News October 3, 2024

Work Productivity కోసం ఇలా చేసి చూడండి!

image

ఆఫీసులో Work Productivity కోసం Google Experts కొన్ని స‌ల‌హాలు ఇస్తున్నారు. ఆఫీసులో టైం వేస్ట్ పనులను గుర్తించడానికి Calendar రూపొందించుకోవాలి. Launch-and-iterate విధానంతో రోజువారీ ప‌నుల‌ను ఏ స‌మ‌యంలో ఎక్కువ‌ శ్ర‌ద్ధ‌తో పూర్తి చేస్తున్నది గుర్తించాలి. ఇక రోజులో ఎలాంటి ప‌నులు లేవు అని ఊహించుకొని, ఆ సమయంలో ఏయే పనుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తామన్నది నిర్ణ‌యించుకుంటే పనిలో క్లారిటీ పెరుగుతుందంటున్నారు.

News October 3, 2024

స్వల్ప గాయాలతో బయటపడ్డా: హీరోయిన్

image

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డానని హీరోయిన్ ప్రియాంకా మోహన్ తెలిపారు. ‘నేను క్షేమంగా ఉన్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు మెసేజ్‌లు, ట్వీట్స్ చేశారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.

News October 3, 2024

దొంగిలించిన ఫెరారీ కారును ఎయిర్‌పాడ్స్ కనిపెట్టాయి

image

లండన్‌లోని గ్రీన్‌విచ్‌‌లో రూ. 5 కోట్ల విలువైన ఫెరారీ దొంగతనానికి గురైంది. పోలీసులు కారును కనుగొనేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. కారులో యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ను మర్చిపోయానని యజమాని చెప్పడంతో వాటిని ట్రాక్ చేసి చివరకు దొంగను పట్టుకొని అరెస్టు చేశారు. సౌత్ మెయిన్ స్ట్రీట్‌లోని గ్యాస్ స్టేషన్‌లో కారు ఉన్నట్లు ఎయిర్‌పాడ్స్ లొకేషన్ చూపించడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు.

News October 3, 2024

ఫర్నీచర్‌ను తీసుకెళ్లండి: ప్రభుత్వానికి YCP లేఖ

image

AP: జగన్ నివాసంలో ఉన్న ఫర్నిచర్‌పై జీఏడీకి YCP మరో లేఖ రాసింది. ఫర్నీచర్‌ను ఎక్కడికి పంపమంటే అక్కడికి పంపిస్తామని, తీసుకెళ్లడం ఇష్టం లేకపోతే ఖరీదు చెప్తే చెల్లిస్తామని ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగు సార్లు లేఖలు రాశామని, త్వరగా సమాధానం చెప్పాలన్నారు. కాగా ప్రభుత్వ నిధులతో తన ఇంట్లోనే జగన్ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నారని కూటమి ప్రభుత్వం విమర్శించిన సంగతి తెలిసిందే.

News October 3, 2024

రూ.500పైన రీఛార్జ్‌తో 24GB ఉచిత డేటా

image

దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న BSNL ప్రారంభమై 24 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రూ.500 కంటే ఎక్కువ విలువైన వోచర్‌తో రీఛార్జ్ చేసుకున్నవారికి అదనంగా 24GB ఉచిత డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 24లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 2000 అక్టోబర్ 1న ఢిల్లీ, ముంబై మినహా దేశీయంగా BSNL టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి.

News October 3, 2024

హరియాణాలో బీజేపీదే గెలుపు: మోదీ

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్య‌క్తం చేశారు. గురువారం ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌డంతో ఆయ‌న Xలో ట్వీట్ చేశారు. దేశభక్తి గల ప్రజలు కాంగ్రెస్ విభజన, ప్రతికూల రాజకీయాలను ఎన్నటికీ అంగీకరించబోరని అన్నారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు, ఉత్సాహాన్ని చూస్తుంటే హ‌రియాణా ప్ర‌జ‌లు తిరిగి బీజేపీకి ప‌ట్టంక‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న న‌మ్మ‌కం క‌లుగుతోందని పేర్కొన్నారు.

News October 3, 2024

జానీ మాస్టర్ అవార్డును రద్దు చేయాలని డిమాండ్

image

మహిళా కొరియోగ్రాఫర్‌‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు ఆయన బెయిల్ కోరారు. అయితే, జానీ మాస్టర్‌కు వచ్చిన అవార్డును రద్దు చేయాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే జానీ మాస్టర్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చేవరకు హోల్డ్‌లో పెట్టాలని మరికొందరు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News October 3, 2024

నా వెన్నెముకకు సర్జరీ, కాలికి పక్షవాతం: అరవింద్ స్వామి

image

తాను 13 ఏళ్లు పాటు సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో నటుడు అరవింద్ స్వామి వెల్లడించారు. ‘నా వెన్నెముకకు సర్జరీ జరగడంతో రెండేళ్ల పాటు తీవ్ర ఇబ్బంది పడ్డా. ఎంతో నొప్పిని అనుభవించా. ఆ సమయంలో నా కాలుకి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. కడలి సినిమాతో మణిరత్నం నాకు అవకాశం ఇచ్చారు. జీవితంలో ముందుకు వెళ్లడానికి ఆ సినిమా ఊతమిచ్చింది. ఆ తర్వాత 2 మారథాన్‌లలోనూ పాల్గొన్నా’ అని తెలిపారు.

News October 3, 2024

BREAKING: ఓటర్ల తుది జాబితా విడుదల

image

TG: పంచాయతీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 12,867 పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 82,04,518 మంది పురుషులు, 85,28,573 మంది మహిళలు, 493 మంది ఇతర ఓటర్లున్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది, అత్యల్పంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది ఓటర్లున్నారు.

News October 3, 2024

పడవ ప్రమాదం.. 60కి చేరిన మృతులు

image

నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. దాదాపు 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ నైజీర్‌ నదిలో మునిగిపోయింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 160 మందిని రక్షించారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. పడవ పాతదని, ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కాగా నైజర్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోందని, మృతులు పెరిగే అవకాశం ఉందన్నారు.