India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన పేరు, జెండర్ మార్చాలంటూ IRS ఆఫీసర్ అనసూయ చేసుకున్న అప్పీల్ను కేంద్రం ఆమోదించింది. తన పేరును అనుకతిర్ సూర్యగా, తనను పురుషుడిగా గుర్తించాలని దరఖాస్తు చేసుకున్నారు. సివిల్ సర్వీసెస్ చరిత్రలో అధికారికంగా జెండర్ మార్చడం ఇదే తొలిసారి. అనుకతిర్ HYDలో సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT)లో జాయింట్ కమిషనర్గా ఉన్నారు. జెండర్ ఐడెంటిటీ వ్యక్తిగతం అని గతంలో SC చెప్పింది.

AP: శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన ‘శ్రీలంకన్ స్యూడో ఫిలేటస్ రిజియస్’ జాతి కప్ప తాజాగా శేషాచలం అడవుల్లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను జీవవైవిధ్య మండలి పరిశోధకులు వెల్లడించారు. శ్రీలంకలో నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంటుందని వారు పేర్కొన్నారు. వేల సంవత్సరాల క్రితం శ్రీలంక, భారత భూభాగాలు కలిసి ఉండేవన్న థియరీకి ఈ కప్పే ఆధారమని తెలిపారు.

TG: ఇందిరమ్మ ఇళ్ల నమూనాలపై అధ్యయనానికి తమ బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆ నివేదికలు రాగానే ఏడాదికి 4.50లక్షల చొప్పున ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. అటు రాజీవ్ స్వగృహ టవర్స్ ధరలపై కమిటీ నివేదిక అనంతరం వేలం వేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే రేషన్కు, వైద్యచికిత్సకు వేర్వేరు కార్డులు అందిస్తామని తెలిపారు.

తెలంగాణలో TDPని బలోపేతం చేస్తే తమకే లాభం అని కేటీఆర్ అన్నారు. ‘మేం APలో BRS పెట్టినప్పుడు తెలంగాణలో TDPని బలోపేతం చేస్తామని చంద్రబాబు చెప్పడంలో తప్పేముంది? TGలో టీడీపీ బలపడితే మాకే లాభం. చంద్రబాబు NDAలో కీలకంగా ఉన్నారు కాబట్టి 2 రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నాం’ అని ఢిల్లీలో చిట్చాట్లో అన్నట్లు మీడియా వర్గాల సమాచారం. కాగా తెలంగాణలో TDPని స్ట్రాంగ్ చేస్తానని CBN అనడం తెలిసిందే.

వింబుల్డన్(టెన్నిస్) మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో టాప్ సీడ్ సిన్నర్కు ఐదో సీడ్ మెద్వెదెవ్ షాకిచ్చారు. హోరాహోరీగా సాగిన మ్యాచులో 6-7, 6-4, 7-6, 2-6, 6-3 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. మరో మ్యాచులో పాల్పై మూడో సీడ్ అల్కరాజ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ సెమీస్కు దూసుకెళ్లారు. ఇవాళ జరిగే క్వార్టర్స్లో జకోవిచ్-మినార్, ముసెట్టి-ప్రిట్జ్ మధ్య పోరు జరగనుంది.

ప్రతి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రధాని మోదీ గత ఏడాది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి పంద్రాగస్టు వరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అంతరిక్ష ప్రయోగాల గురించి వివరణ, విద్యార్థులకు సెమినార్లు, పోటీల వంటివి నిర్వహించనుంది. వచ్చే నెల 23న ఢిల్లీలో ఈ వేడుకల ముగింపు కార్యక్రమం జరుగుతుంది.

AP: సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)కు ప్రభుత్వం ఓకే చెప్పింది. గత ప్రభుత్వంలో కీలకమైన సాధారణ పరిపాలన శాఖతో పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. కొత్త ప్రభుత్వం రాగానే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఏడేళ్ల సర్వీస్ ఉండగానే VRSకు దరఖాస్తు చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లలో నిబంధనలు పట్టించుకోలేదని ఆయనపై ఆరోపణలున్నాయి.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్రం.. ఈ ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 189 KM ORRకు రూ.25వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఈ సారి బడ్జెట్లో రూ.5-10వేల కోట్లు కేటాయించే అవకాశముందని సమాచారం. భూసేకరణ సహా అన్ని ఖర్చులను కేంద్రమే భరించనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లే ఈ ORRను 6 లేన్లతో ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు.

TG: డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా చూడాలని TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డిని టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. అలా అయితేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై తాము క్రియాశీలకంగానే ఉన్నామని చెప్పారు. మరోవైపు డీఎస్సీ వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

TG: రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న పలు జిల్లాల్లో వర్షం కురవగా అత్యధికంగా ఖమ్మం(D) గంగారంలో 6.2 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
Sorry, no posts matched your criteria.