News October 3, 2024

ఆ విషయంలో గాంధీ తరువాత మోదీనే: అమిత్ షా

image

గుజరాత్‌కు చెందిన ఇద్దరు పుత్రులు మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ మాత్రమే దేశ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చార‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత పౌరుల ఆరోగ్యం, ఆయుర్దాయం గురించి ఆందోళన చెందుతూ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణంపై ఎర్రకోట నుంచి మోదీ విజ్ఞ‌ప్తి చేశార‌న్నారు. గాంధీ తర్వాత పరిశుభ్రత ప్రాథమిక అవసరాన్ని వివరించిన 2వ జాతీయ నాయకుడు మోదీ అని పేర్కొన్నారు.

News October 3, 2024

పవన్‌ను చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుంది: భూమన

image

AP: వైసీపీ చీఫ్ జగన్ మీద ఇష్టం వచ్చినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ రాజకీయ ప్రేలాపనలు చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ దుయ్యబట్టారు. సనాతన ధర్మాన్ని ఆయన రక్షిస్తున్నట్లుగా పవన స్వాముల మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడటం వెనుక వేరే అజెండా ఉందన్నారు. పవన్ స్వామిని చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుందన్నారు. ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

News October 3, 2024

ప్రజా ప్రతినిధులు హుందాతనాన్ని కాపాడుకోవాలి: రాజమౌళి

image

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను దర్శకధీరుడు రాజమౌళి ఖండించారు. నిరాధారమైన ఆరోపణలను సహించేది లేదన్నారు. మరీ ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు హద్దులను గౌరవిస్తూ, హుందాతనాన్ని కాపాడుకోవాలని ట్వీట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాని వంటి స్టార్లు సురేఖ వ్యాఖ్యలను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

News October 3, 2024

అంబానీ ఇంటికి రూ.వెయ్యి కోట్ల విమానం

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దాదాపు రూ.వెయ్యికోట్లు ఖర్చు చేసి కొన్న బోయింగ్ 737 MAX 9 ఇండియాకు వచ్చింది. ఇది మన దేశంలోనే అత్యంత ఖరీదైన విమానమని తెలుస్తోంది. ఆయన దగ్గర ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. ఇటీవల ఆయన కొన్న ఈ బోయింగ్ ఫ్లైట్ విదేశాల్లో టెస్టు తర్వాత తాజాగా ఇండియాకు చేరుకుంది. ఈ విమానం 838kmph వేగంతో నాన్ స్టాప్‌గా 11,770kmలు ప్రయాణిస్తుంది.

News October 3, 2024

మాట్లాడితే మతోన్మాదులం అవుతామా?: పవన్

image

మసీదులు, చర్చిలు కట్టించిన చరిత్ర సనాతన ధర్మానిదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘మిగతా మతాలపై దాడి జరిగితే అందరూ మాట్లాడుతారు. సనాతన ధర్మంపై దాడి జరిగితే మాత్రం మాట్లాడాలంటే హిందువులకు భయం. మాట్లాడితే మతోన్మాదులమా? నాకు ఎలాంటి భయం లేదు. చేతులు కట్టుకుని కూర్చుంటామా? మనకు ధైర్యం లేకపోతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామనే YCP లాంటి స్వార్థపూరిత శక్తులు విజయ దుందుభి మోగిస్తాయి’ అని ఫైర్ అయ్యారు.

News October 3, 2024

నవంబర్ రెండో వారంలో ‘పుష్ప-2’ ట్రైలర్!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 6వ తేదీన రిలీజయ్యే ఈ చిత్ర ట్రైలర్ నవంబర్ రెండో వారంలోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని పేర్కొన్నాయి. రిలీజ్‌కు ముందు మరో ట్రైలర్ ఉండే అవకాశం ఉంది.

News October 3, 2024

ఈనెల 6 నుంచి కాలేజీలకు దసరా సెలవులు

image

TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈనెల 6 నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. హాలిడేస్ 13 వరకు కొనసాగుతాయని, కళాశాలలు తిరిగి 14న పున:ప్రారంభం అవుతాయని తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని ఆదేశించింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.

News October 3, 2024

ధర్మారెడ్డి ఎక్కడ?: పవన్

image

AP: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మాత్రమే బయటకొచ్చి మాట్లాడుతున్నారన్నారు. తన బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి వచ్చిన ధర్మారెడ్డి లడ్డూ వివాదం రాగానే మాయమయ్యారని ఆక్షేపించారు. ఆయనపై చాలా ఆరోపణలున్నాయని, అన్నింటినీ బయటకు తీస్తామని చెప్పారు. తాను బాధ్యతలు తీసుకున్నప్పుడు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రస్తుత ఈవో చెప్పారన్నారు.

News October 3, 2024

USCIRF మత స్వేచ్ఛ నివేదికను తోసిపుచ్చిన భారత్

image

భార‌త్‌లో మ‌త స్వేచ్ఛ‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం (USCIRF) ఇచ్చిన నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. దీన్ని ఏక‌ప‌క్ష, రాజ‌కీయ ప్రేరేపిత నివేదిక‌గా పేర్కొంది. ఈ నివేదిక USCIRFని మరింత అప్రతిష్ఠపాలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని దుయ్య‌బ‌ట్టింది. USలో మానవ హక్కుల సమస్యల పరిష్కారానికి USCIRF తన సమయాన్ని వినియోగించుకోవాలని స‌ల‌హా ఇచ్చింది.

News October 3, 2024

మహిళల T20WCలో బోణీ కొట్టిన బంగ్లాదేశ్

image

మహిళల T20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. స్కాట్లాండ్‌పై 16 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 రన్స్ చేసింది. 120 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 రన్స్ మాత్రమే చేయగలిగింది. రేపు రా.7.30 న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.