India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లండన్లోని గ్రీన్విచ్లో రూ. 5 కోట్ల విలువైన ఫెరారీ దొంగతనానికి గురైంది. పోలీసులు కారును కనుగొనేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. కారులో యాపిల్ ఎయిర్పాడ్స్ను మర్చిపోయానని యజమాని చెప్పడంతో వాటిని ట్రాక్ చేసి చివరకు దొంగను పట్టుకొని అరెస్టు చేశారు. సౌత్ మెయిన్ స్ట్రీట్లోని గ్యాస్ స్టేషన్లో కారు ఉన్నట్లు ఎయిర్పాడ్స్ లొకేషన్ చూపించడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు.
AP: జగన్ నివాసంలో ఉన్న ఫర్నిచర్పై జీఏడీకి YCP మరో లేఖ రాసింది. ఫర్నీచర్ను ఎక్కడికి పంపమంటే అక్కడికి పంపిస్తామని, తీసుకెళ్లడం ఇష్టం లేకపోతే ఖరీదు చెప్తే చెల్లిస్తామని ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగు సార్లు లేఖలు రాశామని, త్వరగా సమాధానం చెప్పాలన్నారు. కాగా ప్రభుత్వ నిధులతో తన ఇంట్లోనే జగన్ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నారని కూటమి ప్రభుత్వం విమర్శించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ను విస్తరిస్తున్న BSNL ప్రారంభమై 24 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రూ.500 కంటే ఎక్కువ విలువైన వోచర్తో రీఛార్జ్ చేసుకున్నవారికి అదనంగా 24GB ఉచిత డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 24లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 2000 అక్టోబర్ 1న ఢిల్లీ, ముంబై మినహా దేశీయంగా BSNL టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయన Xలో ట్వీట్ చేశారు. దేశభక్తి గల ప్రజలు కాంగ్రెస్ విభజన, ప్రతికూల రాజకీయాలను ఎన్నటికీ అంగీకరించబోరని అన్నారు. ప్రజల మద్దతు, ఉత్సాహాన్ని చూస్తుంటే హరియాణా ప్రజలు తిరిగి బీజేపీకి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.
మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు ఆయన బెయిల్ కోరారు. అయితే, జానీ మాస్టర్కు వచ్చిన అవార్డును రద్దు చేయాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే జానీ మాస్టర్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చేవరకు హోల్డ్లో పెట్టాలని మరికొందరు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
తాను 13 ఏళ్లు పాటు సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో నటుడు అరవింద్ స్వామి వెల్లడించారు. ‘నా వెన్నెముకకు సర్జరీ జరగడంతో రెండేళ్ల పాటు తీవ్ర ఇబ్బంది పడ్డా. ఎంతో నొప్పిని అనుభవించా. ఆ సమయంలో నా కాలుకి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. కడలి సినిమాతో మణిరత్నం నాకు అవకాశం ఇచ్చారు. జీవితంలో ముందుకు వెళ్లడానికి ఆ సినిమా ఊతమిచ్చింది. ఆ తర్వాత 2 మారథాన్లలోనూ పాల్గొన్నా’ అని తెలిపారు.
TG: పంచాయతీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 12,867 పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 82,04,518 మంది పురుషులు, 85,28,573 మంది మహిళలు, 493 మంది ఇతర ఓటర్లున్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది, అత్యల్పంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది ఓటర్లున్నారు.
నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. దాదాపు 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ నైజీర్ నదిలో మునిగిపోయింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 160 మందిని రక్షించారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. పడవ పాతదని, ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కాగా నైజర్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోందని, మృతులు పెరిగే అవకాశం ఉందన్నారు.
Gemini Live AI టూల్తో మరికొన్ని రోజుల్లో తెలుగులో కూడా సంభాషించవచ్చు. దేశంలో వాయిస్ అసిస్టెంట్ ఏఐ టూల్ వాడకం పెరుగుతుండడంతో Google దీన్ని మరిన్ని ప్రాంతీయ భాషలకు విస్తరించింది. ప్రస్తుతం ఇంగ్లిష్తోపాటు హిందీని కూడా ప్రవేశపెట్టింది. అలాగే మరికొన్ని రోజుల్లో తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో తీసుకురానుంది. ఈ ఏడాదితో దేశంలో Google 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.
నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.