News May 23, 2024

‘సెన్సెక్స్ 30’లోకి అదానీ ఎంట్రీ.. విప్రో ఔట్!

image

BSE సెన్సెక్స్ టాప్ 30 స్టాక్స్‌లో విప్రో స్థానాన్ని అదానీ ఎంటర్‌ప్రైజెస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఎంట్రీతో మార్కెట్‌లోకి $118 మిలియన్ల (రూ.982కోట్లు) ఫండ్స్ రావొచ్చని IIFL ఆల్టర్నేటివ్ రీసెర్చ్ వెల్లడించింది. మరోవైపు విప్రో వైదొలిగితే $56 మిలియన్లు (రూ.466కోట్లు) కోల్పోవచ్చని అంచనా వేసింది. అదానీ గ్రూప్‌ నుంచి ‘సెన్సెక్స్ 30’లో చేరిన తొలి కంపెనీగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిలవనుంది.

News May 23, 2024

నిఫ్టీ రికార్డ్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 237 పాయింట్లు లాభాన్ని నమోదు చేసిన నిఫ్టీ తొలిసారిగా 22,800 మార్క్ దాటింది. మరోవైపు సెన్సెక్స్ 772 పాయింట్ల లాభంతో 74,993 వద్ద కొనసాగుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజ్, యాక్సిస్ బ్యాంక్, L&T, ఎం&ఎం, అదానీ పోర్ట్స్ షేర్లు టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. మెటల్, ఫార్మా మినహా ఇతర రంగాలు అన్నీ రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది.

News May 23, 2024

ALERT: అలాంటి స్కీమే లేదు

image

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం 50-86 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లకు ఉచితంగా ఆరోగ్య బీమాను అందిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మెసేజ్ ఫేక్ అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB FACTCHECK పేర్కొంది. ఇలాంటి స్కీమ్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అమలు చేయట్లేదని స్పష్టం చేసింది. ఇలాంటివి నమ్మి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని సూచించింది.

News May 23, 2024

BIG BREAKING: డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్

image

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేయగా, 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్‌, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపనున్నారు.

News May 23, 2024

జగన్‌పై దాడి.. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ 27కు వాయిదా

image

AP: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయగా, సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని నిందితుడి తరఫు లాయర్ న్యాయమూర్తిని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. ప్రస్తుతం సతీశ్ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న విషయం తెలిసిందే.

News May 23, 2024

కేంద్రానికి ఎక్కువ ఇచ్చి RBI భారం వేసుకుందా?

image

కేంద్రానికి ఇచ్చిన రూ.2.1లక్షల కోట్ల భారీ డివిడెండ్‌తో RBIపై భారం పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అప్పులు తగ్గించి ఈ నిధిని వాడుకుంటే ద్రవ్యలోటు తగ్గినా ఆ ప్రభావంతో ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్స్ విలువ తగ్గొచ్చట. ఒకవేళ ఈ మొత్తాన్ని కేంద్రం సబ్సిడీలకు వినియోగిస్తే ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలా ఖర్చు చేసినా ఎకానమీపై ప్రభావం పడకుండా మేనేజ్ చేయడం RBIకి సవాల్‌గా మారనుందట.

News May 23, 2024

ఒడిశాలోని రత్న భండార్‌కు తమిళనాడుతో లింకేంటి?

image

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయ రత్న భండార్ తాళం తమిళనాడుకు వెళ్లిందని మోదీ అనడం, దాన్ని CM స్టాలిన్ తీవ్రంగా ఖండించడం హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ కార్తీక్ పాండియన్ ఒడిశాలో పని చేసినప్పుడు CM నవీన్‌ పట్నాయక్‌కి సన్నిహితుడిగా ఎదిగారు. దీంతో తాను పదవిలో ఉన్నప్పుడు రత్న భండార్ తాళం తన స్వరాష్ట్రమైన తమిళనాడుకు పంపించారని.. ఆయనను ఉద్దేశిస్తూ మోదీ ఆరోపణలు చేశారు.

News May 23, 2024

జూన్ 5 తర్వాత BRS దుకాణం బంద్: కోమటిరెడ్డి

image

TG: ఎన్నికల ఫలితాల తర్వాత జూన్ 5న బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ కార్యకర్తలే నేతలను వెంటపడి కొడతారని ఎద్దేవా చేశారు. ‘పదేళ్లపాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అడ్డగోలుగా దోచుకుంది. అది చాలక కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి కూడా వెళ్లింది. ఏం అవినీతి చేయకుండానే కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారా?’ అని ఆయన ప్రశ్నించారు.

News May 23, 2024

కౌంటింగ్ రోజున ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం

image

AP: వచ్చే నెల 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 23, 2024

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే వీఐ నిధుల సమీకరణ?

image

కొత్త ప్రభుత్వం ఏర్పాటై పరిస్థితులపై క్లారిటీ వచ్చే వరకు వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని బాకీలను షేర్ల రూపంలో చెల్లించడంపై అప్పటికి స్పష్టత వస్తుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికే షేర్ల విక్రయం ద్వారా వీఐ రూ.20వేల కోట్లు సేకరించింది. లోన్ సహా పలు మార్గాల్లో మరో రూ.35వేల కోట్లు పోగుచేయాలని భావిస్తోంది.