India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పేపర్ లీకేజీ ఆరోపణల నడుమ నీట్-యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీని వెల్లడించనున్నారు. వాస్తవానికి ఇవాళ్టి నుంచే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. మే 5న పరీక్ష నిర్వహించగా, జూన్ 4న ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.

వీరజవాన్ <<13574469>>అన్షుమన్<<>> సింగ్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. పంజాబ్ రెజిమెంట్ 26వ బెటాలియన్కు చెందిన ఆర్మీ మెడికల్ కార్ప్స్లో అన్షుమన్ సింగ్ కెప్టెన్గా పనిచేశారు. గతేడాది FEB 10న సృష్టి సింగ్తో ఆయన వివాహం జరగ్గా 4 నెలల తర్వాత సియాచిన్కు వెళ్లి 15 రోజుల్లోనే చనిపోయారు. 2023 JULY 19న ఆర్మీ బంకర్లలో మంటలు ఏర్పడటంతో నలుగురిని కాపాడి మెడికల్ బాక్సులు తీసుకొచ్చేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.

TG: రాష్ట్రంలో జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. వెనువెంటనే ఎగ్జామ్స్ నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, రెండు రోజుల గ్యాప్తో ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలకు షెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందే.

ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసూద్ పెజెష్కియన్ గెలుపొందారు. ఇస్లామిస్ట్ వాది అయిన సయీద్ జలీలిపై గెలుపొందడంతో మసూద్ పాలన ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పోలింగ్లో పెజెష్కియన్కు 1.63 కోట్ల ఓట్లు రాగా సయీద్కు 1.35 కోట్ల ఓట్లు వచ్చాయి. మూడు కోట్ల మంది పోలింగ్లో పాల్గొన్నట్టు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా మసూద్ ఎన్నికతో ఇరాన్లో సంస్కరణలు జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.67,650కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరగడంతో రూ.73,800 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,600 పెరిగి రూ.99,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

AP: గ్రామాల్లో కలుషిత నీటితో అతిసార కేసులు పెరుగుతున్నాయని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ తెలిపారు. ‘పరీక్షలు నిర్వహిస్తే 240 చోట్ల కలుషిత నీరు కారణమని తేలింది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తాం. వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను సాధిస్తాం’ అని వెల్లడించారు. విజయవాడ యనమలకుదురులో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 7% వృద్ధితో పరుగులు పెట్టినా నిరుద్యోగాన్ని అధిగమించడం కష్టమేనని సిటీ బ్యాంక్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. నిరుద్యోగ భారం తగ్గాలంటే ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నారు. కానీ ప్రస్తుత వృద్ధి ప్రకారం ఏటా 80లక్షల నుంచి 90లక్షల ఉద్యోగాలు మాత్రమే భారత్ సృష్టించగలదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, తయారీ రంగంలో ఎగుమతుల వృద్ధిపై ఫోకస్ మొదలైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

AP: బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ మాధవీలతపై గుడివాడలో కేసు నమోదైంది. గోదాము లీజు వ్యవహారంలో వాసుదేవరెడ్డి తన పేరెంట్స్ను దుర్భాషలాడారని, మనస్తాపంతో తన తల్లి చనిపోయారని దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇందులో మాధవీలత, కొడాలి నాని ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్డీఏలో కీలకంగా మారిన CM చంద్రబాబు కేంద్రం ముందు పలు డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. అమరావతి నిర్మాణం, ఇతర కీలక ప్రాజెక్టులు, పథకాల అమలు కోసం ₹లక్ష కోట్లకుపైగా నిధులను కోరినట్లు ఎకనామిక్ టైమ్స్, బ్లూమ్బర్గ్ వెల్లడించాయి. కేంద్ర బడ్జెట్లో ఈ కేటాయింపులు చేయాలని PMపై ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నాయి. ముఖ్యంగా రాజధానికి ₹50వేల కోట్లు, పోలవరానికి ₹12వేల కోట్లు, ఆర్థిక లోటు భర్తీకి ₹7వేల కోట్లు కోరారట.

జమ్మూ కశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఓ వార్త భక్తులను నిరాశకు గురిచేస్తోంది. అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం కరిగిపోతున్నట్లు సమాచారం. దీంతో బల్తాత్, పహల్గం మార్గాల్లో భక్తులు దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజులుగా అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 52 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్ర AUG 19తో ముగియనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 1.52 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
Sorry, no posts matched your criteria.