News April 25, 2024

రికార్డ్ సృష్టించిన IPL-2024

image

క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న IPL సగం సీజన్ పూర్తయింది. మొత్తం 74 మ్యాచుల్లో నిన్న CSK, LSG మధ్య గేమ్‌తో 37 మ్యాచులయ్యాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పటికే 8.99 రన్‌రేట్‌తో IPLలో మోస్ట్ హైస్కోరింగ్ సీజన్‌గా ఇది రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 7 సెంచరీలు, 668 సిక్సర్లు నమోదయ్యాయి. టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోర్ (SRH-287) రికార్డు కూడా బద్దలైంది.

News April 25, 2024

మిర్యాలగూడకు బయల్దేరిన కేసీఆర్

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మాజీ సీఎం కేసీఆర్ తెరలేపారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి బస్సులో మిర్యాలగూడకు బయల్దేరారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడ నుంచి సూర్యపేటకు బస్సుయాత్రను ప్రారంభిస్తారు.

News April 25, 2024

సమ్మర్‌లో ఎలక్షన్స్ ఏంటని విమర్శ.. జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

image

వడగాలులు వీచే సమయంలో భారత్ ఎన్నికలు నిర్వహించడం ఏంటని ఓ వెస్ట్రన్ మీడియా ప్రచురించిన కథనానికి విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా జవాబు ఇచ్చారు. ‘వెస్ట్ మీడియా నుంచి తరచూ ఇలాంటి విమర్శలు వస్తాయి. అవగాహన లేక కాదు, మన ఎన్నికల్లో వాళ్లు రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తారని భావించి విమర్శిస్తుంటారు. మా దగ్గర కనిష్ఠ పోలింగ్ శాతం మీ ఆల్ టైమ్ హై కంటే ఎక్కువ. రాజకీయంలో భాగంగానే ఈ విమర్శలు’ అని మండిపడ్డారు.

News April 25, 2024

భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య

image

యూపీలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన యోగేశ్(36), మణికర్ణిక(28)కు ఆర్నెల్ల క్రితం వివాహమైంది. అన్యోన్యంగా జీవిస్తున్న వారి దాంపత్యంపై విధి పగబట్టింది. మణికర్ణిక ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ప్రాణంగా చూసుకుంటున్న భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన యోగేశ్, తాను కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ‘కలిసి బతికాం, కలిసే చనిపోతాం’ అంటూ ఆయన రాసిన సూసైడ్ లెటర్ స్థానికంగా విషాదాన్ని నింపింది.

News April 25, 2024

ఎన్నికల వేళ మణిపుర్‌లో పేలుళ్లు.. బ్రిడ్జి ధ్వంసం

image

మణిపుర్‌లో మరో రెండు రోజుల్లో రెండో దశ ఎన్నికలు జరగనుండగా మరోసారి హింస చెలరేగింది. కంగ్‌పోక్పి జిల్లా సపోర్‌మెయినా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పేలుళ్లకు పాల్పడి బ్రిడ్జిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. అయితే ఈ బ్రిడ్జి నాగాలాండ్‌కు కనెక్ట్ అయ్యే రహదారిలో భాగం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈనెల 26న రెండో విడత పోలింగ్ జరగనుంది.

News April 25, 2024

OTTలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ

image

మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. మే 3 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఓ గుహలో చిక్కుకున్న ఫ్రెండ్‌ను కాపాడేందుకు తోటి మిత్రులు చేసే పోరాటం నేపథ్యంలో డైరెక్టర్ చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు.

News April 25, 2024

వైసీపీ పాలనలో మహిళలు నష్టపోయారు: ఎంపీ

image

AP: దేశంలో మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీనే అని TDP ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మహిళలకు మళ్లీ రక్షణ రావాలంటే కూటమి అధికారంలోకి రావాలని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా TDP ఎన్నో మంచి పనులు చేసిందని.. డ్వాక్రా సంఘాలను విస్తృతపరిచింది చంద్రబాబేనని గుర్తు చేశారు. YCP పాలనలో మహిళలు నష్టపోయారని విమర్శించారు. త్వరలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పారు.

News April 25, 2024

గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి

image

TG: భద్రాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరిరావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. చల్ల మండలం పూసుగుప్ప 81వ బెటాలియన్‌లో ఈ ఘటన జరిగింది.

News April 25, 2024

6వేల మంది ఉద్యోగులపై టెస్లా వేటు!

image

అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాలకు చెందిన 6,020 మంది ఉద్యోగులపై టెస్లా వేటు వేయనుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందించిన నోటీసుల్లో సంస్థ ఈ మేరకు పేర్కొంది. US లేబర్ లా ప్రకారం 100కుపైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు లేఆఫ్స్‌కు ప్లాన్ చేస్తే ప్రభుత్వానికి 60రోజుల ముందు చెప్పాలి. డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 10%కుపైగా సిబ్బందిని తొలగించనున్నట్లు ఇటీవల టెస్లా ప్రకటించింది.

News April 25, 2024

నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఉత్కంఠ పోరు

image

నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. గతంలో వార్తల్లో సంచలనంగా నిలిచిన ఢిల్లీ JNUSU మాజీ ప్రెసిడెంట్‌ కన్హయ్య కుమార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన 2019లో బిహార్‌లోని బెగూసరాయ్ నుంచి CPI తరఫున పోటీ చేసి ఓడారు. 2021లో కాంగ్రెస్‌లో చేరారు. ఇటు BJP నుంచి సీనియర్ నేత మనోజ్ తివారీ బరిలో నిలిచారు. దీంతో సీనియర్, జూనియర్ లీడర్ల మధ్య పోరు ఉత్కంఠగా మారింది.