News February 1, 2026

4 గంటలు.. అటు కేసీఆర్ విచారణ.. ఇటు ఆందోళనలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు 4 గంటలుగా విచారిస్తున్నారు. మధ్యాహ్నం 3 నుంచి ప్రారంభమైన విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రశ్నలకు ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. విచారణ మొత్తం ఆడియో, వీడియో రూపంలో చిత్రీకరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి.

News February 1, 2026

ప్రజాకర్షక పథకాల జోలికెళ్లని బడ్జెట్!

image

ఈసారి బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలు పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్యాకేజీలు, ప్రత్యేక పథకాల వంటివేమీ ప్రకటించలేదు. కేవలం కొన్ని మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులనే కట్టబెట్టారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా చేపట్టిన ఇనీషియేటివ్స్‌కు కొనసాగింపుగానే చాలా ప్రకటనలు ఉన్నాయి. పన్నుల విషయంలోనూ ఉద్యోగులను ఆకర్షించే పెద్ద అనౌన్స్‌మెంట్స్ లేవని నిపుణులు అంటున్నారు.

News February 1, 2026

అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలి: హైకోర్టు

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు దీన్ని కొనసాగించాలని సూచించింది. అంబటి భార్య వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంబటి ఇంటిపై దాడి కేసులో న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది.

News February 1, 2026

ఈసారి ఈ ‘శారీ’

image

బడ్జెట్ ప్రసంగం వేళ FM నిర్మలమ్మ ధరించిన కాంచీపురం చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, వెండి తీగపై బంగారు పూత మెరిసే జరీతో దీనిని రూపొందించారు. కోర్వాయ్ పద్ధతిలో చీర, అంచులను విడివిడిగా నేసి బలంగా జత చేయడం వీటి ప్రత్యేకత. మూడు పట్టు దారాల కలయిక వల్ల ఇవి బరువుగా, దృఢంగా ఉంటాయి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చీరను ఎంపిక చేశారనే <<19018918>>చర్చ<<>> సాగుతోంది.

News February 1, 2026

రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు

image

బడ్జెట్‌లో రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు కేటాయించారు. ప్రధానంగా కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, ట్రాక్ డబ్లింగ్, ఆధునిక కోచ్‌ల తయారీ వంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రయాణికుల సేఫ్టీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 7 హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. అందులో మూడింటికి హైదరాబాద్ (బెంగళూరు, చెన్నై, పుణే రూట్లు) కేంద్రంగా ఉండటం విశేషం.

News February 1, 2026

ఫోన్ ట్యాపింగ్: అధికారులతో మొదలై కేసీఆర్ వరకు..

image

TG: రెండేళ్లుగా కొనసాగుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అధికారులను విచారించి, అరెస్టు చేసిన సిట్.. ఆ తర్వాత నాయకులపై ఫోకస్ పెట్టింది. పలువురిని సాక్షులుగా, ఇంకొందరిని నిందితులుగా విచారణ చేసింది. చివరికి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ విచారణ వరకు చేరింది. ఫోన్ ట్యాపింగ్ సర్వసాధారణమని BRS స్పష్టం చేస్తుండగా, ఇది అక్రమ చర్య అని ప్రభుత్వం పేర్కొంటోంది.

News February 1, 2026

ఈ నియమాలు తెలియకుండానే నదిలో నాణేలు వేస్తున్నారా!

image

నదిలో నాణేలు వేయడానికి ఆది/మంగళ వారాలు ప్రశస్తమైనవని పండితులు చెబుతున్నారు. ‘స్నానాంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి, తూర్పు ముఖంగా ఉంటూ, కులదైవాన్ని ప్రార్థిస్తూ ఈ పరిహారం పాటించాలి. రాగి నాణేన్ని ప్రవహించే నీటిలోనే వేయాలి. అది నీటి ప్రవాహంతో పాటు ముందుకు సాగిపోతే జాతక దోషాలు తొలగి అధిక పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. పూర్వం నీటి శుద్ధి కోసం రాగిని వాడే ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది’ అంటున్నారు.

News February 1, 2026

గ్లోబల్ గ్రోత్‌లో ఇండియా ‘పవర్’… మస్క్ ఫిదా!

image

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. లేటెస్ట్ IMF డేటా ప్రకారం ప్రపంచ వృద్ధిలో ఇండియా 17% వాటాతో అమెరికా (9.9%) కంటే చాలా ముందుంది. చైనా, భారత్ కలిపి గ్లోబల్ గ్రోత్‌లో దాదాపు 43.6% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ గణాంకాలను షేర్ చేస్తూ, ప్రపంచ ఆర్థిక శక్తి ఇప్పుడు తూర్పు దేశాల వైపు మళ్లుతోందని ‘Balance of power is changing’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.

News February 1, 2026

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం: కిషన్ రెడ్డి

image

TG: కేంద్ర బడ్జెట్‌లో ఎరువులకు రాయితీ పెరిగిందని, దీనివల్ల రాష్ట్ర రైతులు లబ్ధి పొందుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ‘కాకతీయ టెక్స్‌టైల్స్ పార్క్‌కు మేలు చేసే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. మెట్రో విస్తరణపై DPR ఇస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుంది. రాష్ట్రానికి 33 బాలికల హాస్టళ్లు, 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహంతో TGకి లాభం ఉంటుంది’ అని పేర్కొన్నారు.

News February 1, 2026

నెయ్యిని నాభి వద్ద రాస్తే..

image

నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. చర్మం పొడిబారడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు నాభికి గోరు వెచ్చని నెయ్యి అప్లై చేయడం వల్ల క్రాంప్స్ వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. ఫెర్టిలిటీ సమస్యలపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు నెయ్యిలో ఉన్నాయి.