India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎడ్టెక్ సంస్థ బైజూస్ సీఈఓ అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. 6నెలల క్రితమే ఆయన ఈ పోస్టులో చేరడం గమనార్హం. సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఆ బాధ్యతల్ని చూసుకోనున్నారని సంస్థ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. మోహన్ బయటి నుంచి సలహాదారుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. తాము చేపట్టిన ఈ పునర్నిర్మాణం ‘బైజూస్ 3.0’కి ఆరంభమని రవీంద్రన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.73,150కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.67,050గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ కేజీ రూ.500 పెరిగి రూ.89,500గా ఉంది.

మూడు రోజుల కస్టడీలో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహకరించలేదని సీబీఐ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. శరత్ చంద్ర నుంచి తీసుకున్న నగదుపై ప్రశ్నించామని.. పొంతన లేని జవాబులు చెప్పారని తెలిపింది. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగల వ్యక్తి కవిత అని ఆరోపించింది. ఆమె బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని జుడీషియల్ కస్టడీ కోరినట్లు తెలిపింది.

పాకిస్థాన్లో అమీర్ సర్ఫరాజ్ అనే మాఫియా డాన్ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. పాక్ జైల్లో ఉన్న భారతీయుడు సరబ్జిత్ను అమీర్ గతంలో హత్య చేశాడు. దీంతో అమీర్ను చంపినవారికి భారత నటుడు రణ్దీప్ హుడా ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు. ‘థాంక్యూ ‘అన్నోన్ మెన్’. అమరుడు సరబ్జీత్కు కొంత న్యాయం జరిగింది’ అని పోస్ట్ చేశారు. సరబ్జిత్ బయోపిక్లో రణ్దీప్ నటించిన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన యువతకు అలర్ట్. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. ఇవాళ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఓటరు జాబితాలో చోటు కల్పించనున్నారు. తుది ఓటర్ల జాబితాకు అనుబంధంగా ఈ జాబితాను ప్రదర్శిస్తారు. అందులో పేర్లు ఉన్న వారంతా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఓటు నమోదు చేసుకునేందుకు ఇక్కడ <

నిన్నటి మ్యాచులో CSKపై ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్ల మధ్య తేడా ఏంటని హార్దిక్ను ప్రశ్నించగా.. ‘CSKకు స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉంది. ఏం చేస్తే వర్కౌట్ అవుతోందో ధోనీకి తెలుసు. రెండు జట్ల మధ్య ఉన్న తేడా అదే’ అని అన్నారు. మరోవైపు CSK బ్యాటింగ్ సమయంలో చివరి ఓవర్ హార్దిక్ బౌలింగ్ చేయాల్సింది కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టై నేటికి నెల రోజులైంది. మార్చి 15న HYDలోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. 10 రోజుల కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించడంతో తిహార్ జైలుకు తరలించారు. ఇదే కేసులోకి రంగప్రవేశం చేసిన సీబీఐ ఆమెను ఈ నెల 12న మరోసారి అరెస్ట్ చేసింది. తాజాగా ఏప్రిల్ 23 వరకు కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది.

AP: ఇటీవల దాడి నేపథ్యంలో CM జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తారు. CM రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్కు ఒక DSP, ఇద్దరు CIలు, నలుగురు SIలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే CM రోడ్షోలు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇవాళ బీఎస్ఈ సెన్సెక్స్ భారీ నష్టాల్లో ప్రారంభమైంది. 767 పాయింట్లు కోల్పోయి 73,478 వద్ద ట్రేడ్ అవుతోంది. టీసీఎస్, ఎయిర్టెల్, నెస్లే ఇండియా మినహా మిగతా అన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ కూడా 240 పాయింట్లు నష్టపోయి 22,290 వద్ద ట్రేడ్ అవుతోంది.

కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బల్కర్పై ఆ రాష్ట్ర BJP నేత సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘BJPకి మహిళల మద్దతు పెరుగుతుండటంతో లక్ష్మికి నిద్ర పట్టడం లేదు. రాత్రి నిద్ర పట్టాలంటే ఆమె స్లీపింగ్ పిల్ కానీ, ఎక్స్ట్రా పెగ్ కానీ వేసుకోవాలి’ అని అన్నారు. దీనిపై స్పందించిన లక్ష్మి మహిళలకు BJP ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. జైశ్రీరామ్ నినాదాలు చేస్తే సరిపోదని, మహిళలను గౌరవించాలని హితవు పలికారు.
Sorry, no posts matched your criteria.