India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్లో పాల్గొని, తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు తెలియజేయాలని కోరాయి.

AP: అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చంటూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కోరింది. ఈ మేరకు సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు వినతిపత్రం అందజేశారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు భూమి లేని వారికే భూపంపిణీ చేయాలన్నారు.

AP: నూతన ఇసుక పాలసీపై అధికారులతో CM చంద్రబాబు కూలంకషంగా చర్చించారు. వర్షాకాలం కావడంతో నదుల్లో వరదొస్తే తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. కాగా ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే ఆన్లైన్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందిస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నట్లు సమాచారం.

AP: కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరకు పట్టుకున్న 15,396 టన్నుల(రూ.43.43 కోట్ల) రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనం. కాగా కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ మాఫియా అవినీతికి పాల్పడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీటిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

TG: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి <<13542740>>కమిషన్ <<>>గడువుని జులై 31 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంధనశాఖతో పాటు ట్రాన్స్ కో, జెన్ కో ముఖ్యకార్యదర్శిగా రొనాల్డ్ రాస్ ఇటీవల నియమితులయ్యారు. ఆయన శాఖపై అధ్యయనం చేస్తున్న క్రమంలోనే కమిషన్ గడువు(జూన్ 30) ముగిసింది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో గడువును మరో నెల రోజులు పెంచినట్లు సమాచారం.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలకడంతో నూతన సారథి అవసరం ఏర్పడింది. ప్రస్తుతం భారత్కు కెప్టెన్గా ఎవరుంటారనే చర్చ నడుస్తోంది. కాగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ నుంచి నలుగురు టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్నారు. హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం రేపు జరగనుంది. వెంకీ మామ, డైరెక్టర్ అనిల్ కలిసి ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

AP: సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినకు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు CM చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ అవుతారు.

AP: సాయిబాబా పాఠశాలల ఛైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదైంది. కడప జిల్లా అక్కాయపల్లిలోని సాయిబాబా పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి మీద పడటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యజమాన్యం నిర్లక్ష్యం వల్లే పైకప్పు కూలిందని పోలీసులు ఎమ్మెల్సీపై కేసు నమోదు చేశారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశంలో వెల్లడించారు. వారానికో జిల్లా పర్యటన ఉండేలా షెడ్యూల్ని త్వరలో విడుదల చేస్తామన్నారు. పథకాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని చెప్పారు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులంతా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లేలా చూడాలని సీఎస్ను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.