News April 24, 2024

రూ.2లక్షల రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన

image

TG: రూ.2లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగష్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశాం. ఆరో గ్యారంటీ రుణమాఫీ చేపట్టేలోపే ఎన్నికల కోడ్ వచ్చింది’ అని నిజామాబాద్ సభలో వెల్లడించారు.

News April 24, 2024

ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా

image

ఇరాన్, పాలస్తీనాతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న తమ దేశంపై హమాస్ చేసిన ఆకస్మిక దాడికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. తమకు అప్పగించిన పనిని ఆరోజు సమర్థవంతంగా చేయలేకపోయామని, యుద్ధం వల్ల కలిగిన బాధ తనను నిరంతరం వెంటాడుతోందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 7 తన దృష్టిలో బ్లాక్ డే అని చెప్పారు.

News April 24, 2024

సెప్టెంబర్ 17లోగా షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం: రేవంత్

image

TG: మూతపడ్డ బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17లోపు తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ జన జాతర సభలో ఆయన మాట్లాడారు. మాయమాటలతో ప్రజలను కవిత, అర్వింద్ మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

News April 24, 2024

వినియోగదారులకు జొమాటో షాక్!

image

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్స్‌కు షాక్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి ప్లాట్‌ఫామ్‌ ఫీజుగా ప్రతి ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేయడం ప్రారంభించింది. దేశంలోని ప్రధాన మార్కెట్లలో ఇది మొదలైంది. మరో డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ ఫీజు పేరిట రూ.5 విధిస్తోంది. ఇక నగరాల మధ్య చేపట్టే ‘ఇంటర్‌సీటీ’ ఫుడ్ డెలివరీని ఆపేస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. న్యాయపరమైన సమస్యలే దీనికి కారణమని తెలిపింది.

News April 24, 2024

సియాచిన్‌లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

image

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధరంగంగా పేరొందిన సియాచిన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈరోజు పర్యటించారు. సైన్యం యుద్ధ సన్నద్ధతను ఆయన సమీక్షించారని, సైనికులతో ముచ్చటించారని అధికారులు తెలిపారు. రాజ్‌నాథ్ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఉన్నారు. సియాచిన్‌లో భారత సైన్యం ఉనికి మొదలై ఈ ఏడాదికి 40ఏళ్లు గడిచాయి. 1984లో ‘ఆపరేషన్ మేఘ్‌దూత్‌’తో ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది.

News April 24, 2024

సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15లోపు <<13060249>>రుణమాఫీ<<>> చేయకపోతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు రైతుబంధు పూర్తిచేయలేదు గానీ.. కొత్తగా రుణమాఫీ అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఓడిపోయేందుకు వంద కారణాలున్నాయన్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే ప్రజలు ఓడించరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే మోసం, నమ్మకద్రోహం అని దుయ్యబట్టారు.

News April 24, 2024

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్?

image

TG: కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ నామినేషన్ వేశారు. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే ఆయన నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. మంత్రి పొన్నంతో సహా పలువురు జిల్లా నేతలు ఆయనతో వెళ్లి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు KNR టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి నేడు CM రేవంత్‌తో భేటీ కానున్నారు.

News April 24, 2024

జగన్‌పై దాడి కేసు.. కోర్టులో పోలీసుల పిటిషన్

image

AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు సతీశ్ నుంచి వాంగ్మూలం తీసుకోవాలని న్యాయస్థానాన్ని పోలీసులు కోరగా.. 164 సీఆర్పీసీ ప్రకారం వాంగ్మూలం అక్కర్లేదని నిందితుడి న్యాయవాది కోర్టుకు వివరించారు. విచారించిన కోర్టు.. ఈ నెల 29లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

News April 24, 2024

హైకోర్టు తీర్పు చట్ట విరుద్ధం: సీఎం మమత

image

2016లో జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన <<13101174>>తీర్పు<<>>ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. దాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. ఈ తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి మద్దతుగా తాము ఉంటామని చెప్పారు. వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని, హైకోర్టు తీర్పుపై తాము పైకోర్టుకు వెళతామని అన్నారు.

News April 24, 2024

ముంబై ఇండియన్స్‌కు రాజస్థాన్ సవాల్!

image

IPLలో మరో ఆసక్తికరమైన మ్యాచ్ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. పాయింట్స్ టేబుల్‌లో టాపర్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను 7వ స్థానంలోని ముంబై ఇండియన్స్ ఢీకొననుంది. జైపుర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే MI 15 గెలవగా.. RR 13 మ్యాచుల్లో గెలిచింది. ఇక ఈరోజు మ్యాచ్ జరుగుతున్న జైపుర్‌లో MIతో జరిగిన 7 మ్యాచుల్లో RR 5 గెలిచింది. దీంతో ముంబైకి నేడు కఠిన పరీక్ష ఎదురుకానుంది.