర్వేషన్లలో అంతర్గత ఆదాయ పరిమితి విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఆయా కులాల్లో డబ్బున్నోళ్లకు రిజర్వేషన్లు ఎందుకన్నదే పిటిషన్ ప్రధానోద్దేశం. BCల్లో క్రీమిలేయర్ ఇలాంటిదే. అయితే SC, STల్లోనూ సంపన్నులకు కాకుండా పేదలకే ఈ ఫలాలు దక్కాలన్నది పిటిషనర్ల వాదన. దీనిపై మీరేమంటారు? కొన్నేళ్లయ్యాక రిజర్వేషన్లు వద్దన్న అంబేడ్కర్ ఆశయాన్ని ఈ వాదన నెరవేర్చేనా?

News August 12, 2025

రష్యా చమురు కొనబోమని భారత్ చెప్పిందా!

image

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు నిలిపేస్తే పరిస్థితేంటని అంతటా చర్చిస్తున్నారు. అయితే భారత వైఖరేంటో పట్టించుకోవడమే లేదు. జియో పాలిటిక్స్, స్వప్రయోజనాలు, తక్కువ ధరను బట్టి నచ్చిన మార్కెట్లో కొంటామందే తప్ప రష్యా నుంచి ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు. పైగా అక్కడి నుంచి కొనొద్దని రిఫైనరీలకు ఆదేశాలూ ఇవ్వలేదు. కొన్నాళ్ల కిందట రష్యా వద్ద ధరెక్కువని ఇరాక్, సౌదీ నుంచి దిగుమతులు పెంచుకోవడమే ఇందుకు ఉదాహరణ.

News August 12, 2025

CBIకి వామనరావు కేసు.. నాడు ఏం జరిగింది..?

image

తెలంగాణ హైకోర్టు లాయర్ దంపతులు గట్టు <<6386668>>వామన రావు<<>>, నాగమణి 2021 FEB 17న హత్యకు గురయ్యారు. కారులో వెళ్తున్న వారిని పెద్దపల్లి జిల్లా కాల్వచర్ల సమీపంలో దుండగులు అడ్డుకుని కత్తులతో దాడి చేయగా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మంథని PSలో ఓ కస్టోడియల్ డెత్ సహా పలు అంశాలపై HCలో <<17379008>>వామనరావు<<>> పిల్స్ వేశారు. వాటిపై కొందరు పోలీసులు తనను బెదిరిస్తున్నారని 2020లో HCకి లేఖ రాశారు.

News August 12, 2025

కుక్కలను తరలించడం అమానవీయం: రాహుల్

image

ఢిల్లీలో వీధి కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు <<17368812>>ఆదేశాలపై<<>> LoP రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇది అమానవీయం. సైన్స్ ఆధారిత విధానానికి విరుద్ధం. ఏరివేయడానికి నోరు లేని జీవులేం సమస్యలు కావు. క్రూరత్వానికి తావులేకుండా షెల్టర్లు, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, కమ్యూనిటీ కేర్ వంటి పద్ధతులతో వీధులను సేఫ్‌గా మార్చొచ్చు. పబ్లిక్ సేఫ్టీ, యానిమల్ వెల్ఫేర్‌ రెండూ సాధ్యమే’ అని ట్వీట్ చేశారు.

News August 12, 2025

‘రావు బహదూర్’ పాత్రలో సత్యదేవ్.. ఫస్ట్ లుక్ చూశారా?

image

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ మరో విలక్షణ పాత్ర కోసం తనని తాను మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంకటేశ్ మహా తెరకెక్కిస్తోన్న ‘రావు బహదూర్’ సినిమాలో టైటిల్ క్యారెక్టర్‌లో ఆయన నటిస్తున్నారు. ‘గుర్తుంచుకోండి. అనుమానం పెనుభూతం’ అంటూ తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది. వచ్చే సమ్మర్లో సినిమా రిలీజ్ చేస్తారు. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్‌బాబు సమర్పిస్తున్నారు.

News August 12, 2025

పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయం: టీడీపీ

image

AP: 30 ఏళ్లుగా పులివెందులలో ఏ ఎన్నిక వచ్చినా వేరే వాళ్లు నామినేషన్స్ వేయకుండా బెదిరించి ఏకగ్రీవం చేసుకునేవాళ్లని టీడీపీ విమర్శించింది. ఈ సారి ఏకంగా 11 మంది నామినేషన్స్ వేయడంతో ఆ చోట ఎన్నికలు వచ్చాయని Xలో తెలిపింది. కూటమి ప్రభుత్వం కారణంగా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయమని పేర్కొంది.

News August 12, 2025

పిల్లలను కన్నాక ఎట్టకేలకు రొనాల్డో నిశ్చితార్థం

image

పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్‌ను నిశ్చితార్థం చేసుకున్నారు. జార్జినా తన ఇన్‌స్టాలో డైమండ్ రింగ్ ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు. 2016 నుంచి సహజీవనం చేస్తున్న వీరికి ఎనిమిదేళ్లకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. రొనాల్డోకు జార్జినాతో కలిసి ఇద్దరు, సరోగసీ ద్వారా ముగ్గురు పిల్లలున్నారు. రొనాల్డో సౌదీ అరేబియాలో అల్-నసర్ క్లబ్ తరఫున ఆడుతున్నారు.

News August 12, 2025

వామన్ రావు హత్యకేసు సీబీఐకి అప్పగించాలి: సుప్రీంకోర్టు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్ రావు దంపతుల <<6352207>>హత్య<<>> కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్‌ కిషన్ రావుకు భద్రత కల్పించాలని సూచించింది. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇప్పటికే స్పష్టం చేశారు.

News August 12, 2025

అంబానీని టార్గెట్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్!

image

అమెరికా పర్యటన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత బిలియనీర్ ముకేశ్ అంబానీని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడి చేస్తే గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీని పేల్చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఖురాన్‌లోని ఓ వాక్యాన్ని ఉదహరిస్తూ అంబానీ ఫొటో చూపిస్తూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా మునీర్‌ బెదిరింపులకు భయపడేది లేదని ఇప్పటికే భారత్ స్ట్రాంగ్ <<17370414>>కౌంటర్<<>> ఇచ్చింది.