India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీ క్యాపిటల్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ సీజన్-17 మొత్తానికి దూరమయ్యారు. తొడ కండరాల గాయానికి చికిత్స కోసం అతడు కొన్ని రోజుల క్రితమే ఆస్ట్రేలియాకు వెళ్లారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. మార్ష్ ఈ ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్తో ఈ నెల 3న చివరి మ్యాచ్ ఆడారు.

AP: గుంటూరు పార్లమెంట్ TDP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక MP అభ్యర్థిగా నిలుస్తున్నారు. తన కుటుంబానికి రూ.5,785.28 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ ₹5,598.65 కోట్లు కాగా స్థిరాస్తులు ₹186.63cr. ఇక అప్పులు ₹1,038 కోట్లు ఉన్నట్లు తెలిపారు. వైద్యుడైన చంద్రశేఖర్ అమెరికాలో వైద్యవృత్తితో పాటు వివిధ వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారు.

జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య రామమందిరాన్ని 1.5కోట్ల సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతి రోజు సుమారు లక్షమందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ జరిమానా విధించింది. నిన్న KKRతో మ్యాచ్లో అంపైర్లతో వాగ్వివాదంతో మ్యాచు ఫీజులో 50 శాతం కోత వేసింది. నిన్న కోహ్లీ ఔటైన తీరు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారమే ఔట్ ఇచ్చినట్లు స్టార్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు స్లో ఓవర్ రేట్ కారణంగా డుప్లెసిస్, సామ్ కరన్కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

TG: కరీంనగర్ కాంగ్రెస్ <<13102151>>ఎంపీ<<>> అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉండడంతోనే ఆయన నామినేషన్ వేసినట్లు తెలిపారు. దీనిపై సీఈసీ అధికారికంగా ప్రకటన చేస్తుందన్నారు. బీజేపీలో సఖ్యత లేదని.. తామంతా ఐక్యంగా ఉన్నామని చెప్పారు.

డాక్టర్ను సంప్రదించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఆయనకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు సంబంధించి ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఇన్సులిన్ ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు.

ఎన్నికల్లో ఈవీఎంలు 2004 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వీటిని ECIL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈవీఎంలలో రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి M2, మరొకటి M3 ఈవీఎం. 2006-10 మధ్య కాలంలో తయారైన వాటిని M2గా పిలుస్తారు. వీటిని తయారు చేసేందుకు రూ.8,670 ఖర్చవుతోంది. M3 ఈవీఎంలకు మాత్రం రూ.17 వేల వరకు ఖర్చవుతోంది. <<-se>>#ELECTIONS2024<<>>

2010లో లాంఛ్ అయిన ఇన్స్టాగ్రామ్ను 2012లో మార్క్ జుకర్బర్గ్ కొనుగోలు చేశారు. అలా ఎందుకు కొన్నారు? తాజాగా లీకైన ఆయన ఈమెయిల్స్లో ఆ ప్రశ్నకు జవాబు ఉందని సీఎన్బీసీ నివేదిక చెప్పింది. మున్ముందు ఇన్స్టా తమకు పోటీదారు అవుతుందని బర్గ్ భావించారట. మొబైల్ యాప్లలో ఇన్స్టా రాణిస్తుందని అంచనా వేసి కొన్నారట. బిలియన్ డాలర్లకు ఆయన దాన్ని కొనగా.. ఇప్పుడు ఇన్స్టా విలువ 500 బిలియన్ డాలర్లకు పైమాటే!

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు HYDలో ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. అందరి కంటే ముందే ఇంటర్ ఫలితాలను WAY2NEWS యాప్లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

రింకూ సింగ్.. కోహ్లీని వదలట్లేదు. తనకు మరో బ్యాట్ ఇవ్వండంటూ అతడి వెంట పడుతున్నారు. మొన్న ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీని కలిసిన రింకూ ‘మీరిచ్చిన బ్యాట్ విరిగింది. మరో బ్యాట్ ఇవ్వండి’ అంటూ బతిమిలాడిన వీడియో వైరలయింది. నిన్న మ్యాచ్ అనంతరం అతడు మళ్లీ కోహ్లీ వెంటే కనిపించారు. అతడితో పాటు ఆర్సీబీ డగౌట్లోనూ కూర్చున్నారు. ‘కోహ్లీ బ్యాట్ రింకూకు అచ్చొచ్చినట్లు ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.