India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: యువత డ్రగ్స్ జోలికి వెళ్తే ఏమి సాధించలేరని సీఎం రేవంత్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ క్రీడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదువుతోనే కాకుండా క్రీడలతోనూ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. దానికి సిరాజ్, నిఖత్ జరీన్, మాలవత్ పూర్ణ నిదర్శనమన్నారు. రాష్ట్ర అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. 2028 ఒలింపిక్స్లో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించాలన్నారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖండించారు. ‘బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గపు పుకార్లను వ్యాప్తి చేయడం బాధాకరం. పొలిటికల్ మైలేజీ కోసం నా పేరును కూడా ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నా. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. నాకు ఏ రాజకీయ పార్టీ/వ్యక్తితో సంబంధం లేదు. రాజకీయాలకోసం ఇలాంటి కల్పిత కథలతో ముడిపెట్టడాన్ని ఆపేయాలి’ అని కోరారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP గడియారం గుర్తును ఉపయోగించకుండా అడ్డుకోవాలంటూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. NCP SP, NCPల గుర్తుల విషయంలో ఇప్పటికీ ప్రజల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల కోసం గడియారం గుర్తు వాడుకోకుండా అజిత్ వర్గాన్ని అడ్డుకోవాలని కోరారు. గతంలో పార్టీ చీలికతో మెజారిటీ MLAలు అజిత్ వైపు ఉండడంతో గుర్తు ఆయనకే దక్కింది.
ఆఫీసులో Work Productivity కోసం Google Experts కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఆఫీసులో టైం వేస్ట్ పనులను గుర్తించడానికి Calendar రూపొందించుకోవాలి. Launch-and-iterate విధానంతో రోజువారీ పనులను ఏ సమయంలో ఎక్కువ శ్రద్ధతో పూర్తి చేస్తున్నది గుర్తించాలి. ఇక రోజులో ఎలాంటి పనులు లేవు అని ఊహించుకొని, ఆ సమయంలో ఏయే పనుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తామన్నది నిర్ణయించుకుంటే పనిలో క్లారిటీ పెరుగుతుందంటున్నారు.
షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డానని హీరోయిన్ ప్రియాంకా మోహన్ తెలిపారు. ‘నేను క్షేమంగా ఉన్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు మెసేజ్లు, ట్వీట్స్ చేశారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.
లండన్లోని గ్రీన్విచ్లో రూ. 5 కోట్ల విలువైన ఫెరారీ దొంగతనానికి గురైంది. పోలీసులు కారును కనుగొనేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. కారులో యాపిల్ ఎయిర్పాడ్స్ను మర్చిపోయానని యజమాని చెప్పడంతో వాటిని ట్రాక్ చేసి చివరకు దొంగను పట్టుకొని అరెస్టు చేశారు. సౌత్ మెయిన్ స్ట్రీట్లోని గ్యాస్ స్టేషన్లో కారు ఉన్నట్లు ఎయిర్పాడ్స్ లొకేషన్ చూపించడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు.
AP: జగన్ నివాసంలో ఉన్న ఫర్నిచర్పై జీఏడీకి YCP మరో లేఖ రాసింది. ఫర్నీచర్ను ఎక్కడికి పంపమంటే అక్కడికి పంపిస్తామని, తీసుకెళ్లడం ఇష్టం లేకపోతే ఖరీదు చెప్తే చెల్లిస్తామని ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగు సార్లు లేఖలు రాశామని, త్వరగా సమాధానం చెప్పాలన్నారు. కాగా ప్రభుత్వ నిధులతో తన ఇంట్లోనే జగన్ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నారని కూటమి ప్రభుత్వం విమర్శించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ను విస్తరిస్తున్న BSNL ప్రారంభమై 24 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రూ.500 కంటే ఎక్కువ విలువైన వోచర్తో రీఛార్జ్ చేసుకున్నవారికి అదనంగా 24GB ఉచిత డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 24లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 2000 అక్టోబర్ 1న ఢిల్లీ, ముంబై మినహా దేశీయంగా BSNL టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయన Xలో ట్వీట్ చేశారు. దేశభక్తి గల ప్రజలు కాంగ్రెస్ విభజన, ప్రతికూల రాజకీయాలను ఎన్నటికీ అంగీకరించబోరని అన్నారు. ప్రజల మద్దతు, ఉత్సాహాన్ని చూస్తుంటే హరియాణా ప్రజలు తిరిగి బీజేపీకి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.
మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు ఆయన బెయిల్ కోరారు. అయితే, జానీ మాస్టర్కు వచ్చిన అవార్డును రద్దు చేయాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే జానీ మాస్టర్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చేవరకు హోల్డ్లో పెట్టాలని మరికొందరు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.