India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మన దేశంలో పిల్లలను కని, పెంచి, డిగ్రీ వరకు చదివించేందుకు పేరెంట్స్ ఒక్కో బిడ్డపై సగటున ₹75 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ‘ఎడ్యూ ఫండ్’ నివేదిక వెల్లడించింది. ఇంజినీరింగ్ బదులు మెడిసిన్ చదివితే ₹95 లక్షలు, విదేశాలకు వెళితే ₹1.5 కోట్లకు పైగా వ్యయం అవుతోందని తెలిపింది. ఈ భారీ ఖర్చులకు భయపడి కొత్త జంటలు పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. దీంతో జనాభా పెరుగుదలలో క్షీణత ఏర్పడుతోందని చెప్పింది.

TG: రామగుండం-మణుగూరు ‘కోల్ కారిడార్’ రైల్వే <<13298191>>లైన్ను<<>> పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలను కలుపుతూ 207.80కి.మీ మేర నిర్మించనున్నారు. పెద్దపల్లి(M) రాఘవపూర్ నుంచి మణుగూరుకు లైన్ నిర్మాణానికి 1999లోనే తొలి అడుగు పడింది. 2013-14లో ప్రాథమిక పనుల కోసం కేంద్రం రూ.10కోట్లు కేటాయించినా ముందడుగు పడలేదు. ఇప్పుడు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.

TG: రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు తెలిపారు. తాము కోరుకున్న విధంగా నిర్మాతలు పర్సెంటేజీలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సెంటేజీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకు జూన్ 1 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. కల్కి, పుష్ప 2, గేమ్ ఛేంజర్, భారతీయుడు సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని చెప్పారు.

AP: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీ షా హెచ్చరించారు. రోగులకు సేవలు ఆగకుండా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. కాగా ఆరోగ్యశ్రీ సీఈఓతో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు రెండు సార్లు చర్చలు జరపగా విఫలమయ్యాయి. పెండింగ్ బిల్లులు చెల్లించడానికి నిరాకరించడంతో యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి.

TG: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) పేరుతో ఫేక్ కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. ఫోన్స్, సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయంటూ కాల్స్ చేసి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వాటిని నమ్మవద్దని, గుర్తుతెలియని నంబర్లకు స్పందించవద్దని ప్రజలకు సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు.

తమను 400 MP సీట్లతో గెలిపిస్తే జ్ఞానవాపితో పాటు కృష్ణుడి జన్మస్థానమైన మథురలోనూ దేవాలయాలు నిర్మిస్తామని BJP నేత, అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. తమ పని ఇంకా పూర్తి కాలేదని, మథురలో షాహీ ఈద్గా, జ్ఞానవాపి మందిర్ స్థానంలో జ్ఞానవాపి మసీదు ఉన్నాయన్నారు. తమను గెలిపిస్తే అవి పరిష్కారమయ్యేలా చేస్తామన్నారు. అయోధ్యలో టెంట్లో ఉన్న బాల రాముడికి తామే విముక్తి కల్పించామన్నారు.

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో 8,360 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2014(8,251 మంది), 2019(8,054 మంది) ఎన్నికల కంటే ఈ సంఖ్య ఎక్కువ. ఇందులో మహిళల వాటా 10శాతం లోపే ఉంది. చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇంత తక్కువ మొత్తంలో మహిళలు పోటీకి దిగడం గమనార్హం. ఇక జూన్ 4న వీరందరి భవితవ్యం వెల్లడి కానుంది. <<-se>>#Elections2024<<>>

AP: విజయవాడలోని సీపెట్ కేంద్రంలో డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ జేడీ శేఖర్ తెలిపారు. పదో తరగతి పాసైన వారికి మూడేళ్ల డిప్లమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, బీఎస్సీ చేసిన వారికి రెండేళ్ల పీజీ కోర్సు అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే నెల 9న విజయవాడ, అనంతపురంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అప్లై లింక్: https://cipet24.onlineregistrationform.org/CIPET/

ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలనే RCB కల మరోసారి కల్లలయ్యింది. నిన్న RR చేతిలో ఓటమితో టోర్నీ ప్లేఆఫ్స్లో అత్యధికసార్లు(16 మ్యాచ్లలో 10 సార్లు) వెనుదిరిగిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో CSK(26M.. 9 ఓటములు), DC(11M.. 9 పరాజయాలు), MI(20M.. 7 ఓటములు), SRH(12M.. 7 పరాజయాలు) ఉన్నాయి. ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ను కూడా గెలవని విషయం తెలిసిందే.

TG: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో రైతుల కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళా జరగనుంది. 16 పంటల్లో 67 రకాలకు చెందిన 12వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయి. HYD రాజేంద్రనగర్లోని వర్సిటీ ఆడిటోరియంతోపాటు జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యయసాయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో మేళాను అధికారులు నిర్వహిస్తారు.
Sorry, no posts matched your criteria.