News July 17, 2024

సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో ప్రమాదం.. ఇద్దరు మృతి

image

TG: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్‌2లో మట్టిపెళ్లలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పైప్‌లైన్ లీకేజీని ఆపేందుకు వెళ్లిన నలుగురిపై మట్టి పెళ్లలు కూలాయి. ఆ మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మృతులను ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్‌గా గుర్తించారు.

News July 17, 2024

పంచాయతీలకు TDP రంగులు.. YCP విమర్శలు

image

AP: గ్రామ పంచాయతీ భవనాలకు TDP రంగులు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇరుకుపాలెం పంచాయతీ ఆఫీసుకి పసుపు రంగు వేసిన ఫొటోని వైసీపీ శ్రేణులు నెట్టింట షేర్ చేస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కార్యాలయాలకు, పాస్ పుస్తకాలకు YCP రంగులు వేశారంటూ దుమ్మెత్తిపోసిన TDP.. ఇప్పుడు తామే ఇలా చేయడమేంటని పలువురు పెదవి విరుస్తున్నారు.

News July 17, 2024

అతి భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

AP: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు SKLM, VZM, మన్యం, VSP, అనకాపల్లి, KKD, కోనసీమ, తూ.గో, ప.గో, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 నంబర్లకు ఫోన్ చేయాలంది.

News July 17, 2024

అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనున్న బైడెన్?

image

అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోనున్నారా? సొంత పార్టీ నేతలే డిమాండ్ చేసినా ససేమిరా అన్న ఆయన, ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన ‘కమలా హారిస్ గొప్ప వైస్ ప్రెసిడెంటే కాదు, మున్ముందు అమెరికా ప్రెసిడెంట్ కూడా కావొచ్చు’ అని అన్నారు. దీంతో బైడెన్ ఇక వైదొలగుతారన్న ప్రచారం మొదలైంది. అయితే, అధికారికంగా ఆయన్నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

News July 17, 2024

ఏపీకి రూ.1000 కోట్లు ఇవ్వాలి: మంత్రి సత్యకుమార్

image

AP: నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.1000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రుల్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య మందిర్ భవనాల నిర్మాణానికి నిధులివ్వాలని కోరినట్లు చెప్పారు. 40 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రులు తమను ఆరా తీసినట్లు పేర్కొన్నారు.

News July 17, 2024

శ్రీలంకతో వన్డే సిరీస్‌‌‌లోకి రోహిత్ శర్మ?

image

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా వెకేషన్‌‌కు వెళ్లిన రోహిత్.. ఈ సిరీస్‌ కోసం తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జట్టు కూర్పుపై సెలక్షన్ కమిటీకి హెడ్ కోచ్ గంభీర్ క్లారిటీ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఒకవేళ రోహిత్ టీమ్‌లోకి వస్తే ఆయనే కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. లేదంటే కేఎల్ రాహుల్‌‌కు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది.

News July 17, 2024

కుట్ర కోణం ఉందా? చంద్రబాబు ఆదేశాలతో అధికారుల ఆరా

image

AP: GPS జీవో, గెజిట్ విడుదలలో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్లు CMO అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జీవో జారీ చేయడం, నెల తర్వాత గెజిట్ అప్‌లోడ్ చేయడంలో కుట్ర కోణం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులుగా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. GO విడుదలపై <<13635657>>విచారించాలన్న <<>>చంద్రబాబు ఆదేశాలతో CMO రంగంలోకి దిగింది.

News July 17, 2024

AP మీకు స్వాగతం పలుకుతోంది: కంపెనీలకు లోకేశ్ రిక్వెస్ట్

image

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో అక్కడి కంపెనీలను ఆకర్షించేందుకు ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ సిద్ధమయ్యారు. NASSCOM చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ వారిని ఏపీకి ఆహ్వానించారు. ‘వైజాగ్‌లోని మా IT, AI & డేటా సెంటర్ క్లస్టర్‌కి మీ కంపెనీలను మార్చుకునేందుకు స్వాగతిస్తున్నాం. మీకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. మీకు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News July 17, 2024

ఆందోళన చెందొద్దు.. క్షేమంగానే ఉన్నా: నారాయణమూర్తి

image

తన ఆరోగ్యం నిలకడగా ఉందని నటుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. ఆయన <<13647927>>అస్వస్థత<<>>కు గురయ్యారనే వార్తలతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ నారాయణమూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దేవుడి దయతో కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు.

News July 17, 2024

ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇది: అమర్నాథ్

image

AP: విశాఖలోని ఎర్రమట్టి దిబ్బల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ Xలో ఆరోపించారు. ‘ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నేతల మద్దతుతో తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పకనే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 35రోజుల్లో ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇది’ అంటూ సెల్ఫీ ఫొటోను పోస్ట్ చేశారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే దీనిపై <<13647350>>విచారణ<<>>కు ఆదేశించింది.