News August 10, 2025

పులివెందులలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకమే: కడప ఎస్పీ

image

AP: ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్‌కు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కడప SP అశోక్ కుమార్ తెలిపారు. ‘రెండు ప్రాంతాల్లో 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయి. ఈ 2 మండలాల్లో స్థానికేతరులు ఉండకూడదు’ అని SP ఆదేశించారు.

News August 10, 2025

OICLలో 500 ఉద్యోగాలు.. వారమే గడువు

image

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) 500 అసిస్టెంట్ (క్లాస్III) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.45,000 వరకు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు రూ.850, మిగతావారు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ నెల 17లోపు <>orientalinsurance.org.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News August 10, 2025

ముగిసిన ZPTC ఉపఎన్నికల ప్రచారం

image

AP: కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. వైసీపీ, టీడీపీ ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇరు చోట్ల 11 మంది చొప్పున బరిలో ఉన్నారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య పులివెందులలో 10,601, ఒంటిమిట్టలో 24,606గా ఉంది. ఈ నెల 12న బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగనుండగా ఫలితాలు 14న వెలువడనున్నాయి.

News August 10, 2025

ఇండియన్ నేవీలో జాబ్స్.. నోటిఫికేషన్ రిలీజ్

image

ఇండియన్ నేవీ 1266 సివిలియన్ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పదో తరగతి పాసై ITI సర్టిఫికెట్/ సంబంధిత విభాగంలో శిక్షణ పొంది 18-25 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ల వారీగా ఏజ్ సడలింపు ఉంటుంది. ఈనెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు indiannavy.gov.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.19,900-రూ.63,200 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News August 10, 2025

మా డిమాండ్ ఇదే.. మద్దతు తెలపండి: రాహుల్

image

ఓట్ చోరీ జరిగిందన్న LOP రాహుల్ గాంధీ <<17330640>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అత్యవసరమన్నారు. ‘పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్ట్‌ రిలీజ్ చేయాలని ECని డిమాండ్ చేస్తున్నాం. http://votechori.in/ecdemandను విజిట్ చేసి, లేదా 9650003420కు మిస్డ్ కాల్ ఇచ్చి మాకు మద్దతు తెలపండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

News August 10, 2025

APL: 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

image

ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో విజయవాడ సన్‌షైనర్స్ ప్లేయర్ జహీర్ అబ్బాస్ సంచలనం నమోదు చేశారు. కాకినాడ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో 17 బంతుల్లోనే ఫిఫ్టీ బాదారు. 19 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 57 రన్స్ చేశారు. ఈ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. జహీర్, తేజ(46*) విధ్వంసంతో విజయవాడ 195 పరుగులు చేసింది. కాకినాడ పరుగుల వేటలో పడింది.

News August 10, 2025

చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు: జగన్

image

AP: CM చంద్రబాబు అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని YCP అధినేత జగన్ ఫైరయ్యారు. ‘పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి TDP గూండాలు, కొంతమంది అధికారులు, పోలీసులు మా పార్టీ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. YCP ఓటర్లను ఇబ్బందిపెట్టేందుకు 4KM దూరంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేవుడు, ప్రజలపై నమ్మకం ఉంది. ధర్మమే గెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.

News August 10, 2025

విషాదం.. పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతి

image

TG: పెళ్లైన రెండు రోజులకే వరుడు మరణించిన ఘటన రంగారెడ్డిలోని బడంగ్ పేట్‌లో చోటు చేసుకుంది. లక్ష్మీదుర్గకాలనీకి చెందిన విశాల్‌(25)కు ఈ నెల 7న వివాహమైంది. తెల్లవారుజామున వధువుతో ఇంటికి చేరుకోగానే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 10, 2025

డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్

image

AP: డోలి రహిత గిరిజన గ్రామాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సవాళ్లు ఎదురైతే ప్రణాళికబద్ధంగా అధిగమించాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే రోడ్ల నిర్మాణాలపై పంచాయతీరాజ్ అధికారులతో వర్చువల్‌గా ఆయన సమావేశమయ్యారు. ‘అడవితల్లి బాట’ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజలకు ఈ ప్రాజెక్టు అవశ్యకతను తెలియజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News August 10, 2025

ఛత్తీస్‌గఢ్ యువకుడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. ట్విస్ట్ ఏంటంటే?

image

ఛత్తీస్‌గఢ్‌లో మనీశ్‌ అనే యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. అతడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్ చేశారు. అతడు వాడుతున్న మొబైల్ నంబర్ గతంలో RCB కెప్టెన్ రజత్ పాటీదార్ ఉపయోగించడమే కారణం. 6 నెలలపాటు ఇన్‌యాక్టివ్‌గా ఉండటంతో నంబర్‌ను మనీశ్‌కు కేటాయించింది కంపెనీ. ఈ విషయం కాస్తా పోలీసులకు చేరడంతో యువకుడి నుంచి సిమ్ తీసుకొని రజత్ పాటీదార్‌‌కు అప్పగించారు. తాను కోహ్లీ ఫ్యాన్ అని మనీశ్ చెప్పడం విశేషం.