News August 12, 2025

ఓటింగ్‌ను ప్రభావితం చేసే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాం: డీఐజీ

image

AP: పులివెందుల, ఒంటిమిట్టలో శాంతియుతంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు కడప డీఐజీ ప్రవీణ్ తెలిపారు. ఓటింగ్‌ను ప్రభావితం చేసే వ్యక్తులను ఉదయాన్నే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇరు చోట్ల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ ఉదయం వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News August 12, 2025

పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: అంజాద్ బాషా

image

AP: పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు అక్రమమని ఫైరయ్యారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ నేతలపై కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదని దుయ్యబట్టారు.

News August 12, 2025

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ HYDలో 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.880 తగ్గి రూ.1,01,400కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.800 పతనమై రూ.92,950 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.2 వేలు తగ్గి రూ.1,25,000కు చేరింది. కాగా రెండు రోజుల్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.1,640, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.1500 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 12, 2025

12 ఏళ్లకు రీఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్

image

హీరోయిన్ సమీరా రెడ్డి 12 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. హారర్ మూవీ ‘చిమ్నీ’తో ఆమె అభిమానులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి తన కొడుకే కారణమని తెలిపారు. ‘రేస్’ సినిమా చూసి ‘సినిమాల్లో నువ్వు ఎందుకు నటించట్లేదు’ అని తన కొడుకు అడిగిన ప్రశ్నే ఇండస్ట్రీకి తిరిగి వచ్చేలా చేసిందని పేర్కొన్నారు. ఆమె చివరగా 2013లో సినిమాల్లో నటించారు.

News August 12, 2025

కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పరారైన భర్త!

image

AP: రెండో పెళ్లికి సిద్ధమైన భర్తకు మొదటి భార్య షాకిచ్చిన ఘటన తూ.గో జిల్లాలో జరిగింది. దేవరపల్లి(M) యాదవోలుకు చెందిన పాలి సత్యనారాయణకు ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం టైంకు అతడు కనిపించకుండా పోయాడు. దీంతో వధువు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా అప్పటికే అతడికి భార్య, కుమార్తె ఉన్నారని తెలిసింది. భార్య ఫోన్ చేసి కేసు పెడతానని బెదిరించడంతోనే అతడు ఆమెతో కలిసి పరారైనట్లు వారు ఆరోపిస్తున్నారు.

News August 12, 2025

ఆసియా కప్‌.. ఈ ఇద్దరికి చోటు కష్టమే?

image

UAEలో Sept 9-28 వరకు జరగనున్న ఆసియా కప్‌కు ఈనెల 19 లేదా 20న సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించే అవకాశముంది. టాప్-5 ప్లేయర్స్‌ను మార్చకపోవచ్చని, జైస్వాల్, సాయికి చోటు కష్టమేనని సమాచారం. అక్షర్, గిల్ వైస్ కెప్టెన్‌ రేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
టీమ్ అంచనా: సూర్య(C), గిల్, అభిషేక్, సంజూ, తిలక్, దూబే, అక్షర్, సుందర్, చక్రవర్తి, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్/ప్రసిద్ధ్, హార్దిక్, జితేశ్/జురెల్

News August 12, 2025

స్థానిక ఎన్నికలు.. త్వరలో కీలక నిర్ణయం!

image

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని CM <<17330155>>రేవంత్<<>> వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై TPCC చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో నిన్న CM చర్చించారు. ఈనెల 16/17న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీపరంగా రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నేతలతో చర్చించనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో రిజర్వేషన్లు, ఎన్నికలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశముంది.

News August 12, 2025

చైనాపై టారిఫ్స్.. మళ్లీ వెనక్కి తగ్గిన ట్రంప్

image

చైనాపై టారిఫ్స్ సస్పెన్షన్‌ను ట్రంప్ మరో 90 రోజులకు పొడిగించారు. ఇరు దేశాలు పరస్పర ప్రతీకార సుంకాలను నవంబర్ 10 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. టారిఫ్స్ సస్పెన్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఇప్పుడే సంతకం చేశానని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. కాగా భారత్‌పై 50% సుంకాలు విధించిన ట్రంప్ రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ కొంటున్న చైనాపై మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది.

News August 12, 2025

ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

image

TG: వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత(67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఓ పుస్తకావిష్కరణలో యాక్టివ్‌గా కనిపించిన ఆమె అకస్మాత్తుగా మరణించడం సాహితీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక అంశాలపై ఆమె రాసిన పుస్తకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. TG తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయి. 500 కవితలు, 100 వ్యాసాలు, 30కి పైగా పాటలు రాశారు.

News August 12, 2025

అందుబాటులోకి రాని టికెట్లు.. ఏ సినిమా కోసం వెయిటింగ్?

image

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’, రజినీకాంత్ నటించిన ‘కూలీ’ రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. అయినా ఈ సినిమాలకు సంబంధించి టికెట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. టికెట్ల ధరలు పెంపు, తొలి రోజు షో టైమింగ్స్‌పై స్పష్టత రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?