News April 20, 2024

BREAKING: చరిత్ర సృష్టించిన SRH

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీ20లో చరిత్ర సృష్టించింది. పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. 6 ఓవర్లలో ఏకంగా 125 రన్స్ చేసింది. ఢిల్లీతో మ్యాచులో హైదరాబాద్ ఓపెనర్లు హెడ్(84*), అభిషేక్(40*) ఈ ఘనత సాధించారు. గతంలో ఈ రికార్డు KKR పేరిట ఉంది. 2017లో ఆ టీమ్ RCBపై 105 రన్స్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును SRH బద్దలుకొట్టింది.

News April 20, 2024

కడప ఎంపీ అభ్యర్థిగా వివేకా హత్య కేసు నిందితుడు నామినేషన్

image

AP: కడప లోక్‌సభలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసులో మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. కడప లోక్‌సభ స్థానానికి ఇండిపెండెంట్‌‌గా నామినేషన్ దాఖలు చేశారు. శివశంకర్ రెడ్డి తరఫున ఆయన అనుచరులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి జైభీమ్ పార్టీ తరఫున పులివెందుల బరిలో నిలిచారు.

News April 20, 2024

ఎన్నికల అఫిడవిట్‌‌: నేతల ఆస్తులు ఎంతంటే!

image

AP: నెల్లూరు MP అభ్యర్థి వేమిరెడ్డి, ఆయన భార్య కోవూరు TDP అభ్యర్థి ప్రశాంతిల ఆస్తులు రూ.715 కోట్లు
➥ పారిశ్రామిక వేత్త, ఒంగోలు TDP MP అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చరాస్తులు రూ.4,58,40,319, స్థిరాస్తులు రూ.1.09 కోట్లు. చేతిలో ఉన్న నగదు రూ.18529.. భార్య పేరుతో చరాస్తులు రూ.17,96,70,139, స్థిరాస్తులు రూ.30,04,44,600.
➥కావలి TDP అభ్యర్థి వెంకటకృష్ణారెడ్డి ఆస్తి రూ.153.27 కోట్లు. కారు లేదు.

News April 20, 2024

కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్

image

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ని పునరుద్ధరిస్తామన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన ఎన్నికల బాండ్లను తిరిగి తెస్తామని ఎలా అంటారని దుయ్యబట్టారు. ఇప్పటికే ‘పే పీఎం స్కామ్’ కింద రూ.4లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న BJPకి ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వరని అన్నారు.

News April 20, 2024

SRH విధ్వంసం మొదలు.. 2 ఓవర్లలోనే 40 రన్స్

image

ఢిల్లీతో మ్యాచులో SRH ఆటగాళ్ల విధ్వంసం మొదలైంది. తొలి ఓవర్‌లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ విరుచుకుపడ్డారు. తొలి బంతి వదిలేసిన అతడు.. తర్వాతి 3 బంతుల్లో 6,4,4 బాదారు. 5వ బంతికి సింగిల్ తీశారు. 6వ బంతిని అభిషేక్ శర్మ బౌండరీకి తరలించారు. దీంతో ఫస్ట్ ఓవర్‌లోనే 19 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్‌లోనూ చితకబాదిన హెడ్.. రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టారు. అభిషేక్ ఓ ఫోర్ కొట్టడంతో 2 ఓవర్లలోనే 40 రన్స్ వచ్చాయి.

News April 20, 2024

ఇకనైనా ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలి: పురందీశ్వరి

image

AP: రాజానగరంలో BJP, JSP ఉమ్మడి ప్రచార సభలో CM జగన్‌పై పురందీశ్వరి విమర్శలు గుప్పించారు. ‘ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని జగన్ అంటున్నారు. కానీ ఫ్యాన్ స్పీడ్ 1,2,3 లేదా నాలుగులోనే ఉండాలి. మనం దాన్ని 151లో పెట్టాం. దీంతో మన ఇంటి పైకప్పు లేచిపోయింది. గోడలు కూలిపోయాయి. ఇకనైనా ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలి’ అని పిలుపునిచ్చారు. జగన్‌కు అధికారం ఇస్తే తల లేని మొండెంలా APని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు.

News April 20, 2024

పవన్‌కు తగ్గని జ్వరం.. జనసేన కీలక విజ్ఞప్తి

image

AP: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి, ప్రచారంలో శ్రేణులకు జాగ్రత్తలపై జనసేన కీలక ప్రకటన చేసింది. ‘రికరెంట్ ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి పవన్ నిత్యం ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దు. షేక్‌హ్యాండ్స్, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖంపై పడకుండా చూడండి’ అని కోరింది.

News April 20, 2024

రోహిత్‌ మళ్లీ కెప్టెన్ అయ్యాడు: హర్భజన్

image

పంజాబ్‌తో మ్యాచ్‌లో రోహిత్ ముంబైకి కెప్టెన్సీ చేశారని మాజీ స్పిన్నర్ హర్భజన్ పేర్కొన్నారు. జట్టును గెలిపించేందుకు రోహిత్, హార్దిక్ కలిసి సమాలోచన చేయడం ముచ్చటగా అనిపించిందన్నారు. ‘ముంబైను చూస్తే ముచ్చటేసింది. పంజాబ్ బ్యాటింగ్ సమయంలో చివరి ఓవర్లలో రోహిత్ ఫీల్డర్లను సెట్ చేసి కెప్టెన్సీ చేశాడు. బౌలర్లతో మాట్లాడాడు. ముంబై గెలిచినప్పటికీ ఈ ఆటతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం చాలా కష్టం’ అని అభిప్రాయపడ్డారు.

News April 20, 2024

ఓటుకు నీళ్లు ఆఫర్.. డీకేపై కేసు

image

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై కేసు నమోదైంది. బెంగళూరు రూరల్‌ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన డీకే సురేశ్‌ను గెలిపిస్తే కావేరీ నది నుంచి తాగునీటిని తీసుకొచ్చి ప్రజల దాహార్తి తీరుస్తానని హామీ ఇచ్చారు. ఓటు వేస్తే నీళ్లు ఇస్తామని చెప్పడం ఓటర్లను ప్రలోభపెట్టడమే అని విమర్శలు రావడంతో ఈసీ ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదైంది.

News April 20, 2024

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

image

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ: వార్నర్, అభిషేక్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, పంత్ (C & WK), లలిత్, అక్షర్, కుల్దీప్, నోకియా, ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.
హైదరాబాద్: హెడ్, అభిషేక్, మార్క్‌రమ్, క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.