India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ ‘వాంటేజ్’ పేరుతో కొత్త మోడల్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. దీని ధరను రూ.3.99 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ మోడల్ టాప్ స్పీడ్ గంటకు 325కి.మీ కాగా.. 0-96కి.మీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలోనే ఈ కారు అందుకుంటుందని సంస్థ వెల్లడించింది. ఇందులో వెట్, స్పోర్ట్, స్పోర్ట్స్ ప్లస్, ట్రాక్, ఇండివిడ్యువల్ డ్రైవ్ మోడ్లు ఉన్నాయి.

TG: ఒకప్పుడు సీపీఐకి, ఇప్పుడు కాంగ్రెస్కు కంచుకోట లాంటి లోక్సభ నియోజకవర్గం నల్గొండ. BRS, BJP ఒక్కసారీ గెలవని సెగ్మెంట్ కూడా ఇదే. ఈసారి రఘువీర్ రెడ్డి(INC), కంచర్ల కృష్ణారెడ్డి(BRS), శానంపూడి సైదిరెడ్డి(BJP) పోటీ చేస్తున్నారు. పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని BJP, BRS ఆరాటపడుతున్నాయి. ఇక్కడ INC, CPI చెరో 7సార్లు, TDP 2సార్లు, తెలంగాణ ప్రజా సమితి, PDF చెరోసారి గెలిచాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ హను రాఘవపూడి- హీరో ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్గా ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై చిత్ర వర్గాలు స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్తో దేవరలో, రామ్చరణ్తో ఓ సినిమాలో జాన్వీ నటిస్తోన్న విషయం తెలిసిందే.

AP: ఈ నెల 25న APRJC, డీసీసెట్-2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. APRJCకి 32,666 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అలాగే డీసీ సెట్కు 56,949 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి రేపు మ.2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు కనీసం గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు మొదలుకానున్నాయి. జూన్ 12న స్కూళ్లు పునః ప్రారంభం అవుతాయి. సెలవుల్లో ప్రైవేటు స్కూళ్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. కాగా సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ విద్యాశాఖ <<13091267>>‘సెలవుల్లో సరదాగా’<<>> కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

దళిత యువకులకు శిరోముండనం చేసిన కేసులో బాధితులను ప్రతివాదులుగా చేర్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విశాఖ SC, ST కోర్టు YCP MLC తోట త్రిమూర్తులు, మరో 8మందికి 18 నెలల జైలు శిక్ష విధించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. కాగా బాధితులు తమ వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో వారిని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించిన న్యాయమూర్తి మే 1కి విచారణను వాయిదా వేశారు.

ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. 8 మ్యాచ్లలో 4 గెలుపులతో GT ఆరో స్థానంలో, 3 విజయాలతో DC ఎనిమిదో ప్లేస్లో ఉన్నాయి. నేడు గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ఇరు జట్ల కెప్టెన్లు గిల్, పంత్ భావిస్తున్నారు. IPLలో ఇప్పటి వరకు ఈ టీమ్లు 4 సార్లు తలపడగా, చెరో రెండు సార్లు గెలిచాయి.

AP: సీఎం జగన్ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నేడు ముగియనుంది. టెక్కలిలోని అక్కవరం ప్రాంతంలో ‘మేమంతా సిద్ధం’ ముగింపు సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. కాగా గత నెల 27న కడప జిల్లా ప్రొద్దుటూరులో యాత్ర మొదలైంది. ఇటు పులివెందులలో ఈ నెల 25న జగన్ నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

AP: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అవకతవకల ఘటనలో సస్పెన్షన్కు గురై, మళ్లీ విధుల్లో చేరిన IAS గిరీశాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విద్యాశాఖ కమిషనర్ సురేశ్ను విచారణ అధికారిగా నియమించింది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీశా లాగిన్ ఐడీతో 35వేల ఓటర్ ఐడీ కార్డులు డౌన్లోడ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో EC ఆయన్ను జనవరిలో సస్పెండ్ చేసింది.

జనరల్ క్లాస్ ప్రయాణికులకు సరసమైన ధరకే ఆహారం అందించే కార్యక్రమానికి రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. అన్రిజర్వ్డ్, జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ అందుబాటు ధరల్లో పొందగలరని రైల్వేశాఖ తెలిపింది. ఎకానమీ మీల్ ధర రూ.20, స్నాక్ మీల్ ధర రూ.50 కాగా.. ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
Sorry, no posts matched your criteria.